Home » Tungabhadra
తుంగభద్ర జలాశయానికి ఇన్ఫ్లో(Inflow) తగ్గుముఖం పట్టింది. రెండు రోజులుగా ఎగువ నుంచి వరద తాకిడి తగ్గింది. దీంతో ఇప్పుడే క్రస్ట్గేట్లు ఎత్తే ఆలోచన లేనట్లు బోర్డు అధికారులు అభిప్రాయపడుతున్నారు.
తుంగభద్ర డ్యాం నుంచి ఎగువ, దిగువ కాలువలకు జూలై 10న నీరు విడుదల చేయాలని ఐసీసీ నిర్ణయించింది. డ్యాంలో ఉన్న నిల్వల ఆధారంగా నీటిని విడుదల చేయాలని తీర్మానం చేసింది.
తుంగభద్ర జలాశయానికి వరదనీటి చేరిక రోజురోజుకు పెరుగుతోంది. ఇప్పటికే రోజూ 50 వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉంది. ఇది రెండురోజుల నుంచి భారీగా పెరుగుతుండటంతో గత ఏడాది కొట్టుకుపోయిన 19వ క్రస్ట్గేట్ మరమ్మతు పనులు పూర్తిగా నిలిచిపోయాయి.
దెబ్బతిన్న తుంగభద్ర ప్రాజెక్టు 32 క్రస్ట్గేట్లను మార్చాల్సి ఉన్న నేపథ్యంలో 2025-26 నీటి సంవత్సరంలో డ్యాంలో నీటి నిల్వను 80 టీఎంసీలకు పరిమితం చేయాలని బోర్డు అధికారులు నిర్ణయించారు.
తుంగభద్ర ఆయకట్టు క్రస్ట్గేట్లకు కాలం చెల్లడంతో జలాశయానికి సంబంధించి 32 గేట్లను మార్చాలని అధికారులు ప్రణాళిక సిద్ధం చేసిన నేపథ్యంలో.. ఈ ఏడాది జలాశయంలో పూర్తి స్థాయిలో కాకుండా 80 టీఎంసీల నీరు నిలపాలని అధికారులు నిర్ణయించారు.
తుంగభద్ర ఆయకట్టు రైతులు సాగుకు సమాయత్తం అవుతున్నారు. కాల్వల్లోకి నీరు రాకున్నా నారు పోసుకుని సిద్ధంగా ఉన్నారు. నదీ జలాలు, బోర్లు, డ్యాం నీరు ఆధారంగా బళ్లారి, విజయనగర, కొప్పళ, రాయచూరు జిల్లాల్లో 7లక్షల హెక్టార్ల ఆయకట్టు పైగా ఉంది.
తుంగభద్ర రిజర్వాయర్లోకి భారీగా వరద నీరు వస్తోంది. దీంతో ప్రాజెక్టు ఆయకట్టు రైతుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. ప్రాజెక్టు ఎగువన కురుస్తున్న వర్షాలతో నీరు పెద్దఎత్తున వస్తోంది. ప్రస్తుతం జలాశయంలో 21.091 టీఎంసీల నీరు నిలువ ఉంది.
కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఉమ్మడి ప్రాజెక్టు అయిన తుంగభద్రలో నీటిమట్టం పెరుగుతోంది. ఎగువన కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వస్తోంది. దీంతో డ్యాంలోకి వరద నీరు వస్తుండగా ప్రస్తుత నీటిమట్టం 18.86 టీఎంసీలుగా ఉంది. అలాగే.. ఇన్ఫ్లో 20 వేల క్యూసెక్కులుగా ఉంది.
తుండభద్ర రిజర్వాయర్ నీటి విడుదలపై అధికారులు ఒక స్పష్టమైన ప్రకటన చేయాలని రైతుసంఘం నాయకులు డిమాండ్ చేస్తున్నారు. నీటి విడుదలపై అధికారులు ఇంకా ఏ ప్రకటన చేయకపోవడం వలన రైతుల్లో ఆందోళన వ్యక్తం అవుతోందన్నారు.
‘తుంగభద్ర’పై కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహిస్తోందని భారతీయ జనతా పార్టీ నేతలు ఆరోపించారు. ఈమేరకు ఆపార్టీ నాయకుల బృందం డ్యాంను సందర్శించింది. అనంతరం నాయకులు మాట్లాడుతూ.. ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం డ్యాంను పట్టించుకోవడం లేదన్నారు.