Home » YS Sunitha Reddy
ఇవాళ మాజీ మంత్రి, సీఎం వైఎస్ జగన్ బాబాయ్ జయంతి. అయితే జగన్ సహా ఎవరూ కూడా ఆయన జయంతిని పట్టించుకున్న పాపాన పోలేదు. దీనిపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పెద్ద ఎత్తున సెటైర్లు వేశారు.
జగన్ ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించడానికి తన సోదరి డా. వైఎస్ సునీతారెడ్డే (Dr YS Sunitha Reddy) దగ్గరుండి చూసుకుంటూ వచ్చారు...
పులివెందులలో టీడీపీ అధినేత చంద్రబాబు మాట్లాడిన వ్యాఖ్యలను ఎంపీ అవినాష్ రెడ్డి ఖండించారు. నేడు అవినాష్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్ వివేకాహత్య కేసులో తనను, తన కుటుంబాన్ని సర్వనాశనం చేయాలని చంద్రబాబు, వైఎస్ వివేకా కూతురు సునీత, అలాగే బీజేపీలో ఉన్న టీడీపీ నాయకులు రెండేళ్లుగా కుట్ర పన్నారన్నారు.
ప్రైవేట్ డిటెక్టివ్కైనా ఇంగిత జ్ఞానం ఉంటుంది. సీబీఐ ఛార్జ్షీట్లో కల్పిత కథలే కనిపిస్తున్నాయి. బేసిక్ లాజిక్ను సీబీఐ మిస్ చేసింది. జగన్ను డీమోరలైజ్ చేయడానికే వివేకాను చంపారు. కీలక విషయాలను సీబీఐ పట్టించుకోవట్లేదు.
హైదరాబాద్: వివేకా కుమార్తె నర్రెడ్డి సునీత సీబీఐకి కీలక విషయాలు వెల్లడించారు. వివేకా హత్య కేసు ఛార్జిషీటుతో పాటు సునీత వాంగ్మూలాలను కూడా సీబీఐ అధికారులు కోర్టుకు సమర్పించారు.
తెలుగు రాష్ట్రాల్లో (Telugu States) పెను సంచలనం సృష్టించిన ఏపీ సీఎం వైఎస్ జగన్ రెడ్డి బాబాయ్, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు (YS Viveka Murder Case) దాదాపు చివరి అంకానికి చేరుకుంది. ఈ క్రమంలోనే సీబీఐ (CBI) దర్యాప్తును అధికారులు వేగవంతం చేశారు. అతి త్వరలోనే ఈ కేసు ముగింపునకు వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి..
వివేకా హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. తన అర్హతపై స్పష్టత ఇవ్వాలని ఏ9 ఎంవీ కృష్ణారెడ్డి దాఖలు చేసిన పిటీషన్ను సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది. కేసును పూర్తిగా విని మెరిట్స్ ఆధారంగా నిర్ణయం తీసుకునే స్వేచ్ఛను హైకోర్టుకే వదిలేసింది. దస్తగిరికి క్షమాభిక్ష ప్రసాదించడాన్ని సవాలు చేసేందుకు అర్హత ఉన్న వ్యక్తిగా తనను గుర్తించాలని హైకోర్టులో ఎంవీ కృష్ణారెడ్డి పిటిషన్ దాఖలు చేశారు.
వైఎస్ వివేకా హత్య కేసులో తనను బాధితునిగా గుర్తించాలని ఎంవీ కృష్ణారెడ్డి దాఖలు చేసిన పిటీషన్పై విచారణ 5వ తేదీకి వాయిదా పడింది. తొలుత ఈ కేసును హైకోర్టు కే పంపుతామని సుప్రీం ధర్మాసనం తెలిపింది. ఈ విషయంపై తెలంగాణ హైకోర్టులో పిటిషన్ పెండింగులో ఉన్నందున ముందు అక్కడ తేల్చుకోవాలని సుప్రీం వెల్లడించింది.
సుప్రీంకోర్టులో మాజీ మంత్రి వైఎస్ వివేకా కూతురు సునీత రెడ్డి పిటిషన్ దాఖలు చేశారని.. ఆమె పట్టువదలని వీరవనిత లాగా ముందుకు వెళుతున్నారని ఎంపీ రఘురామ కృష్ణరాజు వెల్లడించారు. అవినాష్ రెడ్డి, సీబీఐకి సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చిందన్నారు. సీబీఐ విచారణ జూన్ 30 లోగా పూర్తి చేయాలని గతంలో సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చిందన్నారు. ఇప్పుడు సీబీఐ విచారణ పొడగించాల్సిన అవసరం కూడా ఉందన్నారు.
నేడు జగన్ బాబాయి వైఎస్ వివేకా కేసులో వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దుపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. తదుపరి విచారణ 19కి వాయిదా పడింది. సీనియర్ల లాయర్ల వాదనలను వినబోమని కోర్టు చెప్పడం వల్ల తన కేసును సునీతారెడ్డి తానే వాదించుకున్నారు. సీనియర్ లాయర్ల వాదనలు విననందున సీబీఐకి నోటీసులు జారీచేసే విషయాన్ని ధర్మాసనం పట్టించుకోలేదు. అదనపు డాక్యుమెంట్లు దాఖలు చేయడానికి సునీతారెడ్డికి సుప్రీంకోర్టు అవకాశం ఇచ్చింది.