Home » Visa
వలసలపై బ్రిటన్ ప్రభుత్వ ఆంక్షలు అక్కడి ఉన్నత విద్యాసంస్థలపై ప్రతికూల ప్రభావం చూపిస్తాయని అక్కడి పరిశీలకులు అంటున్నారు.
భారత్తో వాణిజ్య, ఆర్థిక బంధాన్ని మరింత బలోపేతం చేసేందుకు దుబాయ్ ఇటీవలే మల్టీ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టింది.
మనలో చాలా మందికి జీవితంలో కనీసం ఒకసారైనా విదేశాలకు వెళ్లాలనే కోరిక ఉంటుంది. విదేశాలకు వెళ్లి అక్కడి పర్యాటక ప్రదేశాలన్నింటిని చూడాలని ఉంటుంది. అయితే విదేశాలకు వెళ్లాలంటే పాస్పోర్టు, వీసా తప్పనిసరిగా ఉండాలి. లేదంటే వెళ్లడం కుదరదు. దీంతో చాలా మంది వెళ్లలేకపోతుంటారు.
మీకు పాస్పోర్ట్ ఉందా? అయితే మీకో శుభవార్త.. వీసాలు తీసుకునే అవసరం లేకుండా భారతీయులు వెళ్లి వచ్చే దేశాల సంఖ్య తాజాగా పెరిగింది. ఇప్పటివరకు కేవలం పాస్పోర్ట్తో భారతీయులను అనుమతించే దేశాలు 23 ఉండేవి. తాజాగా మరో మూడు దేశాలు ఈ జాబితాలో చేరాయి.
Rishi Sunak toughens UK visa rules: వచ్చే ఏడాది యూకే (United Kingdom) లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తాజాగా రిషి సునాక్ సర్కార్ సంచలన నిర్ణయాలు తీసుకుంటుంది. ప్రధానంగా దేశంలోకి వలసల నిరోధానికి బ్రిటన్ ప్రభుత్వం కఠిన చర్యలకు ఉపక్రమించింది.
భారతీయులకు వీసాలు జారీ చేయడంలో అమెరికా రికార్డు క్రియేట్ చేసింది. గతేడాది భారతీయ విద్యార్థులకు అత్యధిక వీసాలు జారీ చేసిన దేశంగా నిలిచింది.
భారత టూరిస్టులకు (Indian tourists) మలేసియా తీపి కబురు చెప్పింది. పర్యాటక రంగానికి ఊతమిచ్చే ఉద్దేశంతో వియత్నం, థాయ్లాండ్, శ్రీలంక బాటలోనే మలేసియా కూడా భారతీయులకు వీసా ఫ్రీ ఎంట్రీ (visa-free entry) కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
వీసా(Visa)ల జారీ విషయంలో మలేసియా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై భారత్(India) నుంచి తమ దేశానికి వచ్చే వారికి వీసారహిత ప్రవేశాన్ని అనుమతిస్తున్నట్లు ప్రభుత్వం నిర్ణయించింది.
పదవీ విరమణ తర్వాత ప్రవాస నివాసితులు దేశంలోనే ఉండేందుకు వీలు కల్పిస్తూ 2021 నవంబర్లో యూఏఈ ప్రభుత్వం రెసిడెన్సీ చట్టానికి సవరణలు చేసింది. దీనిలో భాగంగా పదవీ విరమణ చేసిన, 55 ఏళ్ల కంటే ఎక్కువ వయస్సు ఉన్న నివాసితులు 5 సంవత్సరాల దీర్ఘకాలిక వీసా కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
వివిధ రంగాల్లో తమ దేశానికి విశేష కృషి చేసిన వారికి యూఏఈ ప్రభుత్వం మంజూరు చేసేదే గోల్డెన్ వీసా. ఈ గోల్డెన్ వీసా ద్వారా ఆ దేశంలో దీర్ఘకాలిక రెసిడెన్సీకి వీలు కలుగుతుంది.