Home » Srisailam
ఎస్ఎల్బీసీ టన్నెల్ లోపల భయానక పరిస్థితి ఉంది. సొరంగంలో గల్లంతైన ఎనిమిది మందిని ప్రాణాలతో క్షేమంగా తీసుకొచ్చే విషయంలో పరిస్థితి ఆశాజనకంగా లేదు’’ అని మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు.
శ్రీశైలం ఎడమగట్టు కాలువ సొరంగ మార్గంలో పైకప్పు కూలిన ఘటనలో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. టన్నెల్ లోపల ఇద్దరు ఇంజనీర్లు, ఇద్దరు ఆపరేటర్లు, నలుగురు కార్మికులు చిక్కుకోవడంతో..
స్ఎల్బీసీ టన్నెల్ తాజా ప్రమాదానికి నిర్లక్ష్యమే కారణమా? పనుల ప్రారంభానికి ముందు టన్నెల్ బోర్ మిషన్ (టీబీఎం) ఉన్న ప్రాంతాన్ని పరిశీలించి అనుమతులు ఇవ్వాల్సిన జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అధికారులు ఏమరపాటుగా వ్యవహరించడమే ఈ దుర్ఘటనకు కారణమా?
శ్రీశైలం క్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ రోజు సాయంత్రం రాష్ట్ర ప్రభుత్వం తరపున దేవాదాయశాఖ మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి, శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఆది దంపతులకు పట్టువస్త్రాలు సమర్పిస్తారు.
శ్రీశైలం ఎడమగట్టు కాలువ (ఎస్ఎల్బీసీ) టన్నెల్లో భారీ ప్రమాదం సంభవించింది. టన్నెల్ బోరింగ్ మెషిన్ (టీబీఎం)తో సొరంగం తవ్వుతుండగా.. పైకప్పు కూలింది. శ్రీశైలం నుంచి మన్నెవారిపల్లి వైపు నీటిని తరలించే ఇన్ లెట్ భాగం నాగర్కర్నూల్ జిల్లా దోమలపెంట సమీపంలో శనివారం ఉదయం 8.30 గంటల సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
Srisailam tunnel: శ్రీశైలం ఎడమ టన్నెల్లో ఘోర ప్రమాదం జరిగింది. పలువురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే వారిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.
శ్రీశైలంలో బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఈరోజు స్వామి అమ్మవార్లు హంసవాహనంపై విహరిస్తూ భక్తులకు దర్శనమిస్తారు. విజయవాడ ఇంద్రకీలాద్రి దుర్గామల్లేశ్వర స్వామి అమ్మవార్ల దేవస్థానం తరుపున అధికారులు శ్రీశైలం శ్రీస్వామి అమ్మవార్లకు పట్టువస్ర్తాలు సమర్పిస్తారు.
Srisailam: ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా మొదలయ్యాయి. బుధవారం ఉదయం ఆలయ ఈవో ఎం.శ్రీనివాసరావు, అర్చకులు, వేద పండితులు యాగశాల ప్రవేశం చేసి ఈ ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు.
మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు శ్రీశైలం సిద్ధమైంది. శ్రీశైలం మహాక్షేత్రంలో బుధవారం నుంచి మార్చి ఒకటో తేదీ వరకు జరగనున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ నెల 23న రాష్ట్ర ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు.
బ్రహ్మోత్సవాల సమయంలో అన్ని ఆర్జిత సేవలను నిలుపుదల చేశారు. ప్రముఖులకు 4 విడతలుగా బ్రేక్ దర్శనం కల్పిస్తారు.