Home » Yogi Adityanath
ఉత్తరప్రదేశ్లో సంచలనం సృష్టించిన కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ ఎగ్జామినేషన్ పేపర్ లీకేజీ కేసులో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. యూపీ పోలీస్ రిక్రూట్మెంట్ అండ్ ప్రమోషన్ బోర్డు చైర్పర్సన్ రేణుకా మిశ్రాను ఆ పదవి నుంచి తొలగించారు.
లోక్సభ ఎన్నికల వేళ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తన మంత్రివర్గాన్ని విస్తరించనున్నారు. ఇందుకు ఈనెల 5వ తేదీ మంగళవారం ముహూర్తం ఖరారైనట్టు బీజేపీ వర్గాల సమాచారం. గవర్నర్ ఆనందిబెన్ పటేల్ ఆగ్రా పర్యటన నుంచి తిరిగి రాగానే క్యాబినెట్ విస్తరణ జరుగుతుందని చెబుతున్నారు.
త్వరలో ఉత్తరప్రదేశ్ మంత్రివర్గ విస్తరణ జరగనుంది. రాజ్యసభ ఎన్నికల్లో మద్దతు ఇచ్చిన ఓం ప్రకాశ్, ఎమ్మెల్యే దారా సింగ్కు మంత్రి పదవీ వరించే అవకాశం ఉంది.
బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటి సమావేశం ముగిసింది. ఈ సమావేశం ఐదు గంటల పాటు కొనసాగింది. బీజేపీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. తెలంగాణ సహా మొత్తం 9 రాష్ట్రాల్లో లోక్సభ అభ్యర్థులపై కసరత్తు నిర్వహించినట్టుగా తెలుస్తోంది. దేశవ్యాప్తంగా 125కు పైగా స్థానాల్లో అభ్యర్థులను ఖరారు చేసే అవకాశం ఉంది.
రాజ్యసభ ఎన్నికల వేళ ఉత్తరప్రదేశ్లో ప్రతిపక్ష సమాజ్వాదీ పార్టీకి గట్టి దెబ్బ తగలింది. ఆ పార్టీ చీఫ్ విప్ మనోజ్ పాండే పార్టీకి రాజీనామా చేశారు.
లోక్ సభ ఎన్నికల్లో మూడోసారి విజయం సాధించాలని భారతీయ జనతా పార్టీ అనుకుంటోంది. దేశంలో పెద్ద రాష్ట్రం అయిన ఉత్తరప్రదేశ్పై ప్రత్యేక దృష్టిసారించింది. ఇందుకోసం కొత్త ఎత్తుగడ వేసింది.
కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ పరీక్ష 2023ను రద్దు చేస్తూ యూపీ(UP) ప్రభుత్వం శనివారం కీలక నిర్ణయం తీసుకుంది. పేపర్ లీక్ కావడంతో కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ పరీక్ష అభ్యర్థులు నిరసన చేస్తూ పరీక్షను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని డిమాండ్ చేసిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
పేపర్ లీక్ కారణంగా ఉత్తర ప్రదేశ్లో నిర్వహించనున్న కానిస్టేబుల్ పరీక్ష రద్దు అయింది. మరో ఆరు నెలల్లో అన్ని పకడ్బందీ చర్యలు తీసుకుని మళ్లీ పరీక్ష నిర్వహిస్తామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అన్నారు.
వారణాసిలో సెయింట్ రవిదాస్ విగ్రహాన్ని ఆవిష్కరించిన తర్వాత ప్రజలను ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. దీంతోపాటు రాజకీయ పార్టీల గురించి కూడా ప్రస్తావించారు.
ఉత్తరప్రదేశ్లోని డబుల్ ఇంజిన్ సర్కార్తో రాష్ట్రం శరవేగంగా అభివృద్ధి చెందుతోందని ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) అన్నారు. సీఎం యోగీ ఆదిత్యనాథ్(Yogi Adityanath) నాయకత్వంలోని డబుల్ ఇంజిన్ సర్కార్తో రాష్ట్రంలో పెట్టుబడులు "రెడ్ టేప్" నుంచి "రెడ్ కార్పెట్" అనేలా మారాయని కొనియాడారు.