Home » Telangana Politics
Lok Sabha Elections 2024: ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో 370 సీట్లు లక్ష్యంగా పక్కా వ్యూహంతో ముందుకెళ్తోంది బీజేపీ(BJP). ఏ ఒక్క రాష్ట్రాన్ని నిర్లక్ష్యం చేయకుండా.. అందివచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే పనిలో ఉంది పార్టీ అధిష్టానం. తాజాగా దక్షిది రాష్ట్రాలకు గేట్వేగా భావిస్తున్న తెలంగాణ(Telangana)పై స్పెషల్ ఫోకస్ పెట్టింది కమలదళం. రాష్ట్రంలో అత్యధిక స్థానాలు గెలుపొందే లక్ష్యంతో పావులు కదుపుతోంది. ఇందులో భాగంగా ఆపరేషన్ ఆకర్ష్కి తెరలేపింది.
Hyderabad News: తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్తో(KCR) ఆ పార్టీ నేత, మాజీ మంత్రి మల్లారెడ్డి(Malla Reddy) భేటీ అయ్యారు. వీరి భేటీలో కీలక అంశాలపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది. పార్టీ మార్పు అంశం, మల్కాజిగిరి(Malkajgiri) టికెట్ కేటాయింపు, రాజశేఖర్ రెడ్డి కాలేజీ భవనాల కూల్చివేత సహా పలు అంశాలపై చర్చ జరిగినట్లు సమాచారం.
Telangana Politics: తెలంగాణ రాజకీయాల్లో (Telangana Politics) ఊహించని పరిణామం చోటుచేసుకోనుందా..? అతి త్వరలోనే మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి (Malla Reddy) ‘కారు’ దిగి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారా..? తన కుమారుడిని మల్కాజిగిరి నుంచి కాంగ్రెస్ తరఫున పోటీచేయించడానికి ప్రయత్నాలు చేస్తున్నారా..? అంటే తాజా పరిస్థితులను బట్టి చూస్తే ఇవన్నీ అక్షరాలా నిజమే అనిపిస్తోంది..
Congress Praja Deevena Sabha: పాలమూరు వేదికగా పార్లమెంట్ ఎన్నికల శంఖారావం పూరించారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy). కాంగ్రెస్(Congress) అభ్యర్థులను గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్సీ అభ్యర్థిగా జీవన్రెడ్డిని గెలిపించండని కోరారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్..
Congress Praja Deevena Sabha: పాలమూరు గడ్డ మీద నుంచి పార్లమెంట్ ఎన్నికలకు శంఖారావం పూరించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy). బుధవారం నాడు కాంగ్రెస్(Congress) ఆధ్వర్యంలో పాలమూరులో ప్రజాదీవెన సభ చేపట్టింది. ఈ సభా వేదికగా ఎన్నికల ప్రచారం ప్రారంభించారు సీఎం రేవంత్ రెడ్డి. కాగా, కాంగ్రస్ ప్రభుత్వం ఏర్పాటైన తరువాత జిల్లాలో..
Telangana Politics: తెలంగాణలో అధికారం కోల్పోయిన బీఆర్ఎస్(BRS) పార్టీకి వరుస షాక్లు తగులుతున్నాయి. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు బీఆర్ఎస్ను వీడగా.. ఇప్పుడు మరో కీలక నేత పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారు. సిర్పూరు మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప(Koneru Konappa) పార్టీకి రాజీనామా చేసేందుకు సిద్ధమయ్యారు. గత ఎన్నికల్లో కోనప్పపై బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్(RS Praveen Kumar) పోటీ చేశారు.
Telangana: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) బుధవారం నాడు ‘రైతు నేస్తం’(Rythu Nestham) కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క(Mallu Bhatti Vikramarka), వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు(Thummala Nageswara Rao) పాల్గొన్నారు. రైతు వేదికలకు వీడియో కాన్ఫరెన్స్ అనుసంధానం ద్వారా రైతుల సమస్యలను పరిష్కరించే వినూత్న కార్యక్రమమే ‘రైతు నేస్తం’.
Telangana: కేసీఆర్ ప్రభుత్వానికి.. కాంగ్రెస్ ప్రభుత్వానికి నక్కకు, నాగ లోకానికి ఉన్నంత తేడా ఉందని మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి వ్యాఖ్యలు చేశారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. పార్లమెంట్ ఎన్నికల తర్వాత హరీష్రావు కూడా ఉండడం డౌటే అని ... బీజేపీలోకి పోతారంటూ సంచలన కామెంట్స్ చేశారు. బీజేపీతో సంప్రదింపులు చేస్తున్నారని తెలుస్తోందన్నారు.
BRS - BSP Alliance: పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణలో(Telangana) కొత్త పొత్తులు పొడుస్తున్నాయి. తాజాగా బీఆర్ఎస్(BRS), బీఎస్పీ(BSP) మధ్య పొత్తు ఖరారైంది. బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్(RS Praveen Kumar).. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్(KCR)తో భేటీ అయ్యారు. ఈ ఇద్దరు నేతలు పొత్తు విషయమై జరిపిన చర్చలు సఫలమయ్యాయి. ఈ సందర్భంగా కేసీఆర్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇద్దరూ మాట్లాడారు. లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్, బీఎస్పీ కలిసి పని చేయాలని నిర్ణయం తీసుకున్నాయని కేసీఆర్ ప్రకటించారు.
పార్లమెంట్ ఎన్నికలకు ముహుర్తం దగ్గరపడుతున్న వేళ తెలంగాణలో కీలక పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మర్యాపూర్వకంగా కలిశారు. హైదరాబాద్లోని నంది నగర్లో గల కేసీఆర్ నివాసంలో ఇద్దరు నేతలు భేటీ అయ్యారు.