కాంగ్రెస్ నేతలు మోసపూరిత హామీలు ఇచ్చి ప్రజలను వంచించారని మాజీ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. పాపం అంబేద్కర్.. ఇంత దగుల్బాజీ నాయకులు రాష్ట్రాన్ని పరిపాలిస్తారని ఊహించలేదని విమర్శించారు. ఇప్పటికిప్పుడు తెలంగాణలో ఎన్నికలు జరిగితే కేసీఆర్ 100 సీట్లలో ఏకపక్షంగా గెలుస్తారని కేటీఆర్ జోస్యం చెప్పారు.
గత కేసీఆర్ ప్రభుత్వ నిర్ణయాలు తెలంగాణ రాష్ట్రానికి భారంగా మారాయని తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆరోపించారు. కేసీఆర్ పాలనలో చేసిన తప్పిదాలకు నేడు తమ ప్రభుత్వం మూల్యం చెల్లిస్తోందని అన్నారు. గతంలో శ్రీశైలంపైన ఏపీ ప్రభుత్వం ప్రాజెక్ట్లు కడుతుంటే అడ్డుకోకుండా కేసీఆర్ ప్రభుత్వం సహకరించిందని మల్లు భట్టి విక్రమార్క మండిపడ్డారు.
మాజీ కేంద్రమంత్రి, రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరికి ఖమ్మం కోర్టులో ఊరట లభించింది. రేణుకా చౌదరిపై నమోదైన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుని న్యాయస్థానం కొట్టివేసింది. 2014 సంవత్సరంలో వైరా ఎమ్మెల్యే టికెట్ తమకు (భూక్య రాంజీ సతీమణి కళావతి తనకు లేదా తన భర్తకు) ఇప్పిస్తానని రేణుకా చౌదరి మోసం చేశారని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసులోనే రేణుకాకు బిగ్ రిలీఫ్ లభించింది.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల కోసం అనేక పథకాలు తీసుకు వచ్చిందని తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. ప్రజల అవసరాలను తీర్చడమే కాకుండా.. వారికి జవాబుదారీగా తమ ప్రభుత్వం ఉందని ఆయన స్పష్టం చేశారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఖమ్మం జిల్లాలో పర్యటిస్తున్నారు. అందులోభాగంగా మాజీ ఎమ్మెల్యే మదన్లాల్ కుటుంబాన్ని ఆమె పరామర్శించారు. ఈ కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
మహిళా సంఘాలకు త్వరలో 381 డ్రోన్లు పంపిణీ చేస్తున్నామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఇవాళ(గురువారం) ఖమ్మం కలెక్టరేట్లో ఎరువుల సరఫరాపై వ్యవసాయ శాఖ అధికారులతో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమీక్షించారు. ఈ సందర్భంగా తుమ్మల నాగేశ్వరరావు మీడియాతో మాట్లాడారు.
స్థానిక సంస్థల ఎన్నికలకు రంగం సిద్ధమైందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి తెలిపారు. ఈ నెలాఖరులోపు స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ రాబోతుందని అన్నారు. త్వరలో ఎన్నికల తేదీలు ప్రకటిస్తారని చెప్పారు.
రైతు సంక్షేమమే ప్రజా పాలన ధ్యేయమని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. గోదావరి జలాలతో ఉమ్మడి ఖమ్మం జిల్లా సస్యశ్యామలం చేయడం తన రాజకీయ లక్ష్యమని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఉద్ఘాటించారు.
Jyestabhishekam Utsavam: భద్రాచలం కొత్తగూడెం.. భద్రాద్రి రామాలయంలో జ్యేష్ఠాభిషేకం ఉత్సవాలు జరగనున్నాయి. ఈ ఉత్సవాలకు సంబంధించి ఈరోజు ఆలయ అధికారులు అంకురార్పణ చేయనున్నారు.
ఖమ్మం: ఖమ్మం జిల్లాలోని కల్లూరులో అర్ధరాత్రి వేళ షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. మహిళా ఎస్ఐ పై కాంగ్రెస్ నేత దాడి చేయడం తీవ్ర కలకలం రేపుతోంది.