Home » Weather
రాష్ట్రంలో రుతుపవనాలు పూర్తిగా బలహీనపడ్డాయి. బంగాళాఖాతం నుంచి తేమగాలులు భూ ఉపరితలంపైకి రావట్లేదు
ఆంధ్రప్రదేశ్లో రాబోయే రెండు రోజులు పలుచోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందని విశాఖపట్నం వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఉత్తరకోస్తా తీరం వెంట బలమైన ఈదురు గాలులు ఉంటాయని... ప్రజలు తగిన జాగ్రత్తలు పాటించాలని, మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని విశాఖపట్నం వాతావరణ శాఖ అధికారులు సూచించారు.
గత ఏడాది కనీవిని ఎరుగని రీతిలో మున్నేటికి వరద ముప్పు రావడంతో వందలాది మంది నిరాశ్రయులుగా మారారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. మళ్లీ అలాంటి పరిస్థితి పునరావృతం కాకుండా అధికార యంత్రాంగం చర్యలు చేపట్టాలని మంత్రి తుమ్మల దిశానిర్దేశం చేశారు.
రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాద్లో భారీ వర్షాలు కురుస్తోండటంతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ సందర్భంగా అధికారులతో హైదరాబాద్ ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడారు. ఈ క్రమంలో అధికారులకి కీలక ఆదేశాలు జారీ చేశారు.
మరికాసేపట్లో నగర వ్యాప్తంగా కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. ఈ మేరకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఒక ప్రకటన విడుదల చేసింది. జీహెచ్ఎంసీ సహా నగర పరిసర ప్రాంతాల్లో ...
బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనంతోపాటు ద్రోణి ప్రభావం కొనసాగుతోందని వాతావరణ శాఖ తెలిపింది. దీని వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాబోయే నాలుగు రోజులపాటు పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.
ఆంధ్రప్రదేశ్లో రాబోయే రెండు రోజులూ ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాలు కురుసే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
భాగ్య నగరంలో పలు చోట్ల భారీ వర్షం కురుస్తోంది. కొత్తపేట, దిల్సుఖ్నగర్, చంపాపేట, సరూర్నగర్, సహా పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి.
భాగ్యనగరంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ మేరకు సంబంధింత అధికారులకు మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక ఆదేశాలు జారీ చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.
హిమాచల్ ప్రదేశ్ భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలమవుతోంది. రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో భీతావహ వాతావరణం కనిపిస్తోంది. భారీ వర్షాలతో సిమ్లా-సున్నీ-కర్సోగ్ హైవే నదిలా మారిపోయింది. కొండచరియలు విరిగిపడడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.