Home » Vizag News
తెలుగుదేశం (TDP) జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు (Chandrababu Naidu) అక్రమ అరెస్టును తట్టుకోలేక మృతిచెందిన కార్యకర్తల కుటుంబాలను నారా భువనేశ్వరి (Nara Bhuvaneswari) ‘నిజం గెలవాలి’ (Nijam Gelavali) పేరుతో పరామర్శిస్తున్న విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో భాగంగా మంగళవారం నుంచి మార్చి ఒకటో తేదీ వరకు ఆమె ఉత్తరాంధ్రలో పర్యటిస్తున్నారు.
విశాఖపట్టణం సమీపంలో భూముల ధరలకు రెక్కలు వచ్చాయి. రాజధాని, భోగాపురం ఎయిర్ పోర్టుతో ఆ ప్రాంతానికి మంచి డిమాండ్ ఉంది. భీమిలి మండలం కొత్త వలసలో కూడా భూమికి మంచి ధర ఉంది. ఆ ప్రాంతంలో 15 ఎకరాల భూమిని శారదా పీఠానికి అప్పనంగా కట్టబెట్టారు.
విశాఖలో గల శారదా పీఠం వెళ్లే మార్గం సరిగా లేదు. అక్కడ తారు రోడ్డు వేయించాలని అనుకున్నారు. పీఠాధిపతిపై భక్తిని చాటుకునేందుకు కేవలం రెండు రోజుల్లో నిర్మించారు. పీఠం తారు రోడ్డు కోసం ఏకంగా రూ.96 లక్షలు ఖర్చు చేశారు. 480 మీటర్ల మట్టి రోడ్డును తారు రోడ్డుగా మార్చారు.
కప్పరాడలో గల శ్రీ వైభవ వేంకటేశ్వర స్వామి ఆలయంపై శారదా పీఠం కన్ను పడింది. ఆలయ నిర్మాణం, భక్తుల నుంచి స్పందన రావడం, వీఐపీ భక్తులు రావడంతో అధిక ఆదాయం సమకూరుతుంది. ఈ ఆలయాన్ని ఎలాగైనా సరే దక్కించుకోవాలని అనుకుంటోంది.
రాబోయే ఎన్నికల్లో జనసేన- టీడీపీ కూటమి అధికారంలోకి వస్తుందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ధీమా వ్యక్తం చేశారు. పార్టీ నిధి కోసం రూ.10 కోట్లను విరాళంగా ప్రకటించారు. ఉమ్మడి విశాఖ జిల్లాల నేతలతో సోమవారం పవన్ సమావేశం అయ్యారు.
సీఎం జగన్ దళిత ద్రోహి అని.. ఆయనకు, వైసీపీ నేతలకు దళితుల మీద ప్రేమ కపట నాటకమని జనసేన నాయకులు కిరణ్ రాయల్ అన్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. జగన్ ఒక కటింగ్, ఫిటింగ్ మాస్టర్ అని మండిపడ్డారు. ఉత్తరాంధ్రకు పట్టిన శని జగన్ అని విరుచుకుపడ్డారు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆదివారం ( ఈ రోజు) విశాఖపట్టణం వెళతారు. హైదరాబాద్ నుంచి మధ్యాహ్నం 3 గంటలకు ప్రత్యేక విమానంలో విశాఖ వస్తారు. మూడు రోజులపాటు అక్కడే ఉంటారని పార్టీ వర్గాలు తెలిపాయి.
ఉత్తరాంధ్రకు పట్టిన దరిద్రం సీఎం జగన్మోహన్ రెడ్డి అని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి, యువనేత నారా లోకేష్ (Nara Lokesh) అన్నారు. శనివారం నాడు విశాఖ పెందుర్తి నియోజకవర్గం, పురుషోత్తపురంలో, శంఖారావం సభ నిర్వహించారు.
రాబోయే ఎన్నికల్లో మళ్లీ భీమిలి నుంచే పోటీ చేస్తానని.. ఆ నియోజకవర్గంలో తాను గెలవడం ఖాయమని ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్(Avanthi Srinivas) తెలిపారు. గతంలో రెండు సార్లు కూడా భీమిలి నుంచే పోటీ చేశానని గుర్తుచేశారు. భీమిలీలో వైసీపీ జెండా ఎగరవేయడం ఖాయమని ఆశాభావం వ్యక్తం చేశారు.