Home » YSR Congress
అధికార వైసీపీతో అంటకాగిన డీజీపీ కేవీ రాజేంద్రనాథ్ రెడ్డిపై బదిలీ వేటు పడింది. కొత్త డీజీపీగా ఎవరొస్తున్నారు..? రేసులో ఎవరెవరున్నారు..? ఎవరికి ఈ పదవి దక్కే ఛాన్స్ ఉంది..? ఇప్పుడిదే ఏపీ రాజకీయాల్లో జరుగుతోన్న పెద్ద చర్చ..!!
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా (AP Elections) అందరి దృష్టిని ఆకర్షిస్తున్న నియోజకవర్గాల్లో కృష్ణా జిల్లాలోని గుడివాడ (Gudivada) ఒకటి. ప్రధాన పార్టీ అభ్యర్థులిద్దరూ ఆర్థిక, అంగబలాల్లో సమాన స్థాయిలో ఉండడంతో గుడివాడ పోరు ఆసక్తి రేపుతోంది. వైసీపీ అభ్యర్థిగా మాజీ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు అలియాస్ నాని (Kodali Nani), టీడీపీ–జనసేన–బీజేపీ కూటమి తరఫున టీడీపీ అభ్యర్థిగా ఎన్నారై వెనిగండ్ల రాము (Venigandla Ramu) పోటీ చేస్తున్నారు..
ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు కీలక దశకు చేరుకున్నాయి. పోలింగ్కు కేవలం వారం రోజులు మాత్రమే ఉంది. దీంతో చివరి అస్త్రాలు ఏమున్నాయా అని బయటికి తీసే పనిలో అధికార, ప్రతిపక్షాలు నిమగ్నమయ్యాయి. మరోవైపు.. పోస్టల్ బ్యాలెట్ ఓట్లు వేయడానికి ఉద్యోగులు కదం తొక్కుతున్నారు.
రైతుల భూముల హక్కులకు ముప్పు తెచ్చేలా ఉన్న ల్యాండ్ టైటిల్ చట్టం సెగ అధికార వైసీపీకి, ముఖ్యమంత్రి జగన్కు గట్టిగానే తగులుతోంది..
అనకాపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్పై (CM Ramesh) వైసీపీ మూకలు దాడికి తెగబడ్డాయి. ఈ దాడిలో రమేష్కు స్వల్పగాయాలవ్వగా.. చొక్కా చిరిగిపోయింది. మరోవైపు.. ఆయన కారుతో పాటు కాన్వాయ్లోని మూడు కార్లపై వైసీపీ శ్రేణులు దాడి చేశారు. అయితే ఇంత జరుగుతున్నా పోలీసులు పట్టించుకోకపోవడం గమనార్హం..
ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్నా వైసీపీ అరాచకాలు, ఆగడాలు ఆగట్లేదు. అనకాపల్లి వైసీపీ ఎంపీ అభ్యర్థి బూడి ముత్యాల నాయుడు రెచ్చిపోయిన ఘటన అందరికీ తెలిసే ఉంటుంది. సొంత బావమరిది అని కూడా చూడకుండా అధికారంను అడ్డుపెట్టుకుని వైసీపీ నేతలు దౌర్జన్యం చేశారు.
ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు (AP Elections) కీలక దశకు చేరుకున్నాయి. పట్టుమని పదిరోజులు కూడా పోలింగ్ లేకపోవడంతో.. ఇక చివరిగా అస్త్రాలు సంధించడానికి అధికార, ప్రతిపక్షాలు సన్నాహాలు చేసుకుంటున్నాయి. ఈ పరిస్థితుల్లో వైసీపీ గురించి.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) గురించి ఓ ఇంట్రెస్టింగ్ విషయం బయటికొచ్చింది. అదేమిటంటే..
ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు (AP Elections) కీలక దశకు చేరుకున్నాయి. పట్టుమని పదిరోజులు కూడా సమయం లేకపోవడంతో అభ్యర్థులు అస్త్రాలను బయటికి తీస్తున్నారు. అయితే.. అదేంటో కానీ మంత్రి రోజాపై మాత్రం సొంత పార్టీ నేతలే రివర్స్ అవుతున్నారు. అంటే.. రోజాపైనే సొంత మనుషులు రివర్స్ అస్త్రాలు వదులుతున్నారన్న మాట!
ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు (AP Elections) కీలక దశకు చేరుకున్నాయ్..! దీంతో అధికార, ప్రతిపక్ష పార్టీలు చివరి అస్త్రాలుగా ఏమున్నాయా..? అని బయటికి తీసే పనిలో నిమగ్నమయ్యాయి. కుట్రలు, కుతంత్రాలు చేస్తూనే.. కీలక నేతలు, పార్టీల అధిపతులు పోటీ చేస్తున్న నియోజకవర్గాల్లో వైసీపీ (YSR Congress) ఓ రేంజిలో టార్గెట్ చేస్తూ వస్తోంది. ఈ క్రమంలోనే పిఠాపురం (Pithapuram) నుంచి పోటీచేస్తున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్పై (Pawan Kalyan) కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభంను (Mudragada Padmanabham) ఉసిగొల్పింది వైసీపీ..
ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు (AP Elections) కీలక దశకు చేరుకునే సరికి.. అధికార, ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఇక పార్టీ మారిన నేతలు అయితే.. బాబోయ్ మునుపటి పార్టీ బాగోతం బట్టబయలు చేస్తున్నారు. సమయం, సందర్భం దొరికినప్పుడల్లా మీడియా మీట్, బహిరంగ సభలు, సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ దుమ్ముదులిపేస్తున్నారు. తాజాగా.. ప్రముఖ క్రికెటర్, జనసేన నేత అంబటి రాయుడు (Ambati Rayudu) వైసీపీ (YSR Congress) గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన అన్నది ఒకే ఒక్క మాటే అయినా.. ఇప్పుడిదే హాట్ టాపిక్ అవుతోంది. ఇంకెందుకు ఆలస్యం ఆయన ఏమన్నారో చూసేద్దాం రండి..!