Home » Uttarakhand
ఉత్తరాఖండ్ లోని ఉత్తరకాశీ సిల్క్యారా సొరంగంలో చిక్కుకున్న 41 మంది కార్మికులను సురక్షితంగా బయటకు తీసుకువచ్చేందుకు చేపట్టిన సహాయక చర్యలకు అవాంతరాలు తప్పడం లేదు. అమెరికా నుంచి తెప్పించిన ఆగర్ మిషన్కు ఇనుపపట్టీ అడ్డుపడటం, మిషన్ బ్లేడ్లు దెబ్బతినడంతో హైదరాబాద్ నుంచి కట్టర్ను రప్పిస్తున్నారు.
ఉత్తరాఖండ్ రాష్ట్రం, ఉత్తర కాశీ జిల్లాలో సిల్క్యారా వద్ద సొరంగం కూలిన ఘటనలో చిక్కుకున్న 41 మంది నేడు బయటకు వచ్చే అవకాశం ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది మాక్ డ్రిల్ నిర్వహించారు. ఒక పెద్ద పైపు ద్వారా వీల్ చైర్ను పంపించి దాని సాయంతో వారిని బయటకు తెచ్చేందుకు యత్నిస్తున్నారు.
ఉత్తరాఖండ్ లోని ఉత్తర్ కాశీ సిల్క్యారా టన్నెల్(Uttarakashi Tunnel Rescue) ప్రమాదంలో చిక్కుకున్న కార్మికులతో ఆ రాష్ట్ర సీఎం పుష్కర్ సింగ్ ధామీ(Pushkar Singh Dhami) సంభాషించారు. ధైర్యంగా ఉండాలని.. మరి కొన్ని గంటల్లో బయటకి వస్తారని భరోసా ఇచ్చారు.
ఉత్తరకాశీ: ఉత్తరాఖండ్ సొరంగ ప్రమాదంలో చిక్కుకుపోయిన 41 మంది కార్మికులను బయటకు తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు కొనసాగుతూనే ఉన్నాయి. 11వ రోజుకు చేరుకున్న రిస్క్యూ మిషన్ పనులు నిరాటంకంగా కొనసాగుతున్నాయి.
ఉత్తర కాశీ టన్నెల్(Uttarakhashi Tunnel Collapse) లో చిక్కుకున్న 41 మంది కార్మికులను కాపడటానికి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా 3 అంబులెన్స్ లు ఇప్పటికే అక్కడికి చేరుకున్నాయి.
ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ఉత్తరకాశీలో సొరంగం కూలిన ఘటనలో శిథిలాల్లో చిక్కుకున్న కూలీలకు సంబంధించిన విజువల్స్ మొదటిసారి బయటకువచ్చాయి. సొరంగంలో మొత్తం 41 మంది కార్మికులు చిక్కుకున్న సంగతి తెలిసిందే.
క్షణ క్షణం ఆందోళన, ఉత్కంఠకు గురి చేస్తున్న ఉత్తర కాశీ టన్నెల్(Uttarkashi rescue) ఘటనలో ఊరటనిచ్చే విషయం చెప్పారు అధికారులు. కార్మికులకు ఫుడ్ సప్లై చేసేందుకు ఏర్పాటు చేసిన 6 అంగుళాల పొడవైన పైపు వారు ఉన్న లోకేషన్ కి చేరుకుంది.
ఉత్తరాఖండ్(Uttarakhand)లో టన్నెల్ కుప్పకూలిన ఘటన జరిగి నేటికి 9 రోజులు. టన్నెల్(Uttarakhand Tunnel Collapse)లో చిక్కుకుపోయిన 41 మంది కార్మికుల ప్రాణాలు దక్కుతాయన్న ఆశలు సన్నగిల్లుతున్నాయి. అమెరికా యంత్రాల సాయంతో కార్మికులను చేరుకోవాలనే ప్రయత్నాలు ఆశించినమేర ఫలించలేదు. దీంతో ఇవాళ అంతర్జాతీయ టన్నెలింగ్ నిపుణులు కార్మికులను రక్షించడానికి ప్రయత్నాలు ముమ్మరం చేశారు.
ఉత్తరాఖండ్(Uttarakhand)లో సొరంగం కూలిన ఘటనలో చిక్కుకుపోయిన 40 మంది కార్మికులను రక్షించేందుకు ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. ఇందుకోసం అమెరికాకు చెందిన అత్యాధునిక డ్రిల్లింగ్ పరికరంతో సహాయక చర్యలు చేపట్టారు.
ఉత్తరాఖండ్ లోని ఉత్తరకాశీలో నిర్మాణంలో ఉన్న టన్నెల్ ఆదివారం ఉదయం కుప్పకూలంతో తలెత్తిన ఉత్కంఠ 70 గంటలు గడిచినా కొనసాగుతోంది. సొరంగంలో చిక్కుకుపోయిన 40 మంది కార్మికులను వెలికితీసేందుకు రిస్క్యూ టీమ్లు అవిశ్రాంతంగా శ్రమిస్తున్నప్పటికీ వాతావరణ ప్రతికూలత, మంగళవారం రాత్రి మళ్లీ కొండచరియలు విరిగిపడటంతో సహాయక యత్నాల్లో ఆటంకం తలెత్తింది.