Home » Varanasi
జ్ఞానవాపి కేసులో వారణాసి కోర్టు కీలక తీర్పు వెల్లడించింది. నేలమాళిగలోని శివాలయం ఉన్నట్లు పేర్కొంటున్న ప్రాంతంలో పూజించే హక్కు హిందువులకు ఉందని తెలిపింది. ..
వారణాసిలోని జ్ఞాన్వాపి మసీదుకు సంబంధించిన ఆర్కియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా సర్వే విడుదల చేసిన ఫొటోలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.
జ్ఞానవాపి మసీదు సర్వే నివేదికపై వారణాసి జిల్లా కోర్టు బుధవారంనాడు కీలక ఆదేశాలిచ్చింది. సర్వే నివేదిక హార్డ్ కాపీని పిటిషనర్లు, కేసు సంబంధీకులకు అందజేయాలని పేర్కొంది. అయితే నివేదక ప్రతిని మాత్రం తర్వాత బహిరంగం చేస్తారు.
ఎన్నో ఏళ్ల ఎదురుచూపులకు మరికాసేపట్లో తెరపడనుంది. ఎంతో కాలంగా కంటున్న కల నెరవేరే సమయం ఆసన్నమైంది. అయోధ్య పుణ్య క్షేత్రంలో బాల రాముడి ప్రాణ ప్రతిష్ఠకు అంతా సిద్ధమైంది. వేలాది మంది అతిథుల మధ్య సోమవారం మధ్యాహ్నం 12 గంటల 29 నిమిషాల 8 సెకన్లకు అభిజిత్ లగ్న ముహూర్తంలో ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం ప్రారంభంకానుంది.
రాముడి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమానికి ఛత్తీ్సగఢ్ నుంచి 300 టన్నుల సుగంధ బియ్యం లోడు అయోధ్యకు బయల్దేరింది. ఈ రాష్ట్రంలోని చాంద్ఖురీ గ్రామం రాముడి తల్లి కౌసల్య జన్మస్థలంగా భావిస్తారు.
వారణాసిలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని సవాలు చేసే పొలిటికల్ సూపర్స్టార్ల జాబితాను విపక్ష ఇండియా కూటమి పరిశీలిస్తోంది. సీట్ల షేరింగ్ వ్యవహారంపై ఇండియా కూటమి మంగళవారం సమావేశమైన మరుసటి రోజే ఈ జాబితాపై కసరత్తు మొదలుపెట్టినట్టు సమాచారం. నితీష్ కుమార్, ప్రియాంక గాంధీ వాద్రా పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి.
అయోధ్య శ్రీరామునిపై ఉన్న తన భక్తిని ఓ వజ్రాల వ్యాపారి నెక్లెస్ రూపంలో చాటుకున్నాడు. రసేష్ జ్యువెల్స్ డైరెక్టర్ కౌశిక్ కాకడియా అనే వజ్రాల వ్యాపారి అద్భుతమైన హస్తకళా నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ 5000 అమెరికన్ వజ్రాలను ఉపయోగించి రామాలయం థీమ్పై నెక్లెస్ను తయారు చేశారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన సొంత నియోజకవర్గమైన వారణాసిలో జరుపుతున్న రెండో రోజు పర్యటన కొనసాగుతోంది. ఇందులో భాగంగా వారణాసి నుంచి ఢిల్లీకి మరో కొత్త వందేభారత్ రైలును ప్రధాని సోమవారంనాడు ప్రారంభించారు. వారణాసి-ఢిల్లీ మార్గంలో ఇప్పటికే ఒక రైలు రాకపోకలు సాగిస్తుండగా ఇది రెండవది.
జ్ఞానవాపి మసీదుపై శాస్త్రీయ సర్వే నివేదికను భారత పురావస్తు శాఖ సోమవారంనాడు వారణాసి జిల్లా కోర్టుకు సమర్పించింది. సీల్డ్ కవర్లో ఈ నివేదికను అర్కియాలజికల్ సర్వే స్టాండింగ్ కౌన్సిల్ అమిత్ శ్రీవాత్సవ అందజేశారు.
ఉత్తరప్రదేశ్ లో ప్రధాని మోదీ(PM Modi) ఇవాళ పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు.