Home » T20 WORLD CUP
ఫిబ్రవరి 7 నుంచి టీ20 ప్రపంచ కప్ 2026 ప్రారంభం కానుంది. దీనికి సంబంధించి తాజాగా క్రికెట్ ఆస్ట్రేలియా తమ జట్టును ప్రకటించింది. దీంట్లో స్టార్ ప్లేయర్లు చోటు దక్కించుకోలేకపోయారు. పాట్ కమిన్స్, స్మిత్ జట్టుకు దూరం కాగా.. మిచ్ మార్ష్ ఆసీస్ కెప్టెన్గా వ్యవహరించనున్నాడు.
టీ20 ప్రపంచ కప్-2026 టోర్నీకి సంబంధించిన వార్మప్ మ్యాచ్ల షెడ్యూల్ విడుదలైంది. ఈ టోర్నీ నుంచి బంగ్లాదేశ్ వైదొలగడం, ఆ స్థానంలో స్కాట్లాండ్ ఎంట్రీ ఇవ్వడం వంటి పరిస్థితు మధ్య షెడ్యూల్ ప్రకటన ఆలస్యమైంది. వార్మప్ మ్యాచ్ల్లో భాగంగా భారత్ ఒకే ఒక మ్యాచ్ ఆడనుంది.
స్కాట్లాండ్.. అనూహ్యంగా టీ20 ప్రపంచ కప్లో ఆడే అవకాశం దక్కించుకున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ మెగా టోర్నీ కోసం తమ జట్టును ప్రకటించింది. 15 మంది సభ్యులతో కూడిన జట్టుక రిచీ బెరింగ్టన్ నాయకత్వం వహించనున్నాడు.
పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్తో పీసీబీ ఛైర్మన్ మోసిన్ నఖ్వీ భేటీ ముగిసింది. అనంతరం నఖ్వీ పలు అంశాలను వెల్లడించారు. టీ20 ప్రపంచ కప్ లో పాల్గొనే అంశంపై సుదీర్ఘంగా చర్చించామని తెలిపారు.
టీ20 ప్రపంచకప్-2026 టోర్నీ మరో రెండు వారాల్లో ప్రారంభం కానుంది. భారత్, పాకిస్థాన్ ఓకే గ్రూపులో ఉన్నాయి. ఈ క్రమంలో భారత్తో జరిగే మ్యాచ్లో పాకిస్థాన్ ఓడిపోతుందంటూ ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైకేల్ క్లార్క్ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
ఐసీసీ టీ20 ప్రపంచకప్ నుంచి బంగ్లాదేశ్ వైదొలిగితే ఆ దేశ క్రికెట్ బోర్డుకు భారీగా ఆర్థిక నష్టం జరగుతుంది. ఓ స్పోర్ట్ నివేదికల ప్రకారం.. బంగ్లా జట్టు ఐసీసీ టోర్నీలో ఆడకుంటే.. 27 మిలియన్ డాలర్లు లేదా రూ.240 కోట్ల వరకు నష్టపోయే అవకాశం ఉంది.
టీ20 ప్రపంచకప్-2026 టోర్నీ ముంగిట న్యూజిలాండ్ జట్టుకు బిగ్ షాక్ తగిలింది. ఆ జట్టు పేసర్ ఆడం మిల్నేకు గాయమైంది. దీంతో అతడుఈ మెగా టోర్నీ నుంచి వైదొలిగాడు. ఈ విషయాన్ని న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు ధ్రువీకరించింది.
టీ20 ప్రపంచ కప్ 2026 మ్యాచులను భారత్లో ఆడేదేలేదని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు స్పష్టం చేసింది. వేదికలను మార్చితేనే తమ నిర్ణయంలో మార్పు ఉంటుందని పేర్కొంది.
బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు(బీసీబీ)కు ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) బిగ్ షాకిచ్చింది. టీ20 ప్రపంచకప్ 2026లో తాము ఆడాల్సిన గ్రూప్ మ్యాచ్ల వేదికలను భారత్ నుంచి శ్రీలంకకు మార్చాలన్న బీసీబీ అభ్యర్థనను తిరస్కరించింది.
భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్న టీ20 ప్రపంచకప్-2026కు ఇటలీ అర్హత సాధించింది. ఈ టోర్నీ కోసం 15 మంది సభ్యుల జట్టును ఆ దేశ క్రికెట్ ప్రకటించింది. ఈ టీమ్కు గతంలో సౌతాఫ్రికా తరఫున ఆడిన ఓ ప్లేయర్ ఎంపికయ్యాడు.