• Home » TDP-Janasena- BJP

TDP-Janasena- BJP

Praja Galam: ‘ప్రజాగ‌ళం’ స‌భ‌కు స‌ర్వం సిద్ధం.. వేదిక‌పై ఉండేది ఎవ‌రెవ‌రంటే..?

Praja Galam: ‘ప్రజాగ‌ళం’ స‌భ‌కు స‌ర్వం సిద్ధం.. వేదిక‌పై ఉండేది ఎవ‌రెవ‌రంటే..?

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయాల్లో స‌రికొత్త చ‌రిత్ర సృష్టించేందుకు ముగ్గురు నేత‌లు ఒకే వేదిక‌పైకి రానున్నారు. వైసీపీ అరాచ‌క పాల‌న‌ను అంతం చేయ‌డ‌మే ల‌క్ష్యంగా రానున్న ఎన్నిక‌ల్లో టీడీపీ (TDP), జ‌న‌సేన‌ (Janasena), బీజేపీ (BJP) కూట‌మిగా పోటీచేస్తున్నాయి. రాష్ట్ర అభివృద్ధి కోసం కంక‌ణ‌బ‌ద్ధుల‌య్యేందుకు మూడు పార్టీలు ఏక‌మ‌య్యాయి. పొత్తు కుదిరిన త‌ర్వాత మూడు పార్టీల తొలి ఉమ్మ‌డి స‌భ‌కు వేదికైంది ప‌ల్నాడు జిల్లాలోని చిల‌క‌లూరిపేట‌.

AP Politics: బాబోయ్.. ఎంపీగా పోటీపై మళ్లీ ట్విస్ట్ ఇచ్చిన పవన్‌!

AP Politics: బాబోయ్.. ఎంపీగా పోటీపై మళ్లీ ట్విస్ట్ ఇచ్చిన పవన్‌!

AP Elections 2024: జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ఎమ్మెల్యేతో పాటు ఎంపీగా కూడా పోటీ చేస్తారా..? అది కూడా కాకినాడ (Kakinada) పార్లమెంట్ స్థానమేనా..? సేనాని హస్తిన పర్యటన తర్వాత అటు జనసైనికుల్లో.. ఇటు టీడీపీ శ్రేణుల్లో వచ్చిన మొట్ట మొదటి ప్రశ్న ఇదే..

TDP: కీలక నేతలతో గంటా శ్రీనివాస్ మీటింగ్.. భవిష్యత్ కార్యాచరణపై చర్చ

TDP: కీలక నేతలతో గంటా శ్రీనివాస్ మీటింగ్.. భవిష్యత్ కార్యాచరణపై చర్చ

Ganta Srinivasa Rao Meeting: టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు (Ganta Srinivasa Rao) ఎక్కడ్నుంచి పోటీచేస్తారనే దానిపై ఇంతవరకూ క్లారిటీ రాలేదు. మొదటి జాబితాలో పేరు లేకపోవడం.. ఇవాళ రిలీజ్ చేసిన సెకండ్ లిస్ట్‌లోనూ లేకపోవడంతో అసలు గంటా ఎక్కడ్నుంచి పోటీచేస్తారు..? పోటీ చేస్తారా.. లేదా..? హైకమాండ్ ఏం చెబుతోంది.. ఈయనేం ఆశిస్తున్నారు..? టీడీపీ (TDP) పెద్దలు గంటాకు ఏం చెప్పారు..?

Janasena: జనసైనికులకు నాగబాబు కీలక సూచన.. ఇక షురూ..

Janasena: జనసైనికులకు నాగబాబు కీలక సూచన.. ఇక షురూ..

AP Elections 2024: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో టీడీపీ-జనసేన-బీజేపీ (TDP-Janasena-BJP) గెలుపు కోసం గట్టి ప్రయత్నాలే చేస్తున్నాయి. రెండోసారి అధికారం రావాల్సిందేనని వైఎస్ జగన్ రెడ్డి (YS Jagan Reddy) విశ్వప్రయత్నాలు చేస్తుంటే.. ఇటు కూటమి మాత్రం వైసీపీని ఇంటికి పంపించాల్సిందేనని వ్యూహ రచన చేస్తోంది. శనివారం నాడే ఎన్డీఏ (NDA) కూటమిలో టీడీపీ, జనసేన చేరినట్లు అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది..

TDP: అభ్యర్థుల రెండో జాబితా ఎప్పుడో చెప్పేసిన చంద్రబాబు.. ఈ పేర్లు ఉంటాయా..?

TDP: అభ్యర్థుల రెండో జాబితా ఎప్పుడో చెప్పేసిన చంద్రబాబు.. ఈ పేర్లు ఉంటాయా..?

TDP-JSP Second List: టీడీపీ-జనసేన (TDP-Janasena) తొలి అభ్యర్థుల జాబితా రిలీజ్ చేసిన తర్వాత ఏపీ రాజకీయాల్లో జరిగిన పరిణామాలను ప్రత్యక్షంగా చూస్తు్న్నాం. ఒక్కసారిగా పొలిటికల్ సీన్ మారిపోవడంతో పాటు.. ఈ జాబితా దెబ్బకు వైసీపీ అధిష్టానంలో వణుకు మొదలైంది. టీడీపీ, జనసేన తరఫున టికెట్లు ఆశించిన ఆశావహులు.. కొందరు సిట్టింగ్ తెలుగు తమ్ముళ్లు కాసింత నిరాశకు లోనయ్యారు. దీంతో వారందరికీ రెండో జాబితాలో (TDP-JSP Second List) న్యాయం చేస్తారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి...

AP Elections: ఎన్డీఏలో చేరిన టీడీపీ, జనసేన.. జేపీ నడ్డా అధికారిక ప్రకటన

AP Elections: ఎన్డీఏలో చేరిన టీడీపీ, జనసేన.. జేపీ నడ్డా అధికారిక ప్రకటన

TDP Joins In NDA: తెలుగుదేశం పార్టీతో (Telugu Desam) పొత్తుపై బీజేపీ కీలక ప్రకటన చేసింది. మూడ్రోజుల పాటు ఢిల్లీ వేదికగా బీజేపీ అగ్రనేతలతో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ సుదీర్ఘ చర్చలు జరిపిన సంగతి తెలిసిందే. చర్చల అనంతరం పొత్తుపై బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా ఓ లెటర్ రూపంలో అధికారిక ప్రకటన చేశారు. ఎన్డీఏలో చేరాలని చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లు తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని తెలిపారు.

AP Politics: టీడీపీ-జనసేన భారీ బహిరంగ సభ.. కీలక ప్రకటన చేయనున్న మోదీ

AP Politics: టీడీపీ-జనసేన భారీ బహిరంగ సభ.. కీలక ప్రకటన చేయనున్న మోదీ

TDP-Janasena-BJP : ఆంధ్రప్రదేశ్‌లో 2024 సార్వత్రిక ఎన్నికల (AP Elections 2024) నోటిఫికేషన్‌కు ముందే పొలిటికల్ సీన్ మొత్తం మారిపోయింది. టీడీపీ-జనసేన-బీజేపీ (TDP-Janasena-BJP) పొత్తుతో ఒక్కసారిగా అధికార వైసీపీలో ఉలిక్కిపాటు మొదలైంది. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ల ఢిల్లీ టూర్‌తో బీజేపీతో పొత్తు కుదిరింది. ఢిల్లీ వేదికగా బీజేపీ అగ్రనేతలు అమిత్ షా, జేపీ నడ్డాలతో బాబు, పవన్ జరిపిన చర్చలు సక్సెస్ అయ్యాయి..

Big Breaking: బీజేపీతో పొత్తుపై చంద్రబాబు కీలక ప్రకటన.. ఎన్ని సీట్లు ఇచ్చారంటే..?

Big Breaking: బీజేపీతో పొత్తుపై చంద్రబాబు కీలక ప్రకటన.. ఎన్ని సీట్లు ఇచ్చారంటే..?

AP Elections 2024: అవును.. అనుకున్నట్లే ఎన్డీఏలోకి టీడీపీ చేరిపోయింది. దేశ రాజధాని ఢిల్లీ వేదికగా మూడ్రోజులు పాటు బీజేపీ అగ్రనేతలు అమిత్ షా, జేపీ నడ్డాలతో చంద్రబాబు, పవన్ కల్యాణ్ జరిపిన కీలక చర్చలు సక్సెస్ అయ్యాయి. ఢిల్లీ పర్యటన తర్వాత బీజేపీతో పొత్తుపై చంద్రబాబు కీలక ప్రకటనే చేశారు. పర్యటన అనంతరం టీడీపీ ముఖ్యనేతలతో చంద్రబాబు టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఢిల్లీ వేదికగా ఏం జరిగింది..? బీజేపీకి ఎన్ని సీట్లు ఇస్తున్నామనే విషయాలపై చర్చించడం జరిగింది.

AP Elections: టీడీపీ-జనసేన.. బీజేపీ పొత్తుపై కీలక అప్డేట్.. ఏబీఎన్ ఎక్స్‌క్లూజివ్

AP Elections: టీడీపీ-జనసేన.. బీజేపీ పొత్తుపై కీలక అప్డేట్.. ఏబీఎన్ ఎక్స్‌క్లూజివ్

Andhra Pradesh Elections 2024: ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో (AP Politics) కీలక పరిణామమే చోటుచేసుకుంది. టీడీపీ-జనసేన (TDP-Janasena) కూటమిలో బీజేపీ (BJP) వచ్చి చేరింది. దేశ రాజధాని ఢిల్లీ వేదికగా మూడ్రోజులుగా బీజేపీ అగ్రనేతలు అమిత్ షా, జేపీ నడ్డాతో.. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ జరిపిన చర్చలు సఫలమయ్యాయి...

తాజా వార్తలు

మరిన్ని చదవండి