Home » Vizag steel plant
లాభాల్లో నడుస్తున్న ఉక్కు కర్మాగారం అమ్మకానికి పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్రలు చేసిందని కాంగ్రెస్ సీనియర్ నేత రఘువీరా రెడ్డి (Raghuveera Reddy) అన్నారు. శనివారం నాడు కాంగ్రెస్ న్యాయ సాధన సభలో ఆయన మాట్లాడుతూ.. ప్రధాని మోదీ, సీఎం జగన్, టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ దీన్ని నాశనం చేయడానికి కంకణం కట్టుకున్నారని మండిపడ్డారు.
విశాఖ: ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం మహా పాదయాత్ర ప్రారంభమైంది. కూర్మన్నపాలెం దీక్షా శిబిరం నుంచి జీవీఎంసీ గాంధీ విగ్రహం వరకు పాదయాత్ర సాగనుంది. ఈ పాదయాత్రలో విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నేతలు, అఖిలపక్షం కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు.
విశాఖకు తలమానికమైన స్టీల్ప్లాంట్ను కాపాడుకోవడమే తన లక్ష్యమని మాజీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు (Ganta Srinivasa Rao) తెలిపారు. శుక్రవారం నాడు స్టీల్ ప్లాంట్ పరిరక్షణ పోరాట కమిటీ నాయకులతో గంటా శ్రీనివాసరావు సమావేశం నిర్వహించారు.
పోలవరం, సుజల స్రవంతి, విశాఖ రైల్వే జోన్, మెట్రో విషయంలో ప్రభుత్వం స్పందించడం లేదని మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ ( Konatala Ramakrishna ) తెలిపారు. సోమవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ... విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి పెంచాలని కొణతాల రామకృష్ణ చెప్పారు.
ఎట్టి పరిస్థితుల్లోనూ విశాఖ ఉక్కు ( Visakha Steel ) ప్రైవేటీకరణను అంగీకరించబోమని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ( Nara Lokesh ) స్పష్టం చేశారు. సోమవారం నాడు నారా లోకేష్ను విశాఖ ఉక్కు నిర్వాసితులు కలిశారు. ఈ సందర్భంగా నారా లోకేష్ మాట్లాడుతూ... ‘‘భారతదేశంలో తీర ప్రాంతంలో ఉన్న ఏకైక ఉక్కు కర్మాగారం విశాఖ ఉక్కు. విశాఖ ఉక్కు ఇప్పటి వరకు రూ.40 వేల కోట్లను వివిధ పన్నుల రూపంలో కేంద్ర, రాష్ట్రాలకు చెల్లించింది’’ అని నారా లోకేష్ తెలిపారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ (RINL) నష్టాలకు గత కాంగ్రెస్ ప్రభుత్వాలే కారణమని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహరావు ( MP GVL Narasimha Rao ) పేర్కొన్నారు.
విశాఖపట్నం స్టీల్ ప్లాంటును కష్టాలు ఒక దానివెంట మరొకటి వెంటాడుతున్నాయి.
ఆర్ఎఐఎన్ఎల్(RAINL)(రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్) ప్రైవేటీకరణ ప్రక్రియపై అదానీ గ్రూపు(Adani Group)కి ఎలాంటి ఆసక్తి లేదని అదానీ పోర్ట్స్ డైరెక్టర్ జీజే రావు(Adani Ports Director GJ Rao) స్పష్టం చేశారు.
విశాఖ స్టీల్ప్లాంటును హస్తగతం చేసుకోవడానికి అదానీ కంపెనీ ఒక అడుగు ముందుకువేసింది. పోర్టులో హ్యాండ్లింగ్ చార్జీల బకాయి ఎక్కువగా ఉందనే సాకుతో మంగళవారం నుంచి బొగ్గు సరఫరా నిలిపివేసింది. దీంతో స్టీల్ప్లాంటులో
రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్కు చెందిన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్(వైజాగ్ స్టీల్)...వివిధ బ్రాంచుల్లో అప్రెంటిస్షిప్ శిక్షణకు అర్హుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.