Home » Tamil Nadu
తమిళనాడు సీఎంగా టీవీకే విజయ్ ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం ఆయన సభను ఉద్దేశించి ప్రసంగిస్తూ.. ఇది ప్రజా ప్రభుత్వమని, రాష్ట్రంలో డ్రగ్స్పై ఈ రోజు నుంచే పోరాటం ప్రారంభమైందన్నారు.
తమిళనాడులో కొత్త ప్రభుత్వం కొలువుతీరింది. సీఎంగా విజయ్, మంత్రులుగా పలువురు ఎమ్మెల్యేలు ప్రమాణస్వీకారం చేశారు.
తమిళనాడు ముఖ్యమంత్రిగా తమిళగ వెట్రి కళగం అధినేత జోసెఫ్ విజయ్ ప్రమాణ స్వీకారం చేశారు. విజయ్తో సీఎంగా గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ ప్రమాణ స్వీకారం చేయించారు. చెన్నైలోని నెహ్రూ ఇండోర్ స్టేడియం వేదికగా ఈ కార్యక్రమం జరిగింది.
తమిళనాడులో టీవీకే చీఫ్ విజయ్ ప్రమాణస్వీకారానికి సర్వం సిద్ధమైంది. విజయ్తో పాటూ మొత్తం 9 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
టీవీకే మంత్రివర్గంలో కాంగ్రెస్కు పెద్దపీట వేయనున్నట్టు తెలుస్తోంది. ఆ పార్టీకి చెందిన ఐదుగురిలో ముగ్గురికి మంత్రి పదవులు ఇవ్వనున్నట్టు సమాచారం. మంత్రివర్గంలో సెంగోట్టియన్, ఆధవ్ అర్జున, ఆనంద్, అరుణ్ రాజ్, నిర్మల్ కుమార్, రాజ్మోహన్లకు చోటు కల్పించనున్నారు.
తమిళనాడులో విజయ్ సారథ్యంలోని టీవీకే ప్రభుత్వం ఈనెల 10న కొలువు తీరనుంది. ప్రభుత్వం ఏర్పాటుకు గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ అనుమతించారు. దీంతో ఆదివారం ఉదయం 10.00 గంటలకు విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.
తమిళనాడు రాజకీయాల్లో శనివారం సాయంత్రం వరుస ట్విస్ట్లు చోటుచేసుకున్నాయి. ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన సంఖ్యాబలంతో గవర్నర్ కార్యాలయానికి బయలు దేరిన టీవీకే చీఫ్ విజయ్కు చుక్కెదురైంది. తొలుత గవర్నర్ అపాయింట్మెంట్ ఖరారు కాలేదు. అయితే కొద్ది సేపటికే గవర్నర్ తన పర్యటనను కేన్సిల్ చేసుకుని అపాయింట్మెంట్ ఇచ్చారు.
విజయ్ టీవీకే ఎట్టకేలకు ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన మెజారిటీ మార్క్ సాధించింది. టీవీకేకు బేషరతుగా తమ మద్దతును వీసీకే అధ్యక్షుడు తొల్ తురుమావళవన్ అధికారికంగా ప్రకటించారు. మద్దతు లేఖను స్వయంగా టీవీకేకు అందజేశారు.
ప్రభుత్వం ఏర్పాటు విషయంలో తమిళనాడులో కొనసాగుతున్న ప్రతిష్టంభనను 'కృత్రిమ సంక్షోభం'గా సీనియర్ అడ్వకేట్, భారత మాజీ అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గి అభివర్ణించారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా టీవీకే చీఫ్ విజయ్ను గవర్నర్ ఆహ్వానించి ఉండాల్సిందని అన్నారు.
తమిళనాడులో టీవీకే ప్రభుత్వ ఏర్పాటు విషయంలో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. ప్రభుత్వ ఏర్పాటు విషయంలో గవర్నర్ అనుమతి శుక్రవారం పొద్దుపోయిన తర్వాత కూడా రాకపోవడంతో సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. అయితే దీనికి ముందు గవర్నర్ అనుమతి ఇచ్చేశారనే ప్రచారం కూడా జరిగింది. అయితే గవర్నర్కు విజయ్ అందజేసిన లేఖలో 116 మంది ఎమ్మెల్యేలతో కూడిన సంతకాలు మాత్రమే ఉన్నట్టు తెలిసింది.