Home » Tourist Spots
పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసేలా సీఎం చంద్రబాబు ప్రోత్సహిస్తున్నారని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. ప్రకృతి అందాలను అభివృద్ధి చేయడం ద్వారా నేడు అద్భుతమైన ప్రదేశాలుగా మారాయని వివరించారు. పర్యాటక రంగంలో సుస్థిరమైన మార్పు వచ్చిందని చెప్పడానికి ఏపీ ప్రత్యక్ష ఉదాహరణ అని మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు.
పర్యాటక రంగం డెవలప్మెంట్పై తెలంగాణ ప్రభుత్వం దృష్టి సారించింది. ఇందులో భాగంగా శిల్పారామంలో టూరిజం కాంక్లేవ్ శనివారం జరుగనుంది. ఈ కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి హాజరుకానున్నారు.
కర్ణాటకలోని ప్రకృతి సోయగాలను ఒకే టూర్లో సందర్శించే అవకాశం కల్పిస్తోంది ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC). కాఫీ విత్ కర్ణాటక టూర్ పేరిట తీసుకొచ్చిన ప్యాకేజీ కింద కేవలం రూ.12 వేలకే కూర్గ్, మైసూర్ సహా పలు పలు ప్రదేశాలను చుట్టేయొచ్చు.
నేచర్ లవర్స్ స్వర్గధామం.. కుంటాల వాటర్ఫాల్స్.. ఇది తెలంగాణలో అత్యంత ఎత్తైన జలపాతం. వర్షాకాలంలో పరవళ్లు తొక్కే కుంటాల జలపాత సోయగాలు పర్యాటకులకు కనువిందు చేస్తాయి. హైదరాబాద్కు సమీపంలోనే ఉన్న ఈ వాటర్ ఫాల్స్ ప్రత్యేకలేంటి? ఎలా వెళ్లాలి? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
శ్రీరాముని జీవితానికి సంబంధించిన కీలక ప్రదేశాలను ఒకే టూర్ ద్వారా సందర్శించే అవకాశం కల్పిస్తోంది ఐఆర్సీటీసీ. ఇకపై భక్తులు రామాయణ యాత్ర ప్యాకేజీ ద్వారా కేవలం 17 రోజుల్లో 30 రామక్షేత్రాలను దర్శించుకోవచ్చు.
దక్షిణ భారతంలోని ఆధ్యాత్మిక క్షేత్రాలను ఒకే ట్రిప్ ద్వారా చుట్టేసేందుకు ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) మరో సరికొత్త ప్యాకేజీని తీసుకొచ్చింది. జులై 28 నుంచి ప్రారంభం కానున్న ఈ 13 రోజుల యాత్రకు IRCTC టూరిజం అధికారిక వెబ్సైట్లో ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. ఈ ప్యాకేజీకి సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం..
IRCTC Ramayana Yatra Package: దేశవ్యాప్తంగా పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) ఎప్పటికప్పుడు సరికొత్త టూర్ ప్యాకేజీలను తీసుకొస్తుంటుంది. ఈ క్రమంలోనే మరోసారి రామాయణ యాత్ర స్పెషల్ టూర్ ప్యాకేజీ ప్రారంభించనుంది. ఈ నెల జులై 25 నుంచి మొదలుకానున్న ఈ ఆధ్యాత్మిక యాత్రలో పర్యాటకులు 17 రోజుల్లోనే 30 ప్రముఖ రామక్షేత్రాలను దర్శించుకోవచ్చు.
IRCTC Mata Vaishno Devi Tour 2025: దేశవిదేశాల్లోని ప్రముఖ్య పర్యాటక ప్రాంతాలు, పుణ్యక్షేత్రాల సందర్శన కోసం భారతీయ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) వివిధ రకాల టూర్ ప్యాకేజీలను తీసుకొచ్చింది. ఉత్తరభారతంలోని ప్రధాన పుణ్యక్షేత్రాలను ఒకే ట్రిప్ లో దర్శించుకోవాలని కోరుకునే దక్షిణాది భారతీయుల కోసం భారత్ గౌరవ టూరిస్ట్ ట్రైన్ ఓ ప్యాకేజీ ప్రకటించింది.
మినీ స్విట్జర్లాండ్గా గుర్తింపు పొందిన పహల్గామ్లో సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. ఉగ్రవాదుల దాడి తర్వాత కొన్ని రోజుల పాటు స్థబ్ధగా ఉన్న ఆ ప్రాంతంలో ఆంక్షలను ఎత్తివేశారు. దీంతో మళ్లీ దేశీయులతో పాటు విదేశీ పర్యాటకులు సందడి చేస్తున్నారు.
Kailash Mansarovaram Mysteries: మానససరోవరం ఒక ఆధ్యాత్మిక చిహ్నం మాత్రమే కాదు. భౌగోళిక అద్భుతం కూడా. ఇక్కడ ఎవరూ కనుగొనలేని లెక్కలేనన్ని రహస్యాలు ఎన్నో ఉన్నాయి. ప్రపంచం కనుగొనలేని ఈ 5 అద్భుతాలు ఇప్పటికీ అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తుతాయి. అవేంటంటే..