Home » Vijayawada
Yoga: అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా నెల రోజుల పాటు ప్రజలను భాగస్వామ్యం చేస్తున్నారని, ఆరోగ్యకరమైన, ఆనందకరమైన సమాజం కోసం యోగా చేయాలని చీఫ్ సెక్రటరీ కె.విజయానంద్ పిలుపిచ్చారు. మన శరీరం, మనసును ఆధీనంలో ఉంచుకునేందుకు యోగా ఎంతో ఉపయోగ పడుతుందన్నారు.
Crime News: సీసీ కెమెరాల ఏర్పాటు వల్ల చాలా వరకు దొంగతనాలు అరికట్టామని, ఈ ఏడాదిలో 365 చోరీలు జరగ్గా, వాటిలో 185 మోటార్ బైక్లు చోరీలు ఉన్నాయని, వాటిపై కూడా ప్రత్యేక దృష్టి సారించామని సీపీ రాజశేఖర్ బాబు తెలిపారు. మోటార్ సైకిళ్లకు జీపీఎస్ ఏర్పాటు చేసుకోవాలని ఆయన సూచించారు.
ED investigation: ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వంలో జరిగిన మద్యం కుంభకోణం కేసు విచారణ కీలక దశకు చేరింది. ముడుపులు ఎవరికి చేరాయో తెలుసుకునేందుకు సిట్, ఈడీ కలిసి సమగ్ర దర్యాప్తు ప్రారంభించాయి.
Vamsi Custody Case: నకిలీ ఇళ్ల పట్టాల కేసులో మూడు రోజుల పాటు వంశీని కస్టడీకి ఇవ్వాలంటూ నూజివీడు కోర్టులో హనుమాన్ జంక్షన్ పోలీసులు రెండో సారి పిటిషన్ వేశారు. రెండు రోజులు వంశీ అస్వస్థతకు గురవడంతో సరిగా విచారణ జరగలేదని కోర్టుకు పోలీసులు తెలిపారు.
APPSC Group1 Case: ఏపీపీఎస్సీ గ్రూప్-1 మెయిన్స్ జవాబు పత్రాల మూల్యాంకనం కుంభకోణం కేసులో విచారణ జరుపుతున్న కొద్దీ కొత్త కొత్త విషయాలు, పేర్లు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో మధును విచారించగా క్యామ్సైన్ సంస్థ ఉద్యోగి రఘు పేరు వెలుగులోకి వచ్చింది. దీంతో అతని కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
Vamsi Health Update: మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని గుంటూరు జీజీహెచ్కు తరలించారు పోలీసులు. శ్వాస సంబంధిత సమస్య తీవ్రం కావడంతో వెంటనే వంశీని పోలీసులు జీజీహెచ్కు తీసుకొచ్చారు.
Buddha Venkanna: తెలుగు దేశం సీనియర్ నేత బుద్దా వెంకన్న.. వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నానీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. వంగవీటి మోహన రంగా పేద ప్రజల కోసం పాటు పడిన మహనీయుడని, అటువంటి గొప్ప వ్యక్తితో వంశీకి పోలికా.. అంటూ మండిపడ్డారు.
వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని నోరు అదుపులో పెట్టుకోవాలని ఏపీ ప్రభుత్వ వైద్యుల సంఘం హెచ్చరించింది. విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్పై పేర్ని నాని చేసిన ఆరోపణలు తక్షణం వెనక్కి తీసుకోవాలని..
Vijayawada Durgamma: ప్రతిరోజూ ఉదయం 11.45 నుంచి మధ్యాహ్నం 12.15 మధ్య అమ్మవారికి మహా నైవేద్య సమర్పణ, ఆలయ శుద్ది కార్యక్రమాలు ఉంటాయి. నైవేద్య సమయంలో దర్శన విరామం వలన పసిపిల్లలు, వృద్ధులు, దివ్యాంగులు ఇబ్బందులు పడటం గమనించి..
Bomb Threat: ఏపీలోని విశాఖ, విజయవాడ రైల్వే స్టేషన్లలో బాంబు పెట్టినట్లుగా కాల్స్ రావడం తీవ్ర కలకలం రేపుతోంది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు, బాంబ్ స్క్వాడ్ విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు.