Inter Second Year Exams: ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేందుకు ఇంటర్మీడియట్ విద్యాశాఖ చర్యలు తీసుకుంది. పరీక్షా కేంద్రాల్లో అన్ని వసతులు కల్పించింది. పరీక్షా కేంద్రాలకు విద్యార్థులతో పాటు ఇన్విజిలేటర్లు, ఇతర అధికారులు సెల్ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలు తీసుకురావొద్దని ఆదేశాలు జారీ చేసింది.
ఖమ్మం: పోలీసులు తనను చిత్రహింసలకు గురి చేశారంటూ పోలీస్ స్టేషన్ పైనుంచి ఓ లారీ డ్రైవర్ దూకేశాడు. పరిస్థితి విషమంగా ఉండడంతో పోలీసులు అతన్ని ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
Etela Rajender: కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు ఎంపీ ఈటెల రాజేందర్. కాంగ్రెస్కు నిజాయితీ, చిత్తశుద్ధి ఉంటే అధికారికంగా లెక్కలు స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి ప్రతి నిర్ణయం భూమరాంగ్ అవుతోందన్నారు.
తెలంగాణలో చిరుత పులుల సంచారం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా ఖమ్మం జిల్లా, పెనుబల్లి మండలం, బ్రహ్మళకుంట గ్రామ పరిధిలో చిరుతపులి సంచారం, కలకలం రేపుతోంది. దీంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు.
రైతుల అకౌంట్స్లో రైతు భరోసా నిధులు ఆదివారం అర్ధరాత్రి నుంచి బ్యాంకుల్లో నిధులు జమ చేస్తున్నామని.. సోమవారం నుంచి నగదు తీసుకోవచ్చునని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు.
Mallu Bhatti Vikramarka: ఎవరెన్ని కుట్రలు చేసినా.. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు మాత్రం ఆగవని ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీ అగ్రనేతలకు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. గత ప్రభుత్వంలో నిరుపేదలను పట్టించుకోలేదంటూ బీఆర్ఎస్ నేతలపై ఆయన నిప్పులు చెరిగారు.
ఖమ్మం: జిల్లా కలెక్టర్ అంటేనే పెద్ద బాధ్యత. సమీక్షలు, సమావేశాలు అంటూ ఎప్పుడూ బిజీబిజీగా ఉంటుంటారు. ముఖ్యమంత్రితో చర్చలు, మంత్రులతో మీటింగులు, అధికారులతో సమావేశాలంటూ ఊపిరాడని పని ఉంటుంది. కుటుంబసభ్యులతో కలిసి గడిపే సమయం కూడా వారికి దొరకడం కష్టంగా మారుతుంటుంది.
ఖమ్మం: తెలంగాణలో జనవరి 26 నుంచి రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డుల జారీ మొదలవుతుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. వ్యవసాయ యోగ్యమైన భూములకు ఎలాంటి షరతులు లేకుండా ఎకరానికి రూ.12 వేలు ఇవ్వబోతున్నట్లు ఆయన వెల్లడించారు.
భద్రాద్రి కొత్తగూడెం: ఛత్తీస్ గడ్, బీజాపూర్ జిల్లాలో జరిగిన ఎన్ కౌంటర్తో తెలంగాణ పోలీసులు అప్రమత్తమయ్యారు. తెలంగాణ.. ఛత్తీస్గడ్ సరిహద్దు వద్ద హై అలర్ట్ చేశారు. మావోయిస్టలు ప్రతీకార దాడులకు పాల్పడే అవకాశం ఉందని నిఘా వర్గాల సమాచారం మేరకు తెలంగాణ ఛత్తీస్ గడ్ సరిహద్దు నివురు గప్పిన నిప్పులా మారింది. భారీగా సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది.
Minister Thummala Nageswara Rao: ఖమ్మం మార్కెట్ అధికారులపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. మార్కెట్లో కరెంట్ షార్ట్ సర్క్యూట్ జరిగిన తర్వాత సిబ్బంది నిర్లక్ష్యం చేయడంపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.మార్కెట్ అధికారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు.