Home » TMC
దేశంలో సార్వత్రిక ఎన్నికలు చివరి దశకు చేరుకున్నాయి. జూన్1వ తేదీన ఏడో విడత పోలింగ్ జరగనుంది. దీంతో ఎన్నికల ప్రక్రియ పూర్తవుతుంది. జూన్4న ఓట్లు లెక్కిస్తారు. దీంతో కేంద్రంలో అధికారం చేపట్టేదెవరో తేలిపోనుంది. ఫలితాలకు మూడు రోజుల ముందు ఇండియా కూటమి సమావేశానికి కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే పిలుపునిచ్చారు.
మరోసారి అధికారంలోకి వస్తే పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పీఓకే)ని భారత్లో కలుపుతామంటూ కేంద్ర హొంమంత్రి అమిత్ షా ఎన్నికల ప్రచారంలో చేసిన ప్రకటనపై తీవ్ర దుమారం రేగుతోంది. ఎన్నికల ప్రచారంలో ఈ అంశాన్ని లేవనెత్తడం సరికాదని తృణమూల్ కాంగ్రెస్ అంటోంది.
పశ్చిమబెంగాల్ సీఎం మమతాబెనర్జీకి(Mamata Banerjee) వ్యతిరేకంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకుగాను తమ్లూక్ లోక్సభ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి అభిజిత్ గంగోపాధ్యాయ్కి(Abhijit Gangopadhyay) ఎన్నికల సంఘం(EC) శుక్రవారం షోకాజ్ నోటీసులు జారీచేసింది.
ఇండియా కూటమి విషయంలో తృణమూల్ కాంగ్రె్స(టీఎంసీ) అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ స్వరం మారింది. సీట్ల పంపకం అంశంలో కాంగ్రె్సతో వచ్చిన విభేదాల వల్ల ‘ఇండియా’కు దూరంగా ఉన్న ఆమె బుధవారం కూటమికి మద్దతుగా మాట్లాడారు. హుగ్లీ జిల్లాలో బుధవారం నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో మమత మాట్లాడుతూ.. 400 స్థానాల్లో గెలిచి మళ్లీ అధికారం చేపడతామంటూ బీజేపీ చెబుతున్న మాటలను తోసిపుచ్చారు.
రాజకీయ సంచలనం ఒకరు.. రాచరిక విలక్షణ వారసురాలు మరొకరు. ఒకరు అత్యాధునిక వేషభాషలు, నవీన భావాలకు ప్రతినిధి అయితే, మరొకరు జాతీయ సంప్రదాయాలకు, మూల విలువలకు పెట్టింది పేరు. ఇద్దరు మహిళలు ఎన్నికల బరిలో దిగడం మామూలే అయినా, ఈ ఇద్దరి నేపథ్యాల రీత్యా పశ్చిమబెంగాల్ సరిహద్దు జిల్లా నడియాలోని లోక్సభ స్థానం కృష్ణానగర్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
పశ్చిమబెంగాల్లోని అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. పార్టీ రాష్ట్ర విభాగం ప్రధాన కార్యదర్శి పదవి నుంచి కునల్ ఘోష్ను తొలగించింది. పార్టీ వైఖరికి అనుగుణంగా ఘోష్ అభిప్రాయాలు లేనందున ఈ నిర్ణయం తీసుకున్నట్టు టీఎంసీ ఒక అధికారిక ప్రకటనలో తెలిపింది.
భారత ప్రభుత్వ నిర్వహణలోని దూరదర్శన్ చానెల్(Doordarshan) తన లోగో రంగును(Logo) కాషాయం రంగులోకి మార్చడం పెను దుమారాన్ని రేపుతోంది. రంగు మార్పుపై ప్రతిపక్ష పార్టీలు విమర్శలు గుప్పిస్తున్నాయి. డీడీ న్యూస్ మాజీ సీఈవో, టీఎంసీ ఎంపీ జవహర్ సిర్కార్ మాట్లాడుతూ.. డీడీ లోగో కాషాయం రంగులోకి మారడం బాధ కలిగించిందని అన్నారు.
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై ( Mamata Banerjee ) ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రామనవమి వేడుకల సందర్భంగా బెంగాల్ లోని ముర్షిదాబాద్ లో జరిగిన హింసపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
పశ్చిమ బెంగాల్లో మొదటి విడత లోక్సభ ఎన్నికలు ( Lok Sabha Elections 2024 ) జరుగుతున్న తరుణంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. పలు చోట్ల జరుగుతున్న హింసాత్మక ఘటనలతో బెంగాల్ రణరంగాన్ని తలపిస్తోంది.
ముర్షిదాబాద్ ఘటన ముందస్తు ప్రణాళికతో జరిగిందని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ( Mamata Banerjee )మండిపడ్డారు. ఈ ఘటనకు బీజేపీ నేతలే కారణమని ఆరోపించారు. రాయ్గంజ్ లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆమె సంచలన కామెంట్లు చేశారు.