Home » YS Avinash Reddy
అవును.. మీరు వింటున్నది నిజమే..! త్వరలో కడప పార్లమెంట్ స్థానానికి ఉప ఎన్నిక రాబోతోందని ఒక ఎమ్మెల్యే, ప్రభుత్వంలోని కీలక వ్యక్తి చెప్పడంతో తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడితే హాట్ టాపిక్ అయ్యింది.. ఎవరి నోట విన్నా.. సోషల్ మీడియాలో చూసినా దీని గురించే చర్చ.. అంతకుమించి రచ్చ!..
కడప లోక్సభ స్థానంలో ఓటమిపై ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల స్పందించారు. సీఎం, సిట్టింగ్ ఎంపీ కడప పార్లమెంట్ స్థానంలోని ప్రజలను భయపెట్టిన కారణంగానే తాను ఎంపీగా ఓడిపోయానన్నారు.
ఏపీలో గెలుపేవరిదో మరో మూడు రోజుల్లో తేలనుంది. జూన్4వ తేదీన ఓటర్ల తీర్పు వెలువడనుంది. ఈలోపు 7 దశల పోలింగ్ ముగియడంతో ఎగ్జిట్ పోల్స్ను సర్వే సంస్థలు విడుదల చేశాయి. ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వస్తుందని కొన్ని సర్వే సంస్థలు అంచనా వేయగా.. వైసీపీ కూటమి అధికారంలోకి వస్తుందని మరికొన్ని సంస్థలు తెలిపాయి.
కడపలో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలు అందరిలోనూ ఆసక్తిని పెంచాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు అటు ఢిల్లీ గడ్డ సైతం అటు వైపే చూస్తోంది.
మే 13న ఏపీలో అసెంబ్లీతో పాటు లోక్సభ ఎన్నికలు జరగనున్న తరుణంలో.. ఏపీలోని రాజకీయ పార్టీలు తమ ప్రచార కార్యక్రమాలను ముమ్మరం చేశాయి. పార్టీ పెద్దలు సైతం రంగంలోకి దిగి.. తమ అభ్యర్థుల తరపున విస్తృత ప్రచారం..
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి హయాంలో వ్యవసాయం పండుగలా ఉండేదని ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల (YS Sharmila) అన్నారు. బద్వేల్ నియోజక వర్గం, పోరు మామిళ్ల మండలాల్లో బుధవారం షర్మిల ఎన్నికల ప్రచారాల్లో పాల్గొన్నారు. ఈ భారీ బహిరంగ సభల్లో సీఎం జగన్, వైసీపీ ప్రభుత్వంపై షర్మిల తీవ్ర విమర్శలు గుప్పించారు. తాను పుట్టింది ఇక్కడేనని.. ఇది నా గడ్డ అని తెలిపారు.ఇక్కడే ఉంట..ప్రజలకు సేవ చేస్తానని మాటిచ్చారు. తనను కడప ఎంపీగా గెలిపిస్తే ..కేంద్రంలో మంత్రిని కూడా అవుతానని స్పష్టం చేశారు.
‘అవినాశ్ రెడ్డి చిన్న పిల్లోడు. నోట్లో వేలు పెట్టినా కొరకలేడు’ అని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సర్టిఫికెట్ ఇచ్చేశారు. 39 ఏళ్ల వయసు..
వైఎస్ అవినాశ్ ఏ తప్పూ చేయలేదని నేను బలంగా నమ్మాను. కాబట్టే టికెట్ ఇచ్చాను. మాఅందరి కన్నా చిన్నపిల్లాడు అవినాశ్
తన తండ్రి వైయస్ వివేకానందరెడ్డిని అత్యంత దారుణంగా హత్య చేసి అయిదేళ్లు పూర్తి అయింది. ఆ కేసులో నిందితులను నేటికి అరెస్ట్ చేయలేదు. అంతేకాకుండా... ఈ హత్య కేసులో కడప ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డి నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అలాంటి వేళ.. అతడికి మళ్లీ కడప లోక్సభ స్థానం నుంచి వైసీపీ అభ్యర్థిగా ఆ పార్టీ అధినేత వైయస్ జగన్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు.
రాష్ట్రంలో వైయస్ జగన్ ప్రభుత్వం పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది. అలాగే ఆయన సోదరుడు, కడప ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డికి సైతం ఆయన సొంత నియోజకవర్గ ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుందనే ఓ చర్చ ఉమ్మడి కడప జిల్లా రాజకీయాల్లో హల్చల్ చేస్తోంది.