Home » Student
పాఠశాలల్లో ఏం జరుగుతుందన్న అంశాలను అధ్యయనం చేసేందుకు మంత్రి లోకేశ్ సోషల్ ఆడిట్' పేరుతో సమగ్ర విషయ సేక రణ నిర్వహించాలని ఆదేశించగా, కొద్దిరోజు లుగా ఈ కార్యక్రమం ప్రభుత్వ పాఠశాలల్లో జరుగుతోంది.
మార్కులు తక్కువగా వచ్చినప్పుడు ఇంట్లో తల్లిదండ్రులు మందలిస్తారని భయపడి.. ప్రోగ్రెస్ రిపోర్ట్లో దిద్దుకునే విద్యార్థులను చాలామంది చూసి ఉంటారు. సున్నాలు చుట్టడం, సున్నాను ఎనిమిదిగా మార్చడం, ఒకటిని ఏడుగా మార్చడం.. ఇలాంటి బురిడీ కొట్టించే సన్నివేశాలు చాలా సినిమాల్లో కూడా చూసే ఉంటారు. ఇలాంటివి పాఠశాల స్థాయిలో చిన్నారులు చేసే చిలిపి చేష్టలుగా...
పుస్తకం.. ఇక విద్యార్థుల ప్రతిభకు కొలమానం కానుంది. ఒక విద్యార్థి ఏ సబ్జెక్టులో అగ్రస్థానంలో ఉన్నాడు, ఏ సబ్జెక్టులో వెనుకబడి ఉన్నాడు.. అనే విషయాన్ని ఆ పుస్తకం తెలియజేస్తుంది. ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నిర్వహించే పరీక్షలకు సంబంధించి జవాబులను ఈ పుస్తకాల్లో రాయించనున్నారు.
మండలకేంద్రంలోని మైనార్టీ గురుకుల పాఠశాల అసౌకర్యాలకు నిలయంగా మారింది. పాఠశాలలో కనీస సౌకర్యాలు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అనంతపురం మూడో రోడ్డులో ఉన్న మైనార్టీ గురుకుల పాఠశాలను భవనాల కొరతతో గార్లదిన్నెకు మార్చారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల కోసం నిర్మించిన భవనంలోకి 2016లో దీన్ని తరలించారు. మైనార్టీ గురుకుల పాఠశాల భవనం నిర్మాణానికి అప్పటి ప్రభుత్వం రాప్తాడు సమీపంలో 6.72 ఎకరాల స్థలాన్ని కేటాయించింది. అలాగే భవన ...
డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం.. ఈ పేరు చెబితే ఒకటి కాదు.. మేధావి, శాస్త్రవేత్త, మిస్సైల్ మ్యాన్, పీపుల్స్ ప్రెసిడెంట్, స్ఫూర్తి ప్రదాత, నిరాండబరత, ఇలా ఎన్నెన్నో గుర్తొస్తాయి. విద్యార్థుల ప్రగతి కోసం నిత్యం పరితపించే ఆయన.. వారి కోసం పలు సందర్భాల్లో చెప్పిన కొన్ని అద్భుత సూక్తులు..
ప్రాణాలు కాపాడే వైద్యవిద్యను అభ్యసిస్తున్న మెడికోలు గంజాయి మత్తులో తూలుతున్నారు. గంజాయి విక్రయం కేసులో ఇటీవల బొల్లారం ప్రాంతానికి చెందిన అర్ఫాత్ అహ్మద్, బీదర్కు చెందిన జరీనా బేగంను పోలీసులు అరెస్టు చేశారు.
సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ఉన్న సవాళ్లను ఎదుర్కొనేలా మీ మేథస్సుతో పని చేయాలని భారత మాజీ ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు మార్గనిర్దేశం చేశారు. త్వరలోనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అందుబాటులోకి వస్తోందని.. వాటిపై మనం పూర్తి అవగాహన పెంచుకోవాలని సూచించారు. మన సాంకేతికతను ఉపయోగించి మంచి పంటలు పండేలా చేయాలని వెంకయ్య నాయుడు ఆకాంక్షించారు.
తెలంగాణ స్థానిక కోటాపై సుప్రీంకోర్టులో మంగళవారం కీలక విచారణ కొనసాగుతోంది. స్థానికులు నాలుగేళ్లు వరుసగా తెలంగాణలో చదవకపోయిన స్థానిక కోటా వర్తిస్తుందన్న తెలంగాణ హైకోర్టు తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది.
అర్థం కాని చదువుతో సతమతం అవుతున్నానని, ఈ చదువు తనతోకాదని, చెల్లినైనా నచ్చిన కోర్సులో జాయిన్ చేయించి మంచిగా చదవించండంటూ తల్లిదండుల్రకు సూసైడ్ నోట్ రాసి ఇంటర్ విద్యార్థిని తరగతి గదిలో ఫ్యాన్కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది.
ప్రముఖ బౌద్ధ సంస్థ బుద్ధాస్ లైట్ ఇంటర్నేషనల్ అసోసియేషన్ (బీఎల్ఐఏ) మరోసారి దాతృత్వాన్ని చాటుకుంది. హైదరాబాద్ నగరం కవాడిగూడలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చదివే పేద పిల్లలకు బూట్లు, ఇండోర్ స్పోర్ట్స్ కిట్లను పంపిణీ చేసింది.