Home » Tungabhadra
తుంగభద్ర రిజర్వాయర్లోకి భారీగా వరద నీరు వస్తోంది. దీంతో ప్రాజెక్టు ఆయకట్టు రైతుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. ప్రాజెక్టు ఎగువన కురుస్తున్న వర్షాలతో నీరు పెద్దఎత్తున వస్తోంది. ప్రస్తుతం జలాశయంలో 21.091 టీఎంసీల నీరు నిలువ ఉంది.
కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఉమ్మడి ప్రాజెక్టు అయిన తుంగభద్రలో నీటిమట్టం పెరుగుతోంది. ఎగువన కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వస్తోంది. దీంతో డ్యాంలోకి వరద నీరు వస్తుండగా ప్రస్తుత నీటిమట్టం 18.86 టీఎంసీలుగా ఉంది. అలాగే.. ఇన్ఫ్లో 20 వేల క్యూసెక్కులుగా ఉంది.
తుండభద్ర రిజర్వాయర్ నీటి విడుదలపై అధికారులు ఒక స్పష్టమైన ప్రకటన చేయాలని రైతుసంఘం నాయకులు డిమాండ్ చేస్తున్నారు. నీటి విడుదలపై అధికారులు ఇంకా ఏ ప్రకటన చేయకపోవడం వలన రైతుల్లో ఆందోళన వ్యక్తం అవుతోందన్నారు.
‘తుంగభద్ర’పై కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహిస్తోందని భారతీయ జనతా పార్టీ నేతలు ఆరోపించారు. ఈమేరకు ఆపార్టీ నాయకుల బృందం డ్యాంను సందర్శించింది. అనంతరం నాయకులు మాట్లాడుతూ.. ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం డ్యాంను పట్టించుకోవడం లేదన్నారు.
తుంగభద్ర డ్యాంలో ఈ ఏడాది 80 టీఎంసీలకు మించి నీటిని నిల్వ చేయరాదని నిర్ణయం తీసుకున్నారు. క్రస్ట్ గేట్ల దురవస్థ కారణంగా ముందు జాగ్రత్త చర్యలతో నీటిని దిగువకు వదిలే యోచనలో ఉన్నారు.
కర్ణాటక-ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల రైతులకు సాగునీరందించే తుంగభద్ర రిజర్వాయర్ వద్ద పోలీసులు భారీగా మోహరించారు. భారత్, పాకిస్థాన్ మధ్య ప్రస్తుతం ఏర్పడ్డ పరిస్థితుల నేపధ్యంతో.. ఈ భద్రతను ఏర్పాటు చేశారు. పోలీసులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ పహారా కాస్తున్నారు.
తుంగభద్ర డ్యాం గేట్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి, వాటి సామర్థ్యం 40-55% తగ్గిపోయింది. 2026 జూన్ నాటికి మొత్తం 33 గేట్లను మార్పిడి చేయడానికి ₹60 కోట్లతో టెండర్లు పిలవబడినట్లు టీబీపీ బోర్డు ప్రకటించింది.
తుంగభద్ర ఎగువ కాలువ(హెచ్చెల్సీ) మరమ్మతుల పట్ల కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధి చాటుకుంది. ఈక్రమంలోనే గత ప్రభుత్వ ఆంక్షలను ఎత్తేస్తూ రూ.37 కోట్ల నిధులు మంజూరు చేసింది. ప్రతి ఏటా కాలువలో కేటాయింపు జలాలను సరిహద్దు నుంచి పీఏబీఆర్ ...
సాగునీటి ప్రాజెక్టుల గేట్ల నిపుణుడు కన్నయ్యనాయుడు ఆధ్వర్యంలో పది రోజులకుపైగా శ్రమించి ‘స్టాప్లాగ్ ఎలిమెంట్స్’ ఏర్పాటు చేశారు.
గంగావతి తాలూకా సణాపుర గ్రామం వద్ద తుంగభద్ర నది(Tungabhadra River)లో ఈతకని వెళ్ళి నదిలో కొట్టుకుని పోయిన హైదరాబాద్(Hyderabad)కు చెందిన ప్రైవేట్ ఆసుపత్రి వైద్యురాలు అనన్యరావు(26) మృత దేహాన్ని ఎట్టకేలకు గురువారం రక్షణ సిబ్బంది గుర్తించారు.