Home » Visaka
ఉద్యోగుల్లో మానసిక ఉల్లాసానికి క్రీడలు దోహదపడతాయని ఏపీఎస్ ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు అన్నారు.
విశాఖలో డీప్ టెక్ సదస్సు.. ఈ కార్య క్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. ఏపీని నాలెడ్జ్ హబ్గా మారుస్తామని, 2014-19 మధ్య ఏపీ గ్రోత్ రేట్ 13 శాతమని.. ఇప్పుడు 15 శాతం టార్గెట్గా పనిచేస్తున్నామని తెలిపారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గురువారం రాత్రి విశాఖపట్నం వస్తున్నారు. ఆయన ఆరో తేదీన నోవాటెల్లో జరిగే ‘డీప్ టెక్నాలజీ సదస్సు-2024’లో పాల్గొంటారు. దీనిని గ్లోబల్ ఫోరం ఫర్ సస్టెయినబుల్ ట్రాన్సఫర్మేషన్ నిర్వహిస్తోంది. దీనికి ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఠక్కర్ చైర్మన్గా వ్యవహరిస్తున్నారు.
దుర్గారావు, సుష్మిత పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నారు. అనంతరం ప్రేమ వ్యవహారాన్ని పెద్దలకు చెప్పారు. అయితే పెళ్లికి ఇరు కుటుంబాలు నిరాకరించాయి.
అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మాసిటీ ఠాగూర్ ఫార్మా కంపెనీలో జరిగిన ప్రమాదంలో మరొకరు మృతి చెందారు. కిమ్స్ ఆస్పత్పిలో చికిత్స పొందుతో గురువారం తెల్లవారుజామున మృతిచెందినట్లుగా వైద్యులు ధృవీకరించారు. మరో ఏడుగురు చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు ధృవీకరించారు. ఈ ప్రమాదానికి కారణాలు ఏంటనేది పూర్తి నివేదికతో ప్రభుత్వం దృష్టి సారించింది.
ఆంధ్రప్రదేశ్ వాణిజ్య రాజధానిగా విశాఖపట్నం మహానగరం రూపాంతరం చెందింది. అలాంటి ఈ నగరం రోజు రోజుకు విస్తరిస్తుంది.
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్ర ప్రభుత్వం తనకు కల్పిస్తున్న ఎక్స్(X) 1+1 భద్రతను వెనక్కి తీసుకోవాలని విశాఖ శారదాపీఠం స్వరూపానందేంద్ర స్వామి (Swaroopanandendra Swamy) కోరారు.
పంచారామ క్షేత్రం పాలకొల్లలోని క్షీరా రామలింగేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. సోమవారం తెల్లవారుజాము నుంచి స్వామి వారి మూలవిరాట్కు అభిషేకాలు జరుగుతున్నాయి. భక్తులు దీపోత్సవాలు చేస్తున్నారు. కార్తీకమాసం ఆఖరి సోమవారం సందర్భంగా అధిక సంఖ్యలో భక్తులు ఆలయానికి విచ్చేస్తున్నారు.
విశాఖ: నగరానికి చెందిన లా విద్యార్ధిని సత్యాల అంజన ప్రియ వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి కొడాలినానిపై ఫిర్యాదు చేశారు. దీంతో విశాఖ పోలీసులు కేసు నమోదు చేశారు. శనివారం రాత్రి 11 గంటలకు విశాఖపట్నం 3వ పట్టణ పోలీసు స్టేషన్లో ఆమె ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఈ మేరకు కేసు నమోదు చేశారు.
రుషి కొండ ప్యాలెస్ నిర్మాణంలో భాగంగా రిసార్టును కూలగొట్టిన సమయంలో అప్పటి అధికారులు ఈ సామగ్రిని ఏం చేశారో వివరించే ఫైల్ ఏదీ అందుబాటులో లేదు. ఈ ఫర్నిచర్ వివరాలతో కూడిన ఒక ప్రత్యేక ఫైల్ ఏపీటీడీసీ వద్ద ఉండేది. ప్రభుత్వం మారిన తర్వాత అది మాయమైనట్లు తెలుస్తోంది.