Home » YCP
వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డిపై మంత్రి నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ రాజధాని అమరావతి అని తమకు పూర్తి క్లారిటీ ఉందని.. రాజధానిపై వైసీపీ కూడా స్పష్టత ఇవ్వాలని అన్నారు.
మాజీ సీఎం జగన్పై మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. కమీషన్ల కోసమే జగన్ ప్రాజెక్టుల డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు..
దమ్ముంటే అసెంబ్లీకి వెళ్లండి.. అక్కడ మాట్లాడండి.. అంటూ తెలుగుదేశం పార్టీ పొలిట్బ్యూరో సభ్యుడు ఆర్.శ్రీనివాసరెడ్డి అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ... రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ సమస్యను జిల్లా అభివృద్ధి సమీక్షా సమావేశంలో వైసీపీ నాయకులు లేవనెత్తడం విడ్డూరంగా ఉందన్నారు.
అభివృద్ధి - సంక్షేమం రెండింటినీ సమన్వయం చేస్తూ ప్రజలకు ఎంత ప్రయోజనం చేకూర్చామన్నదే కూటమి ప్రభుత్వ విధానమని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు. వైసీపీ కుట్రలను పార్లమెంట్ వారీగా నేతలు సమర్థంగా తిప్పికొట్టాలని సూచించారు..
వైసీపీ పాలనలో జరిగిన సర్వేలో లోపాలు రైతుల పాలిట శాపాలుగా మారాయి. కూటమి ప్రభుత్వం గ్రామ సభలు పెట్టినా, మూడు విడతలు రీసర్వే నిర్వహించినా పరిష్కారం కాలేదు. శుక్రవారం నుంచి నాల్గవ విడత రీసర్వేకు రంగసిద్ధమైంది.
జిల్లాలోని ఆయా మండలాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తల దౌర్జన్యాలకు అంతేలేకుండా పోతోంది. ఆ పార్టీ అధినేత జగన్ పుట్టినరోజు సందర్బంగా రప్పా రప్పా అంటూ ప్లెక్సీలు పెట్టి అలజడి చేశారు. తాజాగా మరో నాయకుడు, ఆయన కొడుకు దాడిచేసిన విషయం వెలుగులోకి వచ్చింది.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ పుట్టినరోజు సందర్భంగా ఆ పార్టీ కార్యకర్తలు చేసిన భీభత్సం ఇంకా గ్రామాల్లో అలజడి రేపుతూనే ఉంది. ఆ పార్టీ కార్యకర్తలు రోడ్లపైకి వచ్చి అనుమతి లేకుండా ర్యాలీ, రోడ్డుపై ధర్నాలు చేస్తున్నారు. దీంతో గ్రామాల్లో ప్రశాంత వాతావరణం కాస్త దెబ్బతింటోంది. అంతేగాక ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది.
రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవడానికి వైసీపీ ముఠా ఎంతకైనా దిగజారుతోందని హోంమంత్రి అనిత వ్యాఖ్యలు చేశారు. మూగ జీవాలను బలి తీసుకుని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్న వైసీపీ పార్టీ ఉన్మాదాన్ని ప్రజలు గ్రహించాలన్నారు.
గత కొంతకాలంగా ధర్మాన కృష్ణదాసు సోదరులపై తీవ్ర ఆరోపణలు చేస్తున్న ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్.. మరో సంచలన ఆడియో విడుదల చేశారు. ధర్మాన సోదరులు తనను అంతం చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.
రాజకీయ ముసుగులో చేసే నేరాలు అంగీకరించేది లేదని సీఎం చంద్రబాబు అన్నారు. తప్పు చేసిన వారు తప్పించుకోలేరని స్పష్టం చేశారు.