Home » Uttam Kumar Reddy Nalamada
తెలంగాణ నుంచి ఫిలిప్పీన్స్ దేశానికి ఇప్పటివరకు 30 వేల మెట్రిక్ టన్నుల బియ్యం ఎగుమతి చేశామని, ఈ ఏడాది మరో 2 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం పంపేందుకు ఒప్పందం కుదిరిందని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.
మంత్రివర్గం ఆమోదం లేకుండానే కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించి కేసీఆర్, హరీశ్లు తెలంగాణ ప్రజలను మోసం చేశారని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి ఆరోపించారు.
కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిటీ అందించిన నివేదికను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కేబినెట్ ముందుంచారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా నివేదికలోని సంచలన విషయాలు బయటపెట్టారు.
ఏపీ మంత్రి నారా లోకేష్ బనకచర్ల ప్రాజెక్టు కడతామని అన్నారని.. ఈ ప్రాజెక్టును తాము వ్యతిరేకిస్తున్నామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. బనకచర్లను సీడబ్ల్యూసీ తిరస్కరించిందని గుర్తుచేశారు. బనకచర్ల ప్రాజెక్టును వ్యతిరేకిస్తున్నామని ఢిల్లీలో జరిగిన సమావేశంలో తాము చెప్పామని మంత్రి ఉత్తమ్ పేర్కొన్నారు.
గోదావరిలో మిగులు/వరద జలాలు లేవని.. ఒకవేళ ఉంటే గనక ఆ నీటిపై నదిని పంచుకునే అన్ని రాష్ట్రాలకు సమానవాటా ఉంటుందని నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.
బీఆర్ఎస్ నేతలు నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని.. గులాబీ నేతలు పబ్లిసిటీ కోసం మాత్రమే తమ ప్రభుత్వంపై ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ధ్వజమెత్తారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు జాగ్రత్తలు తీసుకుంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కాదని తెలిపారు. బీఆర్ఎస్ గాలి మాటలు తప్ప వాస్తవం లేదని మంత్రి ఉత్తమ్ క్లారిటీ ఇచ్చారు.
ఆక్రమణలకు గురైన నీటిపారుదల శాఖ భూములన్నింటినీ యుద్ధ ప్రాతిపదికన స్వాధీనం చేసుకుంటామని ఆ శాఖ మంత్రి ఉత్తమ్కుమార్
కాళేశ్వరం ఇరిగేషన్ కార్పొరేషన్కు ఇచ్చిన రుణాలను రీషెడ్యూల్ చేయాలంటూ రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్
నాగార్జునసాగర్ జలాశయం నుంచి దిగువకు కృష్ణమ్మ పరవళ్లు మొదలయ్యాయి. ఎగువ నుంచి భారీగా వరద వస్తుండడం, గరిష్ఠ నీటిమట్టానికి చేరువలో ఉండడంతో ప్రాజెక్టు గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు.
కొత్త రేషన్ కార్డుల మంజూరు, పాత కార్డుల్లో సభ్యుల నమోదు ప్రక్రియ నిరాటంకంగా కొనసాగుతోంది. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 5,61,343 కుటుంబాలకు ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులను మంజూరుచేయగా..