Home » Telangana Politics
Telangana: ‘‘చలో మేడిగడ్డ’’ బయలుదేరిన బీఆర్ఎస్ కాన్వాయ్లోని ఓ బస్సు టైర్ పగడంతో చిన్న అపశృతి చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనపై మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. ‘‘బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వెళ్తున్న బస్సు టైర్ పగిలింది అని చూశా. కారు టైర్లు అన్నీ మిగిలిపోయాయి. ఇక షెడ్డుకు పోవాల్సిందే’’ అంటూ మంత్రి సెటైరికల్ కామెంట్స్ చేశారు.
Telangana: కాంగ్రెస్ ప్రభుత్వంలో చెప్పిందే చేస్తాం.. చేయగలిగేదే చెప్తామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ముదిగొండ మండల సీతారాంపురం సభలో డిప్యూటీ సీఎం మాట్లాడుతూ... తనను ఈ స్థాయిలో ఉంచింది మధిర నియోజకవర్గ ప్రజలే అని.. సీతారపురం గ్రామస్థులు చల్లగా ఉండాలన్నారు. అభివృద్ధి పనుల్లో నాణ్యత పాటించాలని.. పనుల విషయంలో అధికారులు పర్యవేక్షణ తప్పని సరి అని అన్నారు.
Telangana: దొంగే దొంగ అన్నట్లు బీఆర్ఎస్ వైఖరి ఉందని టీజేఎస్ చీఫ్ కోదండరాం వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.... మూడు పిల్లర్లు కుంగిపోయిన మేడిగడ్డ పటిష్టంగా ఉందని చెప్పడం శుద్ద తప్పన్నారుు. ప్రణాళిక, నాణ్యత, నిర్వహణ, డిజైన్ లోపం వల్లే పిల్లర్లు కుంగిపోయాయన్నారు. మూడు పిల్లర్లే కదా కుంగిపోయిందని బీఆర్ఎస్ వితండవాదం చేస్తోందన్నారు.
Telangana: ‘‘చలో మేడిగడ్డ’’ పర్యటనలో భాగంగా కాళేశ్వరం బయలుదేరిన బీఆర్ఎస్ నేతల కాన్వాయ్కు పెను ప్రమాదం తప్పింది. జనగామ మండలం నెల్లుట్ల సమీపంలో బీఆర్ఎస్ నేతల కాన్వాయ్లో ఓ బస్సు టైర్ పేలింది. దీంతో బస్సును పక్కకు నిలిపివేశారు. ఆపై బస్సులోని బీఆర్ఎస్ నేతలంతా కార్లలో బయలుదేరారు. బస్సులో ఆందోల్ మాజీ ఎమ్మెల్యే కాంతికిరణ్ సహా పలువురు నేతలు ఉన్నారు.
Telangana: బాధ్యత మరచి ప్రభుత్వం రాజకీయాలు చేస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శలు గుప్పించారు. మేడిగడ్డకు బయలుదేరే ముందు తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతూ.. ‘‘వాస్తవాలు చెప్పడానికే మా ఈ చలో మెడిగడ్డ’’ పర్యటన అని స్పష్టం చేశారు. రైతు ప్రయోజనం ముఖ్యం కాదని... రాజకీయ ప్రయోజనం కాంగ్రెస్ పార్టీకి కావాలన్నారు.
హైదరాబాద్: లోక్సభ ఎన్నికలు (Loksabha Election) సమీపిస్తున్న వేళ తెలంగాణలో అధికార కాంగ్రెస్ (Congress), విపక్ష బీఆర్ఎస్ పార్టీల (BRS Party) మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఇరుపార్టీల నేతలు పరస్పర విమర్శల దాడులకు దిగుతున్నారు. తాజా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి (CM Revanth Reddy) బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ (KTR) సవాల్ విసిరారు. ‘‘నువ్వు కొడంగల్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చెయ్. నేను సిరిసిల్ల ఎమ్మెల్యేగా రాజీనామా చేస్తా. ఇద్దరం మల్కాజ్గిరి ఎంపీ స్థానానికి పోటీ చేద్దాం’’ అన్నారు.
Telangana: కాళేశ్వరంపై వచ్చిన విమర్శలకు సమాధానంగా బీఆర్ఎస్ చేపట్టిన మేడిగడ్డ పర్యటనకు కౌంటర్గా కాంగ్రెస్ మరో పర్యటనకు సిద్ధమైంది. పాలమూరు - రంగారెడ్డి పర్యటనకు కాంగ్రెస్ పిలుపునిచ్చింది. రేపు (శుక్రవారం) పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పర్యటనకు ఉమ్మడి రంగారెడ్డి, ఉమ్మడి మహాబూబ్ నగర్ జిల్లా కాంగ్రెస్ నేతలు పిలుపునిచ్చారు.
లోక్సభ ఎన్నికలు (Lok Sabha Elections) సమీపిస్తున్న తరుణంలో.. తెలంగాణలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. అధికార కాంగ్రెస్ (Congress), ప్రతిపక్ష బీఆర్ఎస్ (BRS) నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ (Balka Suman) సీఎం రేవంత్ రెడ్డిపై (CM Revanth Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు.
Telangana: పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తెలంగాణలో రాజకీయం(Telangana Politics) మరింత రసవత్తరంగా మారుతోంది. ముఖ్యంగా.. కాంగ్రెస్, బీజేపీ నేతల మధ్య మాటలు తూటాల్లా పేలుతున్నాయి. ఎంపీ బండి సంజయ్(MP Bandi Sanjay) చేపట్టిన ప్రజాహిత పాదయాత్ర హుస్నాబాద్లో(Busnabad) తీవ్ర ఉద్రిక్తతకు దారి తీస్తోంది.
Telangana: జగిత్యాల మున్సిపల్ చైర్మన్(Jagtial Municipality) ఎన్నికలో బీఆర్ఎస్(BRS) ఎమ్మెల్యే సంజయ్ కుమార్కు(MLA Sanjay Kumar) బిగ్ షాక్ ఇచ్చారు ఆ పార్టీ కౌన్సిలర్లు. సంజయ్ ఆదేశాలను ధిక్కరించి మరీ వేరే వాళ్లకు జైకొట్టారు బీఆర్ఎస్ కౌన్సిలర్లు. బీఆర్ఎస్ ప్రతిపాదించిన వాణికి కాకుండా.. జ్యోతికి మద్దతు తెలిపారు కౌన్సిలర్లు. కాంగ్రెస్ కౌన్సిలర్లు(Congress) సైతం జ్యోతికే సపోర్ట్ చేశారు.