Home » TMC
రానున్న లోక్ సభ ఎన్నికల్లో ప్రతిపక్ష కూటమి ఇండియా (I.N.D.I.A) తరపున ప్రధాన మంత్రి పదవికి రేసులో మొదటి అభ్యర్థి పేరు తెరపైకి వచ్చింది. ఈ పదవి పట్ల తమకు ఆసక్తి లేదని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Mallikharjun Kharge) ప్రకటించిన నేపథ్యంలో టీఎంసీ ఓ ముందడుగు వేసింది. గతంలో జేడీయూ కూడా తమ అధినేతను బరిలో నిలుపుతామని చెప్పింది.
రానున్న లోక్సభ ఎన్నికల్లో ఎన్డీయే ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు ఏకమైన ప్రతిపక్షాలు తమ కూటమికి భారత జాతీయ అభివృద్ధి సమ్మిళిత కూటమి (I.N.D.I.A) అని నామకరణం చేశాయి. అయితే ఈ పేరు పట్ల బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలిసింది.
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమత బెనర్జీ (West Bengal chief minister Mamata Banerjee)తో స్నేహం చేసినప్పటి నుంచి బిహార్ ముఖ్యమంత్రి, జేడీయూ చీఫ్ నితీశ్ కుమార్ (Bihar chief minister Nitish Kumar) చాలా మారిపోయారని బీజేపీ ఆరోపించింది.
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ సమీప బంధువు అభిషేక్ బెనర్జీ కి సుప్రీంకోర్టులో సోమవారం షాక్ తగిలింది. టీచర్స్ రిక్రూట్మెంట్ కుంభకోణంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) దర్యాప్తును ఆపడానికి కలకత్తా హైకోర్టు (Calcutta High Court) తిరస్కరించడాన్ని సర్వోన్నత న్యాయస్థానం సమర్థించింది. హైకోర్టు ఆదేశాలపై ఆయన చేసిన అపీలును తోసిపుచ్చింది.
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ రానున్న రాజ్యసభ ఎన్నికలకు అభ్యర్థులను సోమవారం ప్రకటించింది. జూలై 24న జరిగే ఈ ఎన్నికల్లో డెరెక్ ఒబ్రెయిన్, డోలా సేన్, సుఖేందు శేఖర్ రే, సమీరుల్ ఇస్లామ్, ప్రకాశ్ చిక్ బరైక్, సాకేత్ గోఖలే పోటీ చేస్తారని ఓ ట్వీట్లో తెలిపింది.
పశ్చిమ బెంగాల్ పంచాయతీ ఎన్నికలు హింసాత్మకంగా జరగడంతో సీనియర్ కాంగ్రెస్ నేత దిగ్విజయ సింగ్ (Digvijaya Singh) ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమత బెనర్జీ (Mamata Banerjee)పై తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఇది ప్రజాస్వామ్యానికి శ్రేయస్కరం కాదని స్పష్టం చేశారు. ఈ ఎన్నికలను పరిశీలిస్తే చాలా భయమేస్తోందని చెప్పారు.
పశ్చిమ బెంగాల్ పంచాయతీ ఎన్నికలను రద్దు చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. పోలింగ్ సందర్భంగా శనివారం రాష్ట్రవ్యాప్తంగా విధ్వంసం, హత్యలు, బ్యాలట్ బాక్సుల లూటీ వంటి దారుణాలు జరిగిన నేపథ్యంలో ఈ ఎన్నికలు చెల్లనివని ప్రకటించాలని కలకత్తా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కోరింది. దీనిపై అత్యవసర విచారణ జరపాలని కోరింది.
ఎన్నికలు జరిగే రోజు ప్రజాస్వామ్యానికి అత్యంత పవిత్రమైన రోజు అని, రక్తపాతాన్ని ఆపాలని ప్రజలను, రాజకీయ పార్టీలను పశ్చిమ బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద బోస్ కోరారు. పంచాయతీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా శనివారం రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో తీవ్రమైన హింసాత్మక సంఘటనలు, బ్యాలట్ బాక్సుల లూటీలు, హత్యలు జరుగుతున్న నేపథ్యంలో ఆయన స్పందించారు.
పశ్చిమ బెంగాల్ పంచాయతీ ఎన్నికల పోలింగ్ శనివారం ఉదయం ప్రారంభమైంది. ఈ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైనప్పటి నుంచి హింసాకాండ తీవ్రంగా ఉంది. శుక్రవారం నలుగురు టీఎంసీ కార్యకర్తలు హత్యకు గురయ్యారు. పోలింగ్ ప్రారంభమవడానికి ముందు తమపై దాడులు జరిగాయని కాంగ్రెస్, సీపీఎం ఆరోపిస్తున్నాయి.
పశ్చిమబెంగాల్లో సొంతంగా ఎన్నికల్లో పోటీ చేసి గెలిచే సత్తా తమకు ఉందని, విపక్షాల ఐక్యతా కూటమి అవసరం లేదని తృణమూల్ కాంగ్రెస్ తెగేసి చెప్పింది. బీజేపీ సారథ్యంలోని జాతీయ ప్రజాస్వామ్య కూటమికి వ్యతిరేకంగా విపక్షాల జాతీయ కూటమి ఏర్పాటుకు విపక్ష దిగ్గజనేతలు విస్తృత ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో టీఎంసీ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.