Home » YSRCP Cadre
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతిపై కొంతమంది పనిగట్టుకొని విష ప్రచారానికి దిగుతున్నారు. అమరావతిపై ఇప్పటివరకు వైసీపీ నేతలు విష ప్రచారం చేయగా.. ఇప్పుడు వారి సానుభూతిపరులతో కూడా అమరావతిపై విషం చిమ్ముతున్నారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రెంటపాళ్ల పర్యటన ఘటనలో 113 మంది వైసీపీ నేతలకు పల్నాడు జిల్లా పోలీసులు ఆదివారం నోటీసులు ఇచ్చారు. ప్రజా ఆస్తికి నష్టం కలిగించారనే కారణంతో వైసీపీ నేతలకు నోటీసులు ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు.
పొన్నూరు దాడి ఘటనపై వైసీపీ నేతలు కావాలనే రాజకీయం చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నేతలు ప్రతి విషయాన్ని అనవసరంగా రాద్దాంతం చేస్తున్నారని ధూళిపాళ్ల నరేంద్ర మండిపడ్డారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ఐదేళ్లు జగన్కి అధికారం ఇస్తే ఏం చేశారని రామ్మోహన్ నాయుడు ప్రశ్నించారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సత్తెనపల్లి నియోజకవర్గంలో ఈ నెల 18వ తేదీన పర్యటించారు. వైసీపీ నేత నాగమల్లేశ్వరరావు కుటుంబాన్ని జగన్ పరామర్శించారు. అయితే జగన్ పర్యటన సందర్భంగా ఫ్యాన్ పార్టీ శ్రేణులు భారీగా తరలి వచ్చారు.
వైసీపీ నేతలపై గుమ్మనూరు జయరాం సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ (శుక్రవారం) గుత్తిలో టీడీపీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైసీపీ నేతలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.
జగన్ అబద్దపు మాటలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు చెప్పారు. అరాచక ర్యాలీ, పైశాచిక ప్రవర్తనతో ఇద్దరు చనిపోయారని.. వారిని ఎందుకు జగన్ రెడ్డి పరామర్శించ లేదని దేవినేని ఉమామహేశ్వర రావు ప్రశ్నించారు.
'రప్పా.. రప్పా నరుకుతారట'.!, 'కు.. చెక్కేస్తాం'.. 'తొక్కుకుంటూ పోతాం'.. 'అంతు చూస్తాం..' 'నరుకుతాం నా కొడకల్లారా...' అంటోన్న ఉన్మాదులని నిస్సిగ్గుగా సమర్ధించుకుంటున్న జగన్ రెడ్డి, వీటి గురించి ఏమి చెప్తావ్ ? అని..
గత కొంతకాలంగా మనోహర్ వర్గం, తన్నీరు నాగేశ్వరరావు వర్గం మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. జగ్గయ్యపేట నియోజకవర్గంలో వైసీపీలోని నేతలు రెండు వర్గాలుగా చీలిపోవడంతో హై కమాండ్ పిలుపునిచ్చిన ఏ కార్యక్రమం అంతగా విజయవంతం చేయలేకపోతున్నారని స్థానిక కేడర్ తెలిపారు.
Kavali Pylon Toppling Case: కావలిలో అమృత్ పథకంలో భాగంగా పైలాన్ కూలదోసిన కేసులో నలుగురిని ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. వారిని పోలీసులు విచారణ చేస్తున్నారు. పోలీసుల విచారణలో పలుకీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.