Home » SriLanka Cricketers
శ్రీలంక టీ20 జట్టు కెప్టెన్ వనిందు హసరంగకు ఐసీసీ షాకిచ్చింది. ఐసీసీ ప్రవర్తనా నియామళి ఉల్లంఘన కింద హసరంగపై ఐసీసీ రెండు టెస్ట్ల నిషేధం విధించింది. తన టెస్టు క్రికెట్ రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్న గంటల వ్యవధిలోనే హసరంగపై వేటు పడడం గమనార్హం.
Upul Tharanga: శ్రీలంక క్రికెట్ జట్టు నూతన సెలక్షన్ కమిటీ ఛైర్మన్గా మాజీ క్రికెటర్ ఉపుల్ తరంగను నియమించినట్లు శ్రీలంక క్రీడాశాఖ మంత్రి హరీన్ ఫెర్నాండో ప్రకటించారు. అంతేకాకుండా ఐదుగురు సభ్యుల సెలక్షన్ కమిటీని కూడా ఆయన వెల్లడించారు. ఐదుగురు సభ్యుల కమిటీలో అజంతా మెండిస్, ఇండికా డి సారమ్, తరంగ పరణవితన, దిల్రువాన్ పెరీరా ఉన్నారు.
ODI World Cup 2023: వన్డే ప్రపంచకప్లో నాలుగో సెమీస్ బెర్త్ దాదాపు న్యూజిలాండ్ కైవసం చేసుకున్నట్లే భావించాలి. సెమీస్ చేరాలంటే తప్పకుండా గెలవాల్సిన మ్యాచ్లో న్యూజిలాండ్ అదరగొట్టింది. బెంగళూరు వేదికగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో 5 వికెట్ల తేడాతో న్యూజిలాండ్ గెలిచింది.
ODI World Cup: వన్డే ప్రపంచకప్లో సెమీస్ చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో న్యూజిలాండ్ విజృంభించింది. బెంగళూరు వేదికగా శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్లో బౌలర్లు సమష్టిగా రాణించారు. 46.4 ఓవర్లలో 171 పరుగులకే శ్రీలంకను ఆలౌట్ చేశారు.
Mathews Brother Warns to Shakib: శ్రీలంక సీనియర్ ఆటగాడు ఏంజెలో మాథ్యూస్ టైమ్డ్ ఔట్ వివాదం ఇప్పట్లో సమసిపోయేలా కనిపించడం లేదు. ఈ వివాదం మరింతగా ముదిరింది. ఈ వివాదంలో శ్రీలంక, బంగ్లాదేశ్ జట్లతోపాటు రెండు దేశాల అభిమానుల మధ్య మాటల యుద్ధం నెలకొంది. పలువురు మాజీ క్రికెటర్లు సైతం ఈ వివాదంపై స్పందిస్తున్నారు. అయితే ఈ వివాదంలో మెజారిటీ మంది మాథ్యూస్కు అండగా నిలుస్తున్నారు. బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబ్ అల్ హసన్ను తప్పుబడుతున్నారు.
భారత్ వేదికగా జరుగుతున్న వన్డే ప్రపంచకప్లో ఈ నెల 6న బంగ్లాదేశ్, శ్రీలంక మధ్య జరిగిన మ్యాచ్ ఏ స్థాయిలో వివాదానికి తెరదీసిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ మ్యాచ్లో శ్రీలంక సీనియర్ ఆటగాడు మాథ్యూస్ ‘టైమ్డ్ ఔట్’ కావడం అందరినీ ఆశ్చర్యపరిచింది.
ముంబై వేదికగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో 302 పరుగుల భారీ తేడాతో టీమిండియా విజయం సాధించింది. దీంతో వరుసగా వన్డే ప్రపంచకప్లలో నాలుగోసారి సెమీస్లో అడుగుపెట్టింది.
ప్రపంచకప్లో టీమిండియాతో జరుగుతున్న మ్యాచ్లో శ్రీలంక చెత్త రికార్డు సాధించింది. వన్డేల్లో ఓ ఇన్నింగ్స్లో గోల్డెన్ డక్ అయిన 4వ జంటగా నిశాంక-కరుణరత్నే జోడీ నిలిచింది.
ఆసియా కప్ ప్రారంభానికి ముందు శ్రీలంక జట్టుకు షాక్ తగిలింది. శ్రీలంక ఓపెనర్లు అవిష్క ఫెర్నాండో, వికెట్ కీపర్ కుశాల్ పెరీరాకు కోవిడ్ లక్షణాలు కనిపించడంతో టీమ్ మేనేజ్మెంట్ వైద్య పరీక్షలు చేయించింది. అయితే వీళ్లిద్దరికీ కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. దీంతో శ్రీలంక టీమ్ ఆందోళన పడుతోంది.
శ్రీలంకతో జరుగుతున్న మూడో వన్డేలో టీమిండియా స్టార్ బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీ అద్భుతంగా రాణించాడు. శ్రీలంక బౌలర్లపై సిక్స్లు, ఫోర్లతో సునామీలా విరుచుకుపడ్డాడు. విరాట్ కోహ్లీ 110 బంతుల్లో 8 సిక్స్లు, 13 ఫోర్లతో తుఫానులా..