Home » Telangana Assembly
కాళేశ్వరం కమిషన్ నివేదికపై తెలంగాణ అసెంబ్లీలో చర్చ మెుదలైంది. నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి చర్చను ప్రారంభించారు. ఈ సందర్భంగా కాలేశ్వరం ప్రాజెక్టు పిల్లర్ల కుంగుబాటు, లోపాటులపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికపై లఘుచర్చ జరుగుతోంది.
తెలంగాణ అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్ల బిల్లుపై సుదీర్ఘ చర్చల అనంతరం.. బీసీ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం పలికింది. అన్ని పార్టీలు బీసీ బిల్లుకు మద్దతు ప్రకటించాయి. దీంతో రాష్ట్రంలో 42 శాతం బీసీ రిజర్వేషన్ల బిల్లు త్వరలో కార్యరూపం దాల్చనుంది.
బీసీలకు న్యాయం జరగాలంటే రాజ్యాంగ సవరణ జరగాలని కేటీఆర్ తెలిపారు. చట్టసభల్లోనూ రిజర్వేషన్లు ఇవ్వాలని తీర్మానం చేశామన్నారు. బీసీ సబ్ ప్లాన్ కూడా పెట్టాలని ఆయన సూచించారు. బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ రోజుకో మాట మాట్లాడుతోందని విమర్శించారు.
అసెంబ్లీలో కాళేశ్వరంపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. బీసీ రిజర్వేషన్లకు సంబంధించి పంచాయతీరాజ్ యాక్ట్ 285Aను సవరణ బిల్లు, మున్సిపల్ చట్ట సవరణ బిల్లును ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది.
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్ కల్పించేందుకు వీలుగా పంచాయతీరాజ్, మునిసిపల్ చట్టాల సవరణ బిల్లులతోపాటు కాళేశ్వరంపై పీసీ ఘోష్ కమిషన్ను నివేదికను ఒకే సారి అసెంబ్లీలో ప్రవేశపెట్టాలని శాసనసభ బీఏసీ సమావేశంలో నిర్ణయించారు.
Telangana Assembly Sessions 2025 Live Updates in Telugu: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాల్లో కాళేశ్వరం ప్రాజెక్టుపై కమిషన్ ఇచ్చిన నివేదిక సహా పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. అసెంబ్లీ సమావేశాల లైవ్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందిస్తోంది ఆంధ్రజ్యోతి.
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతికి సంతాపం తెలుపుతూ సీఎం రేవంత్ రెడ్డి తీర్మానం ప్రవేశపెట్టారు. చూడటానికి క్లాస్గా కనిపించే ఆయన మాస్ లీడర్ అని.. నాకు మంచి మిత్రుడని గుర్తుచేసుకున్నారు.
ప్రధాన ప్రతిపక్ష నేత, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఈసారి కూడా అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉండనున్నట్లు తెలుస్తోంది. కాళేశ్వరం కమిషన్ నివేదిక ప్రకారం..
రాష్ట్ర అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు శనివారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఉదయం 10.30 గంటలకు సమావేశాలు ప్రారంభమవగానే.. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతికి సంతాప ప్రతిపాదన చేస్తారు.
బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్రావుతో మాజీమంత్రులు కేటీఆర్, హరీష్రావుతో సహా ఆ పార్టీ సీనియర్ నేతలు శుక్రవారం ఎర్రవల్లి ఫాం హౌస్లో సమావేశం కానున్నారు. కేసీఆర్తో భేటీలో పలు కీలక అంశాలపై గులాబీ నేతలు చర్చించనున్నారు.