Home » Vizag News
వైసీపీ ప్రభుత్వం(YSRCP Govt) ఏపీని డ్రగ్స్ రాజధానిగా మార్చిందని తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు(Nara Chandrababu Naidu) అన్నారు. గురువారం నాడు టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... విశాఖ పోర్టులో సీబీఐ 25000 కిలోల డ్రగ్స్ని స్వాధీనం చేసుకోవడం షాక్కు గురిచేసిందని అన్నారు. పోర్టులో 25 వేల కిలోల డ్రగ్స్ స్వాధీనంపై విస్మయం వ్యక్తం చేశారు.
విశాఖపట్టణం షిప్పింగ్ యార్డ్లో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. 25 వేల కిలోల డ్రగ్స్ను కస్టమ్స్, సీబీఐ అధికారులు కలిసి సీజ్ చేశారు. బెయ్యి బ్యాగులను సీజ్ చేశారు. ఒక్కో బ్యాగుల్లో 25 కిలోల డ్రగ్స్ ఉన్నాయి. ఆపరేషన్ గరుడ పేరుతో ఆపరేషన్ చేపట్టారు. ఈ డ్రగ్స్ విలువ రూ.50 వేల కోట్ల వరకు ఉంటుందని అధికారులు అంచనా వేశారు.
Ganta Srinivasa Rao Meeting: టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు (Ganta Srinivasa Rao) ఎక్కడ్నుంచి పోటీచేస్తారనే దానిపై ఇంతవరకూ క్లారిటీ రాలేదు. మొదటి జాబితాలో పేరు లేకపోవడం.. ఇవాళ రిలీజ్ చేసిన సెకండ్ లిస్ట్లోనూ లేకపోవడంతో అసలు గంటా ఎక్కడ్నుంచి పోటీచేస్తారు..? పోటీ చేస్తారా.. లేదా..? హైకమాండ్ ఏం చెబుతోంది.. ఈయనేం ఆశిస్తున్నారు..? టీడీపీ (TDP) పెద్దలు గంటాకు ఏం చెప్పారు..?
విశాఖ రామానాయుడు స్టూడియో (Ramanaidu Studio) పై సుప్రీంకోర్టు (Supreme Court) కీలక ఉత్తర్వులు జారీ చేసింది. స్టూడియో భూముల అమ్మకాలపై సుప్రీంకోర్టులో సోమవారం నాడు విచారణ జరిగింది. విచారణలో భాగంగా స్టూడియో భూముల అమ్మకాలపై పలు అంశాలను కోర్టు దృష్టికి పిటీషనర్లు తీసుకువచ్చారు.
ఏపీలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తుండటంతో అధికార వైసీపీ (YSRCP) పలు కుయుక్తులకు పాల్పడుతోంది. ఈసారి కూడా ఎలాగైనా అధికారంలోకి రావాలని భావించిన సీఎం జగన్రెడ్డి (CM Jagan) పలు అక్రమాలకు పాల్పడుతున్నారు. వలంటీర్ల(Volunteers)తో ప్రజలను మభ్యపెట్టేందుకు మరో కుట్రకు తెరలేపారు.
Train Accident In Andhra: ఆంధ్రప్రదేశ్లో (Andhra Pradesh) ఘోర రైలు ప్రమాదం తృటిలో తప్పింది. విశాఖపట్నం నుంచి భవానీపట్నం వైపు వెళ్తున్న ప్యాసింజర్ రైలు విజయనగరం జిల్లా కొత్తవలస వద్ద పట్టాలు తప్పింది. దీంతో రెండు బోగీలు ఓ పక్కకు.. మరోవైపు రైలు ఇంజన్ సైతం ఒరిగిపోయాయి...
సీఎం జగన్ రెడ్డి (CM Jagan) జైల్లో ఉంటే.. ఆయన చెల్లి ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల పాపమని పాదయాత్ర చేస్తే తరిమేశాడని జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ (Peethala Murthy Yadav) అన్నారు. గురువారం నాడు జనసేన పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు ..జగన్ లాగా ఊరుకో ప్యాలస్ లేదన్నారు.
బంగారం ధరలు రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. అమెరికాలో వడ్డీరేట్లు తగ్గుతాయనే సూచనలు, ఆర్థిక అనిశ్చిత పరిస్థితులు తొలగకపోవడమే పెరుగుదలకు కారణం అని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. పెళ్లిళ్ల సమయం కావడంతో బంగారం కొనుగోళ్లు పెరుగుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల మరోసారి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. విశాఖపట్టణం పరిపాలన రాజధాని, 10 ఏళ్ల వ్యూహాల పేరుతో కొత్త నాటకాలకు తెరతీస్తున్నారని మండిపడ్డారు. ఈ మేరకు సోషల్ మీడియా ఎక్స్లో ట్వీట్ చేశారు.
పీలో వైసీపీ ప్రభుత్వంపై ప్రజల్లో రోజురోజుకూ వ్యతిరేకత పెరిగిపోతోందని విశాఖ టీడీపీ పార్లమెంట్ ఇన్చార్జి శ్రీ భరత్(Sri Bharat) అన్నారు. మంగళవారం నాడు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గణబాబు పశ్చిమ నియోజకవర్గం 92 వ వార్డు ఎస్సీ, బీసీ కాలనీలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.