Home » Uttarakhand
బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం దాదాపు తెల్లవారు జామున 4.30 వరకు కొనసాగింది. బీజేపీ లోక్సభ అభ్యర్థుల తొలి జాబితాను శుక్రవారం ఎప్పుడైనా విడుదల చేయవచ్చు. ఇక ఈ సమావేశంలో దాదాపు 16 రాష్ట్రాల నుంచి లోక్సభ అభ్యర్థుల పేర్లను చర్చించి ఖరారు చేశారని సమాచారం. బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో తొలుత ఉత్తరప్రదేశ్ అభ్యర్థుల పేర్లపై చర్చ జరిగినట్టు తెలుస్తోంది.
ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తి ధ్వంసం కేసుల్లో జరిగిన ఆస్తి నష్టాన్ని ఎవరు భరిస్తారనేదానిపై ఇప్పటివరకు స్పష్టత లేదు. అలాంటి కేసుల్లో ఆస్తి నష్టం పూర్తి భారాన్ని నిందితులపై పెట్టాలని ఉత్తరాఖండ్ ప్రభుత్వం నిర్ణయించింది.
ఉత్తరాఖండ్ లోని హల్ద్వానీ హింస ఘటనలో కీలక సూత్రధారిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ నెల 8న నైనిటాల్ జిల్లాలోని హల్ద్వానీలో హింస చెలరేగింది. బంభూల్పురా ప్రాంతంలో ఒక మసీదు, మదర్సాను కూల్చేశారు.
తన పక్కనే నిద్రిస్తున్న 52 ఏళ్ల భార్యను విద్యుత్ వైర్ నోట్లో పెట్టి కరెంట్ షాక్కు గురయ్యేలా చేసి దారుణంగా హత్య చేసిన 60 ఏళ్ల వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు.
ఉత్తరాఖండ్లోని(Uttarakhand) హల్ద్వానీలో అక్రమంగా నిర్మించిన మదర్సా, మసీదు కూల్చివేత(Masjid Demolition) ఘటనలో జరిగిన హింసలో నలుగురు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. 250కిపైగా గాయపడినట్లు వివరించారు.
ప్రభుత్వ స్థలంలో అక్రమంగా నిర్మించిన మసీదు కూల్చివేత ఉద్రిక్తతకు దారి తీసింది. వాహనాలకు నిప్పు పెట్టడంతో పలు వెహికిల్స్ కాలి బూడిదయ్యాయి. ఈ ఘటన ఉత్తరాఖండ్లోని హల్ద్వానీలో జరిగింది.
ఎవరైతే లివ్-ఇన్ రిలేషన్షిప్లో ఉన్నారో, అలాగే ఎవరైతే సహజీవనం చేయాలని ప్లాన్ చేస్తున్నారో వాళ్లు తమ రిలేషన్ని జిల్లా అధికారుల వద్ద తప్పకుండా రిజిష్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ సహజీవనం చేయాలనుకునే వారి వయసు 21 ఏళ్ల కంటే తక్కువగా ఉంటే.. వారి బంధానికి తల్లిదండ్రుల సమ్మతి కచ్ఛితంగా అవసరం అవుతుంది.
ప్రకృతి అందాలను తిలకించేందుకు ఇదే సరైన సమయం. ట్రెక్కు వెళ్లేందుకూ మంచి తరుణం. అందమైన ప్రకృతి దృశ్యాలు, సుందరమైన పర్వతాలు, కఠినమైన ట్రెక్కింగ్ ట్రయల్స్ అనుభవాన్ని మరింత ఉత్కంఠగా మారుస్తాయి.
రోజురోజుకూ అడవులు తరిగిపోతుండడంతో జంతువుల మనుగడకు ప్రమాదం వాటిళ్లుతోంది. ఈ క్రమంలో పులులు, సింహాలు, ఏనుగులు.. అటవీ ప్రాంత గ్రామాల్లోకి చొరబడడం చూస్తూనే ఉన్నాం. ఇలాంటి సందర్భాల్లో...
ఉత్తరాఖండ్లోని రూర్కీలో మంగళవారంనాడు ఘోర విషాదం చోటుచేసుకుంది. లహబోలి గ్రామంలో ఇటుక బట్టీ గోడకూలి బట్టీ కార్మికులు ఆరుగురు దుర్మరణం పాలయ్యారు. పలువురు గాయపడ్డారు. గోడ శిథిలాల కింద చిక్కుకున్న కార్మికులను సురక్షితంగా బయటకు తెచ్చేందుకు సహాయక చర్యలు జరుగుతున్నాయి.