Home » Visa
శ్రీలంక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పర్యాటక రంగాన్ని మరింత ప్రోత్సహించే ఉద్దేశంతో ఏడు దేశాల టూరిస్టులకు వీసాలు లేకుండా పర్యటక ప్రదేశాల సందర్శనకు అనుమతి ఇవ్వాలని నిర్ణయించింది. ఈ ఏడు దేశాల్లో ఇండియా, చైనా, రష్యా, మలేసియా, జపాన్, ఇండోనేషియా, థాయ్లాండ్ ఉన్నాయి.
రెసిడెన్సీ నుంచి గోల్డెన్ వీసా వరకు ఇలా ఏ వీసా అయినా సరే.. ఇంట్లో నుంచి కదలకుండా దరఖాస్తు, రెన్యువల్ చేసుకోవచ్చు. అలాగే ఎమిరేట్స్ ఐడీ అప్డేట్ లేదా ఇతర ఏదైనా మార్పులు చేయాలన్న ఇప్పుడు చాలా ఈజీ. దీనికోసం ప్రత్యేకంగా అమెర్ కేంద్రాలకు (Amer centres) వెళ్లాల్సిన అవసరం లేదు.
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (United Arab Emirates) సందర్శకుల కోసం ఈ ఏడాది మేలో పున:ప్రారంభించిన 3నెలల కాలపరిమితితో ఇచ్చే విజిట్ వీసాను (Visit visa) మళ్లీ నిలిపివేసింది.
విదేశాలకు వెళ్లాలంటే పాస్పోర్ట్ (Passport), వీసా వంటి ట్రావెల్ డాక్యుమెంట్స్ తప్పనిసరి. ఇవి లేకుండా విదేశాలకు ప్రయాణం దాదాపు అసాధ్యం. అయితే, టెక్నాలజీ వినియోగంలో దూసుకెళ్తున్న దుబాయ్.. విదేశీయులు తమతో పాటు ఎలాంటి ట్రావెల్ డాక్యుమెంట్స్ లేకుండా కూడా నగరాన్ని సందర్శించవచ్చని చెబుతోంది.
హెచ్, ఎల్ కేటగిరీ ఉద్యోగుల వీసాల రెన్యువల్ కోసం దేశీయంగానే(అమెరికాలోనే) స్టాంపింగ్ ప్రక్రియను అనుమతించే పైలట్ కార్యక్రమం ఇంకా కార్యరూపం దాల్చకపోవడంతో అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్న వేలాదిమంది భారతీయ నిపుణులు నిరాశ చెందుతున్నారు.
వివిధ రంగాల్లో తమ దేశానికి విశేష కృషి చేసిన వారికి యూఏఈ ప్రభుత్వం మంజూరు చేసేదే గోల్డెన్ వీసా. ఈ గోల్డెన్ వీసా ద్వారా ఆ దేశంలో దీర్ఘకాలిక రెసిడెన్సీకి వీలు కలుగుతుంది. ఇక యూఏఈ ఇచ్చే ఈ లాంగ్టర్మ్ వీసా 10, 5ఏళ్ల కాలపరిమితో ఉంటుంది.
స్టూడెంట్స్, పర్యాటలకు బ్రిటన్ (Britain) బిగ్ షాక్ ఇచ్చింది. విద్యార్థి, విజిటర్ వీసాల ఫీజును బ్రిటన్ భారీగా పెంచిన విషయం తెలిసిందే. ఇంతకుముందు యూకే హోం ఆఫీస్ ప్రకటించినట్లు నేటి (బుధవారం) నుంచి ఈ పెంపు అమల్లోకి రానుంది.
భారత్ నుంచి చాలా మంది ఉన్నత చదువులు, ఉద్యోగాలు, ఉపాధి కోసం విదేశాలకు వెళ్తుంటారు. ఇలా వెళ్లేవారిలో అత్యధికంగా వెళ్లేది మాత్రం అగ్రరాజ్యం అమెరికాకే. అందుకే యూఎస్లో ఉండే విదేశీయుల జాబితాలో భారతీయులు (Indians) రెండో స్థానాన్ని అక్రమించారు.
ఆరు దేశాల గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ (Gulf Cooperation Council) తమ నివాసితులు సభ్య దేశాల మధ్య స్వేచ్ఛగా ప్రయాణించేలా 'ఒకే వీసా' (Single visa) విధానాన్ని పరిశీలిస్తోందని యూఏఈ (UAE) మంత్రి ఒకరు తెలిపారు. ఆ దేశ ఆర్థిక మంత్రి అబ్దుల్లా బిన్ టౌక్ అల్ మర్రిని ఉటంకిస్తూ అతి త్వరలో ఈ విధానాన్ని ప్రవేశపెట్టవచ్చని చెప్పారని ఓ ప్రముఖ న్యూస్ ఏజెన్సీ పేర్కొంది.
ఇజ్రాయెల్ పౌరులకు (Israel Citizens) అగ్రరాజ్యం అమెరికా తీపి కబురు అందించనుంది. ఈ దేశ పౌరులను యూఎస్ను సందర్శించడాన్ని సులభతరం చేయాలని జో బైడెన్ ప్రభుత్వం భావిస్తోంది.