Home » YS Sharmila
ఆంధ్రప్రదేశ్: రాజధాని లేని రాష్ట్రంగా ఏపీని వైసీపీ ఐదేళ్లపాటు పాలిస్తుంటే కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు కనిపించలేదా అని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి ప్రశ్నించారు. ఇష్టారాజ్యంగా రూ.10 లక్షల కోట్లు అప్పులు చేస్తుంటే విధ్వంసం జరుగుతున్నట్లు అనిపించలేదా అంటూ ఆమె మండిపడ్డారు.
YS Sharmila: కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ను అమిత్ షా అవమానించారని మండిపడ్డారు. అమిత్ షా క్షమాపణలు చెప్పాలని వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు.
YS Sharmila: ఎన్నికల్లో సూపర్ సిక్స్ అంటూ ఆర్భాటం చేసిన బాబు.. అమలుకొచ్చేసరికి ఆదాయం పెరిగితేనే అంటూ మడతపేచి పెట్టారంటూ వైఎస్ షర్మిల కామెంట్స్ చేశారు. అప్పులు దొరకవని, ఆదాయం పెంచుకోవాలని, తలసరి ఆదాయం పెరగాలని, మనుషులు మన ఆస్తి అంటూ వింత వింత మాటలు చెప్తున్నారన్నారు. ఆడలేక మద్దెల దరువన్నట్లుంది బాబు వ్యవహారమన్నారు.
ఏఐసీసీ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ(Rahul Gandhi)ని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి (YS Sharmila Reddy) మర్యాదపూర్వకంగా కలిశారు. ఇవాళ (బుధవారం) ఢిల్లీలోని ఏఐసీసీ కేంద్ర నూతన కార్యాలయ ప్రారంభోత్సవం సందర్భంగా నిన్ననే ఆమె ఢిల్లీకి చేరుకున్నారు.
‘బీజేపీ మతపిచ్చి పార్టీ. కుల మతాలతో ఆ పార్టీ రాజకీయం చేస్తోంది. జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ను బీజేపీ పనిముట్టలా వాడుకుంటోంది’ అని ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల మండిపడ్డారు.
YS Sharmila: సీబీఐ, ఈడీ వంటి అన్ని ప్రభుత్వ వ్యవస్థలను బీజేపీ తమ గుప్పిట్లో పెట్టుకున్నారని.. ఆ వ్యవస్థ లను వారి స్వార్థం కోసం దుర్వినియోగం చేస్తున్నారని వైఎస్ షర్మిల దుయ్యబట్టారు. దేశం మొత్తాన్ని కాషాయ మయం చేసే కుట్రలు చేస్తున్నారన్నారు. ఫాదర్ ఆఫ్ ది నేషన్ మహాత్మాగాంధీని బీజేపీ విలన్గా చిత్రీకరించిందని తెలిపారు. ఆయన్ను చంపిన వారిని హీరోగా ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
YS Sharmila: పార్లమెంట్లో కేంద్ర హోం మంత్రి అమిత్ షా అంబేద్కర్ను అవమానించారని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మండిపడ్డారు. అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాత, వారి రాజ్యాంగం వల్ల ప్రజా స్వామ్యం కాపాడపడుతోందని తెలిపారు. అంబేద్కర్ కోసం కాంగ్రెస్ పార్టీ జపం చేస్తే తప్పేంటని ప్రశ్నించారు.
YS Sharmila Reddy: లక్షలాది మంది భక్తులు వస్తారని తెలిసి కూడా కనీస ఏర్పాట్లు చేయకపోవడం పాలన యంత్రాంగం వైఫల్యానికి నిదర్శనమంటూ వైఎస్ షర్మిల వ్యాఖ్యలు చేశారు. తొక్కిసలాటలో ఆరుగురు భక్తులు చనిపోయిన ఘటనపై నైతిక బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం వహించాలని డిమాండ్ చేశారు.
Andhrapradesh: ‘‘చంద్రబాబు గారు.. మీరు మోడీ కోసం ఎదురు చూస్తుంటే.. ఆయన ఇచ్చిన వాగ్దానాల కోసం రాష్ట్రం ఎదురు చూస్తోంది’’ అని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల అన్నారు. విభజన హామీలపై చేసిన మోసాలపై నిలదీసేందుకు ప్రజానీకం ఎదురు చూస్తోందన్నారు.
Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్డేట్స్ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్తో ఇక్కడ చూసేయండి.