• Home » Varla Ramaiah

Varla Ramaiah

 AP Elections: జగన్ ఔట్, చంద్రబాబు ఇన్..తప్పు చేస్తే వదిలేది లేదు

AP Elections: జగన్ ఔట్, చంద్రబాబు ఇన్..తప్పు చేస్తే వదిలేది లేదు

రాష్ట్రంలో అధికార మార్పిడి తథ్యమని అధికారులందరికీ తెలిసిపోయిందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య(Varla Ramaiah) వ్యాఖ్యానించారు. అందుకోసమే కార్యాలయాల్లోని రికార్డులు తరలించడానికి సిద్ధమవుతున్నారని పేర్కొన్నారు. ఈ క్రమంలో కార్యాలయాల్లోని రికార్డులు తరలించడానికి, మార్చడానికి వీల్లేదని ఆర్డర్ ఇవ్వాలని గవర్నర్‌ను కోరినట్లు వర్ల రామయ్య తెలిపారు.

AP Election 2024: ఆ ప్రాంతాల్లో రీపోలింగ్ చేయాలి.. ఈసీకి టీడీపీ ఫిర్యాదు

AP Election 2024: ఆ ప్రాంతాల్లో రీపోలింగ్ చేయాలి.. ఈసీకి టీడీపీ ఫిర్యాదు

నిన్న జరిగిన పోలింగ్‌లో 31 చోట్ల ఎన్నికలకు అంతరాయం కలిగిందని టీడీపీ సీనియర్ నేత వర్లరామయ్య (Varlaramaiah) అన్నారు. మాచర్ల, గురజాల, నరసరావు పేట, శ్రీకాళహస్తి తదితర చోట్ల పోలింగ్‌కు ఆటంకం కలిగిందని అన్నారు. ఆయా చోట్ల రీపోలింగ్ చేయాలని ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనాను కోరామని చెప్పారు.

AP Election 2024: మీ ఓటు ఎవరైనా వేస్తే .. ఇలా చేయండి..  ఓటింగ్‌పై వర్లరామయ్య కీలక సూచనలు

AP Election 2024: మీ ఓటు ఎవరైనా వేస్తే .. ఇలా చేయండి.. ఓటింగ్‌పై వర్లరామయ్య కీలక సూచనలు

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల సందడి నెలకొంది. రేపు(సోమవారం) అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలకు పోలింగ్‌ జరుగుతున్న విషయం తెలిసిందే. పోలింగ్‌లో మీ ఓటును మీరు కాకుండా ఇతరులు ఎవరైనా వేసినట్లు గుర్తిస్తే వెంటనే ఎన్నికల సంఘానికి (Electoral Commission) ఫిర్యాదు చేయండి. మీ ఓటుపై ఎలాంటి అనుమానాలు, సందేహాలు ఉన్నాఈసీకి తెలియజేయాలి. రేపు జరుగుతున్న పోలింగ్‌పై తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత వర్లరామయ్య కీలక సూచనలు చేశారు.

AP Elections: ఓటమిని ముందే ఒప్పుకున్న జగన్: వర్ల రామయ్య

AP Elections: ఓటమిని ముందే ఒప్పుకున్న జగన్: వర్ల రామయ్య

Andhrapradesh: పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్‌లో ఇంకా అయోమయం నెలకొందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య అన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. అక్కడ ఇక్కడ అంటూ ఓటు వినియోగించుకోకుండా ఉద్యోగులను అధికారులు ఇబ్బంది పెడుతున్నారని మండిపడ్డారు. పోస్టల్ బ్యాలెట్‌పై చాలా మంది జిల్లా కలెక్టర్లకు, ఆర్వోలకు క్లారిటీ లేదన్నారు. పోస్టల్ బ్యాలెట్‌ను ఉద్యోగులు సక్రమంగా వినియోగించుకునేలా చూడాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్ దే అని తెలిపారు.

AP Elections 2024: ఎన్నికల కమిషన్‌పై కోర్టుకెళ్తాం.. టీడీపీ నేత షాకింగ్ కామెంట్స్

AP Elections 2024: ఎన్నికల కమిషన్‌పై కోర్టుకెళ్తాం.. టీడీపీ నేత షాకింగ్ కామెంట్స్

ఏపీ ఎన్నికల సంఘాన్ని (Election Commission) తెలుగుదేశం పార్టీ నేతలు కలిశారు. ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ముకేష్ కుమార్ మీనాకు పలు ఫిర్యాదులు చేశామని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ పర్యటనలో చాలా మంది అధికారులు నిమగ్నమయ్యారని.. 1000 మంది ప్రత్యేక పోలీస్ అధికారులు ఎన్నికల డ్యూటీలో ఉన్నారని.. వారిని రేపు(బుధవారం) ఇక్కడికి పిలిపించి ఓటు వేశాక తిరిగి 14న ఎన్నికల విధులకు పంపాలని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత వర్ల రామయ్య (Varla Ramaiah) తెలిపారు.

AP Election 2024: వారికి ఓటు వేసే అవకాశం కల్పించాలి: వర్లరామయ్య

AP Election 2024: వారికి ఓటు వేసే అవకాశం కల్పించాలి: వర్లరామయ్య

పోస్టల్ బ్యాలెట్ , పోలింగ్ సమయంలో పరీక్షలపై ఎన్నికల సంఘానికి తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) సీనియర్ నేత వర్ల రామయ్య (Varla Ramaiah) ఫిర్యాదు చేశారు. సోమవారం నాడు ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ముకేష్ కుమార్ మీనాను కలిసి ఈ మేరకు ఫిర్యాదు చేశారు.తమిళనాడు రాష్ట్రంలో ఉన్న ఏపీ విద్యార్థులకు మే 14న పరీక్షలు ఉన్నాయని వివరించారు.

AP Election 2024: సీఎస్ జవహర్ పచ్చి అబద్ధాలు ఆడుతున్నారు.. వర్లరామయ్య ఆగ్రహం

AP Election 2024: సీఎస్ జవహర్ పచ్చి అబద్ధాలు ఆడుతున్నారు.. వర్లరామయ్య ఆగ్రహం

ఎన్నికల సంఘాన్ని (Election Commission) తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) నేతలు శుక్రవారం కలిశారు. ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి ముకేష్ కుమార్ మీనాకు ఏపీ పోలీసులపై టీడీపీ సీనియర్ నేత వర్లరామయ్య ఫిర్యాదు చేశారు. పోలీసు వాహనాలను ప్రజా రక్షణకు వాడాలని.. సీఎం జగన్ (CM Jagan) అవినీతి సొమ్ము ఓటర్లు చేరవేయడానికా వాడడం ఏంటని ప్రశ్నించారు.

Janasena: గాజు గ్లాసు గుర్తుపై వర్ల రామయ్య వేసిన పిటిషన్‌పై హైకోర్టు విచారణ

Janasena: గాజు గ్లాసు గుర్తుపై వర్ల రామయ్య వేసిన పిటిషన్‌పై హైకోర్టు విచారణ

గాజు గ్లాస్ గుర్తును స్వతంత్ర అభ్యర్థులకు కేటాయించకుండా జనసేన పార్టీకి రిజర్వ్ చేయాలని కోరుతూ టీడీపీ నేత వర్ల రామయ్య ఏపీ హైకోర్టులో పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. గుర్తుల కేటాయింపు ప్రక్రియ ఏ దశలో ఉందో కనుక్కొని సాయంత్రం నాలుగు గంటలకు కోర్టుకు చెప్పాలని ఎలక్షన్ కమిషన్కు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

AP Elections: గాజు గ్లాసుపై కోర్టుకు కూటమి: వర్ల రామయ్య

AP Elections: గాజు గ్లాసుపై కోర్టుకు కూటమి: వర్ల రామయ్య

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థులకు గాజు గ్లాసు గుర్తు కేటాయించిన అంశం అగ్గిరాజేసింది. కోర్టు ఇచ్చిన తీర్పును ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ముఖ్య అధికారి తప్పుగా అర్థం చేసుకున్నారు. ఇదే విషయాన్ని కోర్టులో సవాల్ చేస్తామని తెలుగుదేశం పార్టీ నేత వర్ల రామయ్య స్పష్టం చేశారు. గాజు గ్లాసు గుర్తు అంశంపై కూటమి నేతలు వివరించామని పేర్కొన్నారు. అయినప్పటికీ సీఈవోకు అర్థం కాలేదని తేల్చిచెప్పారు.

  AP Elections 2024: కేంద్ర బలగాలతో ఏపీ ఎన్నికలు నిర్వహించాలి: వర్ల రామయ్య

AP Elections 2024: కేంద్ర బలగాలతో ఏపీ ఎన్నికలు నిర్వహించాలి: వర్ల రామయ్య

ఏపీలో వైసీపీ (YSRCP) నేతలు ప్రజలను, ప్రతిపక్షాలను భ్రయభ్రాంతులకు గురిచేస్తున్నారని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత వర్ల రామయ్య (Varla Ramaiah) అన్నారు. పుంగనూరు నియోజకవర్గం ఏపీలో లేదా అక్కడ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రత్యేక సామ్రాజ్యం నడుపుతున్నారా అని ప్రశ్నించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి