Home » YS Sunitha Reddy
తెలుగు రాష్ట్రాల్లో (Telugu States) పెను సంచలనం సృష్టించిన ఏపీ సీఎం వైఎస్ జగన్ రెడ్డి బాబాయ్, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు (YS Viveka Murder Case) దాదాపు చివరి అంకానికి చేరుకుంది. ఈ క్రమంలోనే సీబీఐ (CBI) దర్యాప్తును అధికారులు వేగవంతం చేశారు. అతి త్వరలోనే ఈ కేసు ముగింపునకు వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి..
వివేకా హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. తన అర్హతపై స్పష్టత ఇవ్వాలని ఏ9 ఎంవీ కృష్ణారెడ్డి దాఖలు చేసిన పిటీషన్ను సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది. కేసును పూర్తిగా విని మెరిట్స్ ఆధారంగా నిర్ణయం తీసుకునే స్వేచ్ఛను హైకోర్టుకే వదిలేసింది. దస్తగిరికి క్షమాభిక్ష ప్రసాదించడాన్ని సవాలు చేసేందుకు అర్హత ఉన్న వ్యక్తిగా తనను గుర్తించాలని హైకోర్టులో ఎంవీ కృష్ణారెడ్డి పిటిషన్ దాఖలు చేశారు.
వైఎస్ వివేకా హత్య కేసులో తనను బాధితునిగా గుర్తించాలని ఎంవీ కృష్ణారెడ్డి దాఖలు చేసిన పిటీషన్పై విచారణ 5వ తేదీకి వాయిదా పడింది. తొలుత ఈ కేసును హైకోర్టు కే పంపుతామని సుప్రీం ధర్మాసనం తెలిపింది. ఈ విషయంపై తెలంగాణ హైకోర్టులో పిటిషన్ పెండింగులో ఉన్నందున ముందు అక్కడ తేల్చుకోవాలని సుప్రీం వెల్లడించింది.
సుప్రీంకోర్టులో మాజీ మంత్రి వైఎస్ వివేకా కూతురు సునీత రెడ్డి పిటిషన్ దాఖలు చేశారని.. ఆమె పట్టువదలని వీరవనిత లాగా ముందుకు వెళుతున్నారని ఎంపీ రఘురామ కృష్ణరాజు వెల్లడించారు. అవినాష్ రెడ్డి, సీబీఐకి సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చిందన్నారు. సీబీఐ విచారణ జూన్ 30 లోగా పూర్తి చేయాలని గతంలో సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చిందన్నారు. ఇప్పుడు సీబీఐ విచారణ పొడగించాల్సిన అవసరం కూడా ఉందన్నారు.
నేడు జగన్ బాబాయి వైఎస్ వివేకా కేసులో వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దుపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. తదుపరి విచారణ 19కి వాయిదా పడింది. సీనియర్ల లాయర్ల వాదనలను వినబోమని కోర్టు చెప్పడం వల్ల తన కేసును సునీతారెడ్డి తానే వాదించుకున్నారు. సీనియర్ లాయర్ల వాదనలు విననందున సీబీఐకి నోటీసులు జారీచేసే విషయాన్ని ధర్మాసనం పట్టించుకోలేదు. అదనపు డాక్యుమెంట్లు దాఖలు చేయడానికి సునీతారెడ్డికి సుప్రీంకోర్టు అవకాశం ఇచ్చింది.
తెలుగు రాష్ట్రాల్లో పెను ప్రకంపనలు రేపిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో (YS Viveka Case) భాస్కర్ రెడ్డి బెయిల్ పిటిషన్ను (Bhaskar Reddy Bail Petition) సీబీఐ కోర్టు కొట్టివేసిన సంగతి తెలిసిందే.
సునీత లాంటి కూతురు ఉంటే బాగుంటుందని అనిపించిందని నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు
వైఎస్ వివేకా హత్య కేసులో ఎంపీ అవినాష్ రెడ్డి మధ్యంతర బెయిల్ రద్దు చేయాలని సుప్రీంకోర్టులో ఆయన కూతురు సునీతారెడ్డి పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. నేడు ధర్మాసనం ముందు సునీత రెడ్డి తరఫు న్యాయవాది సిద్ధార్థ లుత్రా కేసు మెన్షన్ చేశారు. మంగళవారం విచారణ జరుపుతామని జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ రాజేష్ బిందాల్ తో కూడిన ధర్మాసనం వెల్లడించింది.
వివేకా హత్య కేసులో ఎనిమిదో నిందితుడిగా అవినాశ్ను చేర్చడం అనేది సీబీఐని కచ్చితంగా
మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో ఎంపీ అవినాశ్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దుపై సునీత దాఖలు చేసిన పిటిషన్ను రేపు సుప్రీంకోర్టు విచారించనుంది. సుప్రీం వెకేషన్ బెంచ్ ముందు నేడు సునీత తరపు సీనియర్ లాయర్ సిద్ధార్ధ్ లూధ్రా ప్రస్తావించారు. ఈ మేరకు సునీత పిటిషన్ను రేపు మెన్షన్ చేయడానికి సుప్రీంకోర్టు అనుమతించింది.