Home » Tamil Nadu
లండన్ నుంచి గిఫ్ట్ ప్యాక్ పంపుతున్నామంటూ మాజీ ప్రభుత్వ ఉద్యోగిని దగ్గర రూ.47 లక్షల కాజేసిన అపరిచిత వ్యక్తుల కోసం సైబర్ క్రైం పోలీసులు గాలిస్తున్నారు. తంజావూరు వైద్య కళాశాల రోడ్డుకు చెందిన 64 ఏళ్ల మాజీ ప్రభుత్వ ఉద్యోగిని సెల్ఫోన్కు జూలై 8వ తేది ఫోన్ చేసిన ఓ మహిళ తాను ఆ ఉద్యోగి క్లాస్మేట్నంటూ పరిచయం చేసుకుంది.
తమ కూటమిలోకి ‘తమిళగ వెట్రి కళగం’ (టీవీకే) అధినేత విజయ్ వస్తే ఘనంగా స్వాగతిస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్యే నయినార్ నాగేంద్రన్ పేర్కొన్నారు.
‘తమిళగ వెట్రి కళగం’ (టీవీకే) అధ్యక్షుడు విజయ్ మళ్ళీ రాష్ట్ర పర్యటనకు శ్రీకారం చుట్టనున్నారు. వచ్చే వారం పర్యటన ప్రారంభించాలని విజయ్ భావిస్తున్నారు. ఈ విషయంపై ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి బుస్సీ ఆనంద్తో పాటు పార్టీ సీనియర్ నేతలతో ఆయన సమాలోచన చేస్తున్నట్టు టీవీకే వర్గాలు పేర్కొంటున్నాయి.
మరణం కూడా వారి స్నేహాన్ని విడదీయలేకపోయింది. రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మరణించగా, ఆ విషయం తెలిసి అతని స్నేహితుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. తిరుప్పూర్ జిల్లాలో గురువారం జరిగిన ఈఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.
మద్యం తాగనీయకుండా కూతురు అడ్డుకుందన్న మనస్తాపంతో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కన్నియాకుమారిలో చోటుచేసుకుంది. ముంగిల్విలైలో నివసిస్తున్న భవన నిర్మాణ కార్మికుడు రాజేంద్రన్ (49)కు అఖిల (47) అనే భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు.
ప్రహరీ గోడ కూలి నర్సింగ్ విద్యార్థిని మృతిచెందిన ఘటన విరుదునగర్ జిల్లాలో చోటుచేసుకుంది. పాత వెల్లయాపురానికి చెందిన వీరమణి కుమార్తె భవాని (17) శివకాశిలోని ఓ నర్సింగ్ కళాశాలలో చదువుతోంది.
రాష్ట్ర చరిత్రలో ఎన్నికల నోటిఫికేషన్ జారీ కావడానికి ముందే ప్రధాన పార్టీలు ప్రచారం చేయడాన్ని చూస్తుంటే వచ్చే యేడాది జరిగే అసెంబ్లీ ఎన్నికలు భీకరయుద్ధాన్ని తలపించేలా జరగటం ఖాయమని ప్రముఖ సినీ గేయరచయిత, ఎంఎన్ఎం నేత స్నేహన్ అన్నారు.
కాచిగూడ ఎక్స్ప్రెస్ రైలుకు జర్మన్ సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన ఎల్హెచ్బీ బోగీలు అనుసంధానం చేయనున్నారు. ఈ మేరకు దక్షిణ రైల్వే ఒక ప్రకటన విడుదల చేసింది.
దీపావళి పండుగ సందర్భంగా రాష్ట్రంలోని 4,829 మద్యం దుకాణాల్లో మూడు రోజుల్లో రూ.790 కోట్లకు పైగా మద్యం విక్రయాలు జరిగినట్లు టాస్మాక్ సంస్థ తెలిపింది. దేశవ్యాప్తంగా సోమవారం దీపావళి పండుగ జరుపుకున్నారు.
వచ్చే యేడాది జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో తమిళగ వెట్రి కళగం (టీవీకే) అన్నాడీఎంకే కూటమిలో చేరకపోతే ఆ పార్టీ పత్తాలేకుండా పోతుందని మాజీ మంత్రి, శాసనసభాపక్ష ఉపనాయకుడు ఆర్బీ ఉదయ్కుమార్ హెచ్చరించారు.