Home » YS Sharmila
ముఖ్యమంత్రి వైఎస్ జగన్పై(YS Jagan) ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల(YS Sharmila) షాకింగ్ కామెంట్స్ చేశారు. జగన్ మానసిక పరిస్థితి చూస్తుంటే తనకు భయంగా ఉందని అన్నారు. శనివారం మీడియాతో మాట్లాడిన షర్మిల.. జగన్ తనపై తప్పుడు ప్రచారం చేయిస్తున్నారని ఫైర్ అయ్యారు. ‘జగన్ మానసిక పరిస్థితి గురించి నాకు భయంగా ఉంది. అద్దం(Mirror) పంపిస్తున్నా..
ఏపీ సీఎం జగన్ కన్ఫ్యూజన్లో ఉన్నారా.. ఓటమి భయం ఆయనను వెంటాడుతుందా.. ఐదేళ్ళలో రాష్ట్రానికి ఏం చేశామో చెప్పుకునే పరిస్థితుల్లో లేరా.. ఏ ప్రశ్న వేసినా సూటిగా ఎందుకు సమాధనాం చెప్పలేకపోతున్నారు.. సరైన సమాధానం చెప్పడానికి ఎందుకు సంకోషిస్తున్నారు.. ప్రశ్నలు అడిగితే టెన్షన్ ఎందుకు పడుతున్నారు.. ఇప్పడు ఏపీ ప్రజల మదిలో మెదులుతున్న ప్రశ్నలు ఇవే..
Andhrapradesh: మద్యం నిషేధంపై ముఖ్యమంత్రి ఇచ్చిన హామీపై కడప ఎంపీ అభ్యర్థి, ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల మరోసారి ప్రశ్నలు సంధించారు. మద్యాన్ని పూర్తిగా నిషేధిస్తామని, మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రకారం హామీలు నెరవెరుస్తామని.. పూర్తి మద్య నిషేధం తర్వాతే 2024 ఎలక్షన్లో ఓట్లు అడుగుతానంటూ 2019 ఎన్నికల సమయంలో సీఎం జగన్ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ విషయంపై వైఎస్ షర్మిల మరోసారి ప్రశ్నలు సంధించారు.
ఆంధ్రప్రదేశ్ ప్రచార పర్వంలో పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల క్షణం తీరిక లేకుండా ఉన్నారు. గత ఎన్నికల సమయంలో జగన్ ఇచ్చిన హామీలు, ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు. మద్య నిషేదం గురించి నవ సందేహాల పేరుతో మరో లేఖ రాశారు. సంపూర్ణ మద్యపాన నిషేధం ఎందుకు అమలు కాలేదని.. వివిధ బ్రాండ్ల పేరుతో ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
Andhrapradesh: రాష్ట్రంలో పింఛన్ల పేరుతో వృద్ధుల ప్రాణాలతో జగన్ ప్రభుత్వం చెలగాటమాటమాడుతోందని ఏపీపీసీ ఛీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. వృద్ధులను ఒక్కో నెల ఒక్కోరకంగా వీధుల్లోకీడ్చి పొట్టన పెట్టుకుంటున్నారని మండిపడ్డారు. వృద్ధుల ఉసురు కొట్టుకోవద్దని సీఎస్కు సూచిస్తున్నానన్నారు.
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల దూసుకెళ్తున్నారు. తన సోదరుడు, సీఎం జగన్ లక్ష్యంగా విమర్శలు చేస్తున్నారు. పెద్దముడియం మండలం సుద్ధపల్లి గ్రామం నుంచి ఈ రోజు ప్రచారం ప్రారంభించారు.
ఓటరు తిరగబడితే ఏమవుతుంది.. ఫలితం తారుమరవుతుంది.. అందుకే ఎన్నికల సమయంలో ఓటర్లే దేవుళ్లు.. ఐదేళ్ల పాటు నాయకుల చుట్టూ ప్రజలు తిరిగితే.. ఎన్నికల ముందు మాత్రం నాయకులే ఓటర్ల ముందుకు వస్తారు. మాకు ఓటు వేయండి.. మీ సమస్యలన్నీ తీర్చేస్తామంటూ హామీలిస్తారు. కొంతమంది ప్రజలు నాయకుల మాటలు నమ్మి ఓటు వేస్తే.. మరికొంతమంది ఓటు ఎవరో ఒకరికి వేయాలి కదా అని ఓటు వేస్తుంటారు. ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే సాధారణంగా చాలామంది ప్రజల్లో నాయకులు, పార్టీలపై కోపం ఉంటుంది. అందుకే ఎన్నికల్లో ఫలితాలు ఊహించిన విధంగా ఉండవు. ఒక్కో నియోజకవర్గంలో ఒక్కోలా ఫలితాలు ఉంటాయి. ప్రస్తుతం ఏపీలో అసెంబ్లీ ఎన్నికల వేళ ఓటరు వైసీపీ ప్రభుత్వంపై తమ అసంతృప్తిని బయటపెడుతున్నారు.
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి హయాంలో వ్యవసాయం పండుగలా ఉండేదని ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల (YS Sharmila) అన్నారు. బద్వేల్ నియోజక వర్గం, పోరు మామిళ్ల మండలాల్లో బుధవారం షర్మిల ఎన్నికల ప్రచారాల్లో పాల్గొన్నారు. ఈ భారీ బహిరంగ సభల్లో సీఎం జగన్, వైసీపీ ప్రభుత్వంపై షర్మిల తీవ్ర విమర్శలు గుప్పించారు. తాను పుట్టింది ఇక్కడేనని.. ఇది నా గడ్డ అని తెలిపారు.ఇక్కడే ఉంట..ప్రజలకు సేవ చేస్తానని మాటిచ్చారు. తనను కడప ఎంపీగా గెలిపిస్తే ..కేంద్రంలో మంత్రిని కూడా అవుతానని స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల వేళ ప్రధాన పార్టీల అధినేతలు క్షణం తీరిక లేకుండా ఉన్నారు. ఏపీ సీఎం వైఎస్ జగన్ లక్ష్యంగా ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. తనను కడప ఎంపీగా గెలిపిస్తే కేంద్రంలో మంత్రిని అవుతానని షర్మిల అన్నారు. ప్రత్యేక హోదా సాధిస్తానని స్పష్టం చేశారు. బద్వేలు నియోజకవర్గం పోరుమామిళ్ల మండలంలో జరిగిన బహిరంగ సభలో షర్మిల మాట్లాడారు.
Andhrapradesh: ఎన్నికల ప్రచారంలో సొంత అన్న, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఏపీసీసీ చీఫ్ షర్మిల, కడప ఎంపీ అభ్యర్థి వ్యాఖ్యలు ఏ రేంజ్లో ఉన్నాయో అందరికీ తెలిసిందే. జగన్ పాలనలో రాష్ట్రంలో అభివృద్ధిపై పాతాళానికి దిగజారి పోయిందంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా ఎస్సీ, ఎస్టీల అభివృద్ధిపై ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి ఏపీసీసీ చీఫ్ బహిరంగ లేఖ రాశారు.