Home » TG Politics
ఆల్మట్టి ప్రాజెక్టు ఎత్తు పెంచకుండా సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేశామని మంత్రి ఉత్తమ్ కుమార్ స్పష్టం చేశారు. సుప్రీంకోర్టులో వాదనల కోసం సీనియర్ న్యాయవాది వైద్యనాథన్ ను నియమించామని తెలిపారు.
బీఆర్ఎస్ టికెట్పై గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ అసెంబ్లీ స్పీకర్ కు బీఆర్ఎస్ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. రోజులు గడుస్తున్నా స్పీకర్ నిర్ణయం తీసుకోవడం లేదంటూ.. బీఆర్ఎస్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అయితే..
పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై కేటీఆర్ అయినా హరీష్ రావు అయినా చర్చకు రావాలని మంత్రి జూపల్లి కృష్ణారావు సవాల్ విసిరారు. 90 శాతం పనులు పూర్తి చేసినట్లు నిరూపిస్తే తన పదవికి రాజీనామా చేస్తానని ధీమా వ్యక్తం చేశారు.
ఆరు గ్యారెంటీల పేరుతో కాంగ్రెస్ చేసిన గారడీని ప్రజలు మర్చిపోలేదని మాజీ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. కాంగ్రెస్ గ్యారెంటీ కార్డులతో చేసిన గారడీలను గుర్తుచేసేందుకు తాము 'బాకీ కార్డులను' తీసుకెళ్తున్నామని తెలిపారు.
ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఇవాళ(సోమవారం) విచారణ జరుపనున్నారు. ఈరోజు విచారణకు నలుగురు ఎమ్మెల్యేలు కాలె యాదయ్య, మహిపాల్రెడ్డి, ప్రకాశ్గౌడ్, బండ్ల కృష్ణమోహన్రెడ్డి హాజరుకానున్నారు.
ఆల్మట్టిని అడ్డుకునే దమ్ముంటే రాహుల్ గాంధీతో చెప్పి కర్ణాటక సీఎంను పిలిపించి ఎత్తును అడ్డుకోవాలని సవాల్ విసిరారు కేటీఆర్. గతంలో ఆర్డినెన్స్పై గట్టిగా హెచ్చరించిన పులి మాజీ సీఎం కేసీఆర్ అని కేటీఆర్ గుర్తు చేశారు.
ఫోర్త్ సిటీ కాదు.. ఉన్న సిటీని సీఎం రేవంత్రెడ్డి ఎందుకు పట్టించుకోవడం లేదని మాజీ మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. వరదలతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే సీఎం రేవంత్రెడ్డి ఎందుకు పట్టించుకోవడం లేదని ఫైర్ అయ్యారు. మెట్రోను రద్దు చేసి.. రేవంత్రెడ్డి ఫోర్త్ సిటీకి మెట్రో అంటున్నారని విమర్శించారు.
ఓటు చోరీపై ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ సంధించిన ప్రశ్నలకు మోదీ ప్రభుత్వం జవాబు చెప్పాలని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యంలో పవర్ ఆఫ్ ఓటుకి దెబ్బ తగులుతోందని చెప్పుకొచ్చారు. దేశంలో 80 శాతం మంది ప్రజలు ఓటు చోరీ జరిగిందని నమ్ముతున్నారని మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు.
రేవంత్రెడ్డి ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు హెచ్చరించారు. రేవంత్, మల్లు భట్టి విక్రమార్క బాండు పేపర్పై సంతకాలు పెట్టి ఎన్నికల హామీలిచ్చారని.. కానీ ఎన్నికల హామీలపై ఇప్పడెందుకు మౌనంగా ఉంటున్నారని ప్రశ్నల వర్షం కురిపించారు.
నేడు ఒకేసారి రాష్ట్రవ్యాప్తంగా 50 ఏటీసీలను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారు. ఏటీసీ ఇవాళ్టీ(శనివారం) నుంచి అమలులోకి రానుంది. మధ్యాహ్నం 3 గంటలకు శిల్పారామంలో టూరిజం కార్నివాల్లో సీఎం పాల్గొననున్నారు.