• Home » TG News

TG News

Sub Registrar Sivashankar: వనస్థలిపురం సబ్ రిజిస్ట్రార్ సస్పెన్షన్.. ఎందుకంటే..

Sub Registrar Sivashankar: వనస్థలిపురం సబ్ రిజిస్ట్రార్ సస్పెన్షన్.. ఎందుకంటే..

వనస్థలిపురం సబ్ రిజిస్ట్రార్‌ శివశంకర్‌ అక్రమాలకు పాల్పడుతున్నారని ఫిర్యాదులు అందడంతో స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ అదికారులు విచారణ చేపట్టారు. ఈ విచారణలో శివశంకర్‌‌ అవినీతికి పాల్పడుతున్నారని గుర్తించారు. ఈ క్రమంలోనే ఆయనపై సస్పెన్షన్ వేటు వేశారు.

Janasena: జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు జనసేన పార్టీ సిద్ధం..

Janasena: జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు జనసేన పార్టీ సిద్ధం..

త్వరలో జరగబోయే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయాలని నిర్ణయించినట్లు ఆపార్టీ నేతలు తెలిపారు. ఈమేరకు ఆపార్టీ హైదరాబాద్‌ అధ్యక్షుడు రాజలింగం ఈ విషయాన్ని ప్రకటించారు. పార్టీని హైదరాబాద్ లో బలోపేతం చేయడమేగాక త్వరలో జరిగే ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు.

IT Raids: భాగ్యనగరంలో ఐటీ అధికారుల సోదాలు.. కీలక ఫైళ్లు స్వాధీనం

IT Raids: భాగ్యనగరంలో ఐటీ అధికారుల సోదాలు.. కీలక ఫైళ్లు స్వాధీనం

భాగ్యనగరంలో రెండో రోజు ఐటీ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. పిస్తా హౌస్, షాగౌస్, మైఫిల్‌లో తనిఖీలు కొనసాగుతున్నాయి. సోదాలు జరిపి కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు అధికారులు.

CP Sudheer Babu: ఊపిరి ఆగకూడదంటే సిగరెట్లు ఆపాలి..

CP Sudheer Babu: ఊపిరి ఆగకూడదంటే సిగరెట్లు ఆపాలి..

ఊపిరి ఆగకుండా ఉండాలంటే పొగతాగడం ఆపాల్సిందేనని రాచకొండ సీపీ సుధీర్‌బాబు అన్నారు. అంతర్జాతీయ సీఓపీడీ డే సందర్భంగా ఎల్‌బీనగర్‌ కామినేని ఆస్పత్రిలో మంగళవారం ఏర్పాటు చేసిన అవగాహనా కార్యక్రమంలో సీనియర్‌ కన్సల్టెంట్‌ పల్మనాలజిస్ట్‌ డాక్టర్‌ రవీందర్‌ రెడ్డితో కలిసి సీఓపీడీ అవగాహన పోస్టర్‌ను ఆవిష్కరించారు.

Bandaru Dattatreya: ఒకే కుటుంబంలో 18మంది మృతి బాధాకరం..

Bandaru Dattatreya: ఒకే కుటుంబంలో 18మంది మృతి బాధాకరం..

సౌదీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విద్యానగర్‌లోని నసీరుద్దీన్‌ కుటుంబ సభ్యులను మాజీ గవర్నర్‌ బండారు దత్తాత్రేయ, మాజీ హోంశాఖ మంత్రి మహమూద్‌ ఆలీ తదితరులు పరామర్శించారు.

Hyderabad: ఫోన్‌ హ్యాక్‌ చేసి.. ఖాతా ఖాళీ

Hyderabad: ఫోన్‌ హ్యాక్‌ చేసి.. ఖాతా ఖాళీ

రోజురోజుకూ సైబర్‌ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. మోసపూరితమైన ఏపీకే ఫైల్‌ లింకులు పంపి.. అమాయకుల ఫోన్లను హ్యాక్‌ చేస్తూ వారి ఖాతాలను ఖాళీ చేస్తున్నారు. నగరానికి చెందిన ఐదుగురు ఖాతాల నుంచి రూ.16.31 లక్షలు కాజేశారు.

National  Awards: తెలంగాణకు మరోసారి జాతీయ స్థాయిలో అవార్డుల పంట

National Awards: తెలంగాణకు మరోసారి జాతీయ స్థాయిలో అవార్డుల పంట

ఆరో జాతీయ జల అవార్డుల్లో తెలంగాణ రాష్ట్రానికి అవార్డుల పంట పండింది. జల్‌ సంచయ్‌ జన్‌ భాగీదారీ విభాగంలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచింది. ఈ క్రమంలో తెలంగాణ అధికారులకు పురస్కారాలు ప్రదానం చేశారు భారతదేశ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.

KTR: పత్తి రైతుల సమస్యలు పరిష్కరించరా.. రేవంత్ ప్రభుత్వంపై కేటీఆర్ ఫైర్

KTR: పత్తి రైతుల సమస్యలు పరిష్కరించరా.. రేవంత్ ప్రభుత్వంపై కేటీఆర్ ఫైర్

వ్యవసాయ మంత్రికి రైతన్నలపై ప్రేమ ఉంటే నిన్న(సోమవారం) జరిగిన తెలంగాణ కేబినెట్ సమావేశంలో స్పష్టమైన హామీ ఎందుకు ఇవ్వలేదని మాజీ మంత్రి కేటీఆర్ ప్రశ్నల వర్షం కురిపించారు. దమ్ముంటే పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ. 20వేలు ప్రకటించాలని సవాల్ చేశారు కేటీఆర్.

CM Revanth Reddy: తెలంగాణను 3 ట్రిలియన్ ఎకానమీగా మార్చడమే నా లక్ష్యం: సీఎం రేవంత్‌రెడ్డి

CM Revanth Reddy: తెలంగాణను 3 ట్రిలియన్ ఎకానమీగా మార్చడమే నా లక్ష్యం: సీఎం రేవంత్‌రెడ్డి

హైదరాబాద్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం సహకరించాలని సీఎం రేవంత్‌‌రెడ్డి కోరారు. మెట్రో విస్తరణ, రీజనల్ రింగ్, గోదావరి జలాల తరలింపు, మూసీ ప్రక్షాళనతో పాటు వివిధ అభివృద్ధి పనులకు కేంద్ర ప్రభుత్వం సాయం అందించాలని సూచించారు.

Hyderabad: తీరని విషాదం...‘ఉమ్రా’ ఘటనతో ఉలిక్కిపడిన హైదరాబాద్‌

Hyderabad: తీరని విషాదం...‘ఉమ్రా’ ఘటనతో ఉలిక్కిపడిన హైదరాబాద్‌

ఉమ్రాయాత్ర ప్రమాదం నగరాన్ని తీవ్ర విషాదంలో ముంచెత్తింది. సోమవారం తెల్లారేసరికి ప్రమాద వార్త విని నగరవాసులు ఉలిక్కిపడ్డారు. యాత్రికులు ప్రయాణిస్తున్న బస్సును డీజిల్‌ ట్యాంకర్‌ ఢీకొట్టిన ఘటనలో నగరానికి చెందిన 45 మంది మరణించడంతో సిటీ జనులు దిగ్బ్రాంతి కి గురయ్యారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి