Home » Srisailam
ఎస్ఎల్బీసీ సహాయక చర్యల్లో కీలక ముందడుగు పడింది. గ్రౌండ్ పెనెట్రేటింగ్ రాడార్ సహాయంతో.. సొరంగంలో చిక్కుకుపోయిన ఎనిమిది మంది ఆచూకీని గుర్తించారు.
Tunnel Rescue Operations: ఎస్ఎల్బీసీ టన్నెల్లో ప్రమాదం జరిగి వారం రోజులు గడుస్తోంది. టన్నెల్లో చిక్కుకున్న 8 మంది కూడా రెస్క్యూ టీం తీవ్రంగా శ్రమిస్తోంది. మూడు షిఫ్ట్ల్లో సహాయక బృందాలు పనిచేస్తూ ప్రమాదంలో చిక్కుకున్న వారి కోసం శ్రమిస్తున్నాయి.
శ్రీశైలం ఎడమగట్టు కాలువ సొరంగం ప్రమాదంలో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఆక్వా ఐ సోనార్ టెక్నాలజీ, గ్రౌండ్ పెనిట్రేటింగ్ రాడార్ (జీపీఆర్)తో టన్నెల్లో చిక్కుకున్న కార్మికులను గుర్తించేందుకు అధికారులు ప్రయత్నించారు.
శ్రీగిరిపై బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. శుక్రవారం ఉదయం బ్రహ్మోత్సవాల పూర్ణాహుతి, త్రిశూలస్నానం, వసంతోత్సవం జరుగుతోంది. సాయంత్రం సదస్యం, నాగవల్లి బ్రహ్మోత్సవాలకు దేవతలను ఆహ్వానిస్తు కట్టిన ధ్వజపటాన్ని ధ్వజావరోహణ చేస్తారు.
శ్రీశైలం ఎడమ గట్టు కాలువ (ఎస్ఎల్బీసీ) టన్నెల్ అత్యంత క్లిష్టమైనది. దేశంలో అత్యంత పొడవైన టన్నెల్. మధ్యలో ఎక్కడా కూడా యాడిట్ (బయటకు వెళ్లే ద్వారం లేదు). దేశంలో చాలా టన్నెల్ ప్రమాదాలు చూశాం.
‘‘శ్రీశైలం ఎడమగట్టు కాలువ (ఎస్ఎల్బీసీ) సొరంగం మధ్యలో బయటికి వెళ్లే దారి లేనందువల్లే టన్నెల్ తవ్వకంలో సమస్యలు వస్తున్నాయి. సొరంగం మధ్యలో దారి ఉంటే టన్నెల్ తవ్వకం మరో విధంగా ఉండేది’’ ప్రస్తుతం ప్రతి ఇంజనీరింగ్ నిపుణుడి నోటా వ్యక్తమవుతున్న అభిప్రాయమిది.
ఎస్ఎల్బీసీ సొరంగ మార్గం పనులు ముందుకు సాగుతాయా? లేదా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడున్న టన్నెల్ బోరింగ్ మిషన్ (టీబీఎం) కట్టర్ భాగం మినహాయించి మిగతా యంత్రమంతా ధ్వంసమైంది.
శ్రీశైలం ఎడమ గట్టు కాలువ (ఎస్ఎల్బీసీ) సొరంగంలో చిక్కుకున్న 8 మంది జాడ ఇప్పటికీ తెలియలేదు. శనివారం ఉదయం 8.30 గంటలకు ఈ ప్రమాదం జరగ్గా దాదాపు ఐదు రోజులుగా సహాయక చర్యలు కొనసాగుతున్నా...
Tragedy: మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని పుణ్యస్నానాలకు వెళ్లిన పలువురు గల్లంతవడం తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. తూర్పుగోదావరి జిల్లా తాడిపూడిలో గల్లంతైన యువకుల మృతదేహాలు లభ్యమయ్యాయి.
మహాశివరాత్రి పర్వదినం నేపథ్యంలో శ్రీకాళహస్తి ఆలయంలో ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. స్వామివార్ల దర్శనానికి పెద్ద సంఖ్యలో భక్తులు పోటెత్తారు. సామాన్య దర్శనంతో పాటు రూ. 200, 500 రూపాయల ప్రత్యేక దర్శనాలను అధికారులు ఏర్పాటు చేశారు. స్వామివారి దర్శనం కోసం రెండు గంటల సమయం పడుతోంది.