• Home » Visaka

Visaka

AP Minister: మంత్రిగా తొలిసారి విశాఖకు నారా లోకేశ్

AP Minister: మంత్రిగా తొలిసారి విశాఖకు నారా లోకేశ్

ఆంధ్రప్రదేశ్ విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్.. మూడు రోజుల పాటు విశాఖపట్నంలో పర్యటిస్తున్నారు. అందులోభాగంగా నేడు ఆయన విశాఖపట్నం చేరుకోనున్నారు. కూటమి ప్రభుత్వం కొలువు తీరిన అనంతరం తొలిసారిగా మంత్రి నారా లోకేశ్.. జిల్లాకు రానుండడంతో పార్టీ శ్రేణులు ఆయనకు భారీగా స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేశారు.

Python: విశాఖ గంగవరం పోర్టులోకి భారీ కొండచిలువ.. పరుగులు తీసిన కార్మికులు..

Python: విశాఖ గంగవరం పోర్టులోకి భారీ కొండచిలువ.. పరుగులు తీసిన కార్మికులు..

గంగవరం పోర్టు(Gangavaram Port)లోకి భారీ కొండచిలువ(Python) ఎంట్రీ ఇచ్చింది. దాన్ని చూసిన కార్మికులు ఒక్కసారిగా పరుగులు తీశారు. సమాచారం అందుకున్న స్నేక్ క్యాచర్ సురక్షితంగా పామును పట్టుకుని అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారు.

YCP MLC: వైరల్ అవుతున్న వైసీపీ ఎమ్మెల్సీ వీడియో నిజమేనా..?

YCP MLC: వైరల్ అవుతున్న వైసీపీ ఎమ్మెల్సీ వీడియో నిజమేనా..?

అమరావతి: వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు వ్యవహార శైలి తలనొప్పిగా మారింది. ఇప్పటికే శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఎపిసోడ్ రచ్చ రచ్చ చేసింది. దివ్వెల మాధురి, దువ్వాడ శ్రీనివాస్‌ల వ్యవహారం ట్రెండింగ్ అయింది. ఇది కాస్త మరుగున పడిందని అనుకుంటున్న తరుణంలో తాజాగా మరో ఎమ్మెల్సీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Kandula Durgesh: మాజీ సీఎం జగన్‌పై మంత్రి కందుల దుర్గేశ్ సెటైర్లు

Kandula Durgesh: మాజీ సీఎం జగన్‌పై మంత్రి కందుల దుర్గేశ్ సెటైర్లు

ఋషికొండపై భవనాలు ఒక పేదవాడు కట్టుకున్న చిన్న పూరి గుడిసె అని వైసీపీ అధినేత, మాజీ సీఎం వైయస్ జగన్‌పై మంత్రి కందుల దుర్గేశ్ వ్యంగ్యంగా పేర్కొన్నారు. ఆ ఋషికొండ భవనాలను ఏం చేయాలో ఇంకా తమ ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదన్నారు. ఈ భవనాల నిర్మాణం కోసం గత పాలకులు ప్రజాధనాన్ని దుర్మార్గంగా ఖర్చు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఉక్కు సీఎండీ... అభినవ నీరో..!

ఉక్కు సీఎండీ... అభినవ నీరో..!

విశాఖపట్నం స్టీల్‌ ప్లాంటు సీఎండీ అతుల్‌ భట్‌ అభినవ నీరో చక్రవర్తిలా ప్రవర్తిస్తున్నారు. రోమ్‌ నగరం తగలబడిపోతుంటే... నీరో చక్రవర్తి ఫిడేల్‌ వాయించినట్టు... ఇక్కడ ఈయన కూడా అదే తరహాలో వ్యవహరిస్తున్నారు.

Minister Anagani: వైసీపీ పాలనలో భూ అక్రమాలపై చర్యలు: మంత్రి అనగాని

Minister Anagani: వైసీపీ పాలనలో భూ అక్రమాలపై చర్యలు: మంత్రి అనగాని

వైసీపీ పాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా భూ అక్రమాలు జరిగినట్లు ఏపీ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్(Minister Anagani Satyaprasad) ఆరోపించారు. విశాఖలో మాత్రమే భూ అక్రమాలు జరిగాయని అనుకుంటే పొరపాటే అన్నారు. ఆగస్టు 15సందర్భంగా విశాఖ గ్రీన్ పార్క్ కూడలి వద్ద సర్దార్ గౌతు లచ్చన్న విగ్రహానికి మంత్రి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

Home Minister Anita: అనాగరికంగా హత్య చేశారు..

Home Minister Anita: అనాగరికంగా హత్య చేశారు..

విశాఖపట్నం: హోంమంత్రి వంగలపూడి అనిత బుధవారం బెల్లం వినాయకున్ని, సంపత్ వినాయకున్ని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. రెండు ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మంత్రిని మీడియా పలుకరించగా.. కర్నూలు టీడీపీ నేత శ్రీను హత్యపై స్పందించారు. రాష్ట్రంలో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు నాలుగు రాజకీయ హత్యలు జరిగాయని, అందులో ముగ్గురు తెలుగుదేశం పార్టీ నేతలు హత్యకు గురయ్యారని, అనాగరికంగా హత్య చేశారని అన్నారు.

Simhachalam:12 మనుగుల శ్రీగంధంలో అప్పన్న స్వామి భక్తులకు దర్శనం

Simhachalam:12 మనుగుల శ్రీగంధంలో అప్పన్న స్వామి భక్తులకు దర్శనం

విశాఖ: సింహాద్రి అప్పన్న గిరి ప్రదర్శనకు భక్తులు పోటెత్తారు. ఆషాఢ శుద్ద చతుర్దసినాడు గిరి ప్రదర్శనను ప్రారంభించి పౌర్ణమినాడు స్వామిని దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఆ క్రమంలోనే గిరి ప్రదర్శన చేసేందుకు వివిధ రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు. 32 కిలోమీటర్ల మేర కాలినడకన చేసే గిరి ప్రదక్షిణలో లక్షలాదిమంది భక్తులు పాల్గొన్నారు.

Bhupathi Raju: కేంద్రం ఇచ్చిన నిధులను వైసీపీ ప్రభుత్వం ఏం చేసిందో తేలడం లేదు..

Bhupathi Raju: కేంద్రం ఇచ్చిన నిధులను వైసీపీ ప్రభుత్వం ఏం చేసిందో తేలడం లేదు..

జగన్ సర్కార్ అనాలోచిత నిర్ణయాల వల్ల ఏపీ ఆర్థిక పరిస్థితి దారుణంగా మారిందని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ అన్నారు. వైసీపీ హయాంలో భారీగా కేంద్రం ఇచ్చిన నిధులను జగన్ ప్రభుత్వం దారి మళ్లించిందని ఆయన ఆరోపించారు. విశాఖలో పర్యటించిన కేంద్ర మంత్రి ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు.

Ganta Srinivas Rao: సీఎం దృష్టికి గురుకుల సమస్యలు

Ganta Srinivas Rao: సీఎం దృష్టికి గురుకుల సమస్యలు

రాష్ట్రంలో గురుకుల పాఠశాలలను టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు తొలిసారిగా ప్రారంభించారని మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తెలిపారు. బుధవారం విశాఖపట్నం జిల్లా సింహాచలం అడవివరం సమీపంలోని గురుకుల పాఠశాలలను ఆయన ఆకస్మికంగా సందర్శించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి