Home » Uttarakhand
పవిత్ర కేదార్నాథ్ ఆలయంలో భక్తుల మనోభావాలను దెబ్బతీసే ఘటనలు తరచుగా జరుగుతున్నాయి. ఇటీవల ఓ జంట చిత్రీకరించిన లవ్ ప్రపోజల్ వీడియోపై పెద్ద దుమారమే రేగింది. తాజాగా ఈ ఘటనపై చర్యలు తీసుకుంటామని పోలీసులు ప్రకటించారు. కాగా పవిత్ర కేదర్నాథ్ ఆలయంలో కొంతమంది వీడియోలు చిత్రీకరించడం పట్ల అనేక విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రీల్స్ చిత్రీకరించి వాటిని సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తుండడంతో భక్తుల మనోభావాలు దెబ్బతింటున్నాయి.
పెళ్లి అంటే నూరేళ్ల పంట. అనేక కుటుంబాల మధ్య బంధుత్వంతోపాటు ఆత్మీయతానుబంధాలు పెనవేసుకోవడానికి నాందీవాచకం. అందుకే ఈ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా, బంధుమిత్రుల సమక్షంలో జరుపుకుంటారు. కొందరు పవిత్ర పుణ్య క్షేత్రాల్లో తమ వివాహం జరుపుకుంటారు. ఇక ఆది దంపతులు శివపార్వతులు పెళ్లి చేసుకున్న చోటులోనే పెళ్లి చేసుకుంటే తమ జీవితాలు ఎంతో సౌభాగ్యవంతంగా సాగుతాయనే నమ్మకం చాలా మందికి ఉంటుంది.
ప్రస్తుత సమాజంలో చాలా మంది అందరి ముందూ విలాసవంతంగా కనిపించాలనే ఉద్దేశంతో తమ స్థాయికి మించి ఖర్చు చేస్తుంటారు. గొప్పలకు పోయి చివరకు అప్పులపాలవుతుంటారు. ఇక సినీ, రాజకీయ నాయకులకు చెందిన కుటుంబ సభ్యుల జీవితం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే..
ఉమ్మడి పౌర స్మృతిపై ఓ వైపు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుండగా, మరోవైపు త్వరలోనే ఉత్తరాఖండ్లో యూసీసీని అమలు చేయనున్నట్టు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ థామి శుక్రవారం ప్రకటించారు. యూసీసీపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ తన పనిని ఈరోజుతో పూర్తి చేసిందని, డ్రాఫ్ట్ కాపీ సిద్ధం చేసిందని చెప్పారు.
ఆగ్రాలో (Agra ) సేల్స్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో పీసీఏస్ (ప్రొవిన్షియల్ సివిల్ సర్వీస్) (Provincial Civil Service) అధికారిగా విధులు నిర్వర్తిస్తున్న నోబుల్ కుమార్కు (Noble Kumar) ఫేస్బుక్లో (Facebook) కల్పనా మిశ్రా (Kalpana Mishra) అనే మహిళతో పరిచయం ఏర్పడింది. కల్పన తనను తాను అండర్కవర్ ఐఏఎస్ ( Indian Administrative Service Officer) అధికారిణిగా పరిచయం చేసుకున్నారు.
ఉత్తరాఖండ్ లో కేదార్నాథ్ యాత్రను నిలిపివేశారు. రుద్రప్రయాగ్ జిల్లాలో భారీ వర్షాలు పడుతుండటంతో సోన్ప్రయాగ్ వద్ద యాత్రను నిలిపివేస్తూ ఆదేశాలు జారీ అయ్యారు. తదుపరి ఉత్తర్వులు వెలువడేంత వరకూ ఈ ఆదేశాలు అమల్లో ఉంటాయని రుద్రప్రయాగ్ జిల్లా మెజిస్ట్రేట్ మయూర్ దీక్షిత్ తెలిపారు.
హిందువులు పవిత్రంగా భావించే ఉత్తరాఖండ్లోని కేదార్నాథ్ ఆలయంలో అపచారం చోటు చేసుకుంది. గర్భగుడిలో ఉండే శివలింగంపై (Shivling) ఓ మహిళా భక్తురాలు కరెన్సీ నోట్లు (Currency Notes) చల్లుతూ తన్మయత్వంతో నృత్యం చేస్తూ కనిపించింది. ఆమె పక్కన ఉన్న భక్తులు కూడా ఆమెను ఆపకపోగా ప్రోత్సహించారు.
ఈ ఏడాది చార్ ధామ్ యాత్రకు రికార్డు స్థాయిలో భక్తులు నమోదు చేసుకున్నారు. శనివారంనాటికి 46.56 లక్షల మంది భక్తులతో సరికొత్త రికార్డు నమోదైంది. శనివారంనాటికి ఈ యాత్రలో భాగంగా గంగోత్రి, యమునోత్రి, బదరీనాథ్, కేదార్నాథ్ (మరియు హేమకుండ్ సాహిబ్) క్షేత్రాలను దర్శించుకున్నవారి సంఖ్య రికార్డు స్థాయిలో 28.41 లక్షలకు చేరింది.
ఉత్తరాఖండ్లోని డెహ్రాడూన్ను దేశ రాజధాని న్యూఢిల్లీతో కలుపుతున్న తొలి సెమీ-హై స్పీడ్ వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలును ప్రధాని నరేంద్ర మోదీగురువారం జెండా ఊపిప్రారంభించారు.
పామును చూస్తేనే చాలా మంది ఆమడదూరం పారిపోతారు. మరికొందరు ఇందకు విరుద్ధంగా పామును పట్టుకోవాలని చూస్తారు. ఇంకొందరు ఏకంగా.. పాముతోనే ఆటలు ఆడుతుంటారు. కొందరు మందుబాబులైతే .. ఇంకో అడుగు ముందుకేసి పామును మెడలో కూడా వేసుకుంటూ ఉంటారు. ఇదంతా చూసేందుకు..