Home » YS Sharmila
YS Sharmila: వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డికి ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చురకలు అంటించారు. జగన్ను వీసా రెడ్డి వంటి వారే వదిలేస్తున్నారంటే ఆలోచన చేయాలని అన్నారు. ఒక్కొక్కరుగా జగన్ను వదిలి బయటకు వస్తున్నారని వైఎస్ షర్మిల విమర్శించారు.
YS Sharmila: ప్రతిపక్షంలో ఉండగా అదానీ మీకు శత్రువని.. అధికార పక్షంగా అదే అదానీ మిత్రుడయ్యారని వైఎస్ షర్మిల విమర్శించారు. గత ప్రభుత్వం సెకీతో చేసుకున్న ఒప్పందంలో అవినీతి జరిగిందని ఆరోపించారు. అదానీ పవర్ తో చేసుకున్న అగ్రిమెంట్ వెనుక స్వయంగా మాజీ ముఖ్యమంత్రి రూ.17వందల కోట్లు ముడుపులు తీసుకున్నారని అమెరికన్ దర్యాప్తు సంస్థ ఎఫ్బీఐ స్పష్టంగా రిపోర్ట్ ఇచ్చిందన్నారు.
‘దమ్ముంటే గత ఐదేళ్ల వైసీపీ పాలనపై వెంటనే కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ జరిపించాలి’ అని కేంద్ర హోం మంత్రి అమిత్ షాను పీసీసీ అధ్యక్షురాలు షర్మిల డిమాండ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్: రాజధాని లేని రాష్ట్రంగా ఏపీని వైసీపీ ఐదేళ్లపాటు పాలిస్తుంటే కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు కనిపించలేదా అని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి ప్రశ్నించారు. ఇష్టారాజ్యంగా రూ.10 లక్షల కోట్లు అప్పులు చేస్తుంటే విధ్వంసం జరుగుతున్నట్లు అనిపించలేదా అంటూ ఆమె మండిపడ్డారు.
YS Sharmila: కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ను అమిత్ షా అవమానించారని మండిపడ్డారు. అమిత్ షా క్షమాపణలు చెప్పాలని వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు.
YS Sharmila: ఎన్నికల్లో సూపర్ సిక్స్ అంటూ ఆర్భాటం చేసిన బాబు.. అమలుకొచ్చేసరికి ఆదాయం పెరిగితేనే అంటూ మడతపేచి పెట్టారంటూ వైఎస్ షర్మిల కామెంట్స్ చేశారు. అప్పులు దొరకవని, ఆదాయం పెంచుకోవాలని, తలసరి ఆదాయం పెరగాలని, మనుషులు మన ఆస్తి అంటూ వింత వింత మాటలు చెప్తున్నారన్నారు. ఆడలేక మద్దెల దరువన్నట్లుంది బాబు వ్యవహారమన్నారు.
ఏఐసీసీ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ(Rahul Gandhi)ని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి (YS Sharmila Reddy) మర్యాదపూర్వకంగా కలిశారు. ఇవాళ (బుధవారం) ఢిల్లీలోని ఏఐసీసీ కేంద్ర నూతన కార్యాలయ ప్రారంభోత్సవం సందర్భంగా నిన్ననే ఆమె ఢిల్లీకి చేరుకున్నారు.
‘బీజేపీ మతపిచ్చి పార్టీ. కుల మతాలతో ఆ పార్టీ రాజకీయం చేస్తోంది. జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ను బీజేపీ పనిముట్టలా వాడుకుంటోంది’ అని ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల మండిపడ్డారు.
YS Sharmila: సీబీఐ, ఈడీ వంటి అన్ని ప్రభుత్వ వ్యవస్థలను బీజేపీ తమ గుప్పిట్లో పెట్టుకున్నారని.. ఆ వ్యవస్థ లను వారి స్వార్థం కోసం దుర్వినియోగం చేస్తున్నారని వైఎస్ షర్మిల దుయ్యబట్టారు. దేశం మొత్తాన్ని కాషాయ మయం చేసే కుట్రలు చేస్తున్నారన్నారు. ఫాదర్ ఆఫ్ ది నేషన్ మహాత్మాగాంధీని బీజేపీ విలన్గా చిత్రీకరించిందని తెలిపారు. ఆయన్ను చంపిన వారిని హీరోగా ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
YS Sharmila: పార్లమెంట్లో కేంద్ర హోం మంత్రి అమిత్ షా అంబేద్కర్ను అవమానించారని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మండిపడ్డారు. అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాత, వారి రాజ్యాంగం వల్ల ప్రజా స్వామ్యం కాపాడపడుతోందని తెలిపారు. అంబేద్కర్ కోసం కాంగ్రెస్ పార్టీ జపం చేస్తే తప్పేంటని ప్రశ్నించారు.