Home » YS Sharmila
YS Sharmila: నీతి ఆయోగ్ రిపోర్ట్ ముందుపెట్టి, డబ్బులుంటేనే పథకాలని నీతి సూక్తులు చెప్పారని సీఎం చంద్రబాబును వైఎస్ షర్మిల విమర్శించారు. పథకాలు కావాలంటే ఆదాయం పెంచాలట.. మోకాలికి బోడి గుండుకు ముడిపెట్టినట్లుంది చంద్రబాబు తీరు ఉందని అన్నారు. నమ్మి అధికారం ఇస్తే రాష్ట్ర ప్రజలను ఘోరంగా మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 50 లక్షల మంది అన్నదాతలను వంచించారని..80 లక్షల మంది విద్యార్థులకు ద్రోహం చేశారన్నారు.
గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విజయవాడ ఆంధ్ర రత్న భవన్లో జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఆమె రాష్ట్ర ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ప్రధాని మోదీ ప్రభుత్వ సంస్థలను గుప్పిట్లో పెట్టుకొని దుర్వినియోగం చేస్తున్నారని, పార్లమెంట్ వేదికగా అంబేద్కర్ను అవమానించారని ఆమె విమర్శించారు.
వివేకా హత్య విషయంలో నిజాలు చెప్పిన సాయిరెడ్డి, మిగిలిన విషయాలు కూడా బయటపెట్టాలని పీసీసీ చీఫ్ షర్మిల వ్యాఖ్యానించారు.
YS Sharmila: వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డికి ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చురకలు అంటించారు. జగన్ను వీసా రెడ్డి వంటి వారే వదిలేస్తున్నారంటే ఆలోచన చేయాలని అన్నారు. ఒక్కొక్కరుగా జగన్ను వదిలి బయటకు వస్తున్నారని వైఎస్ షర్మిల విమర్శించారు.
YS Sharmila: ప్రతిపక్షంలో ఉండగా అదానీ మీకు శత్రువని.. అధికార పక్షంగా అదే అదానీ మిత్రుడయ్యారని వైఎస్ షర్మిల విమర్శించారు. గత ప్రభుత్వం సెకీతో చేసుకున్న ఒప్పందంలో అవినీతి జరిగిందని ఆరోపించారు. అదానీ పవర్ తో చేసుకున్న అగ్రిమెంట్ వెనుక స్వయంగా మాజీ ముఖ్యమంత్రి రూ.17వందల కోట్లు ముడుపులు తీసుకున్నారని అమెరికన్ దర్యాప్తు సంస్థ ఎఫ్బీఐ స్పష్టంగా రిపోర్ట్ ఇచ్చిందన్నారు.
‘దమ్ముంటే గత ఐదేళ్ల వైసీపీ పాలనపై వెంటనే కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ జరిపించాలి’ అని కేంద్ర హోం మంత్రి అమిత్ షాను పీసీసీ అధ్యక్షురాలు షర్మిల డిమాండ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్: రాజధాని లేని రాష్ట్రంగా ఏపీని వైసీపీ ఐదేళ్లపాటు పాలిస్తుంటే కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు కనిపించలేదా అని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి ప్రశ్నించారు. ఇష్టారాజ్యంగా రూ.10 లక్షల కోట్లు అప్పులు చేస్తుంటే విధ్వంసం జరుగుతున్నట్లు అనిపించలేదా అంటూ ఆమె మండిపడ్డారు.
YS Sharmila: కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ను అమిత్ షా అవమానించారని మండిపడ్డారు. అమిత్ షా క్షమాపణలు చెప్పాలని వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు.
YS Sharmila: ఎన్నికల్లో సూపర్ సిక్స్ అంటూ ఆర్భాటం చేసిన బాబు.. అమలుకొచ్చేసరికి ఆదాయం పెరిగితేనే అంటూ మడతపేచి పెట్టారంటూ వైఎస్ షర్మిల కామెంట్స్ చేశారు. అప్పులు దొరకవని, ఆదాయం పెంచుకోవాలని, తలసరి ఆదాయం పెరగాలని, మనుషులు మన ఆస్తి అంటూ వింత వింత మాటలు చెప్తున్నారన్నారు. ఆడలేక మద్దెల దరువన్నట్లుంది బాబు వ్యవహారమన్నారు.
ఏఐసీసీ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ(Rahul Gandhi)ని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి (YS Sharmila Reddy) మర్యాదపూర్వకంగా కలిశారు. ఇవాళ (బుధవారం) ఢిల్లీలోని ఏఐసీసీ కేంద్ర నూతన కార్యాలయ ప్రారంభోత్సవం సందర్భంగా నిన్ననే ఆమె ఢిల్లీకి చేరుకున్నారు.