Home » Sports news
అంతర్జాతీయ ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సి కోల్కత్తాలో అడుగుపెట్టారు. విమానాశ్రయంలో దిగిన మెస్సిని చూడటానికి అభిమానులు భారీగా తరలి వచ్చారు.
ఫుట్బాల్ సూపర్ స్టార్ లియోనెల్ మెస్సీ భారత్ రానున్నారు. హైదరాబాద్ నగరంలో పర్యటించనున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఫుట్బాల్ మ్యాచ్ ఆడనున్నారు. ఇండియా టూర్ ముగించే ముందు దేశ రాజధాని ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీని మెస్సీ కలుస్తారు.
సొంతగడ్డపై జరుగుతున్న యాషెస్ 2025-26 సిరీస్లో ఆస్ట్రేలియా అదరగొడుతోంది. బ్యాటింగ్, బౌలింగ్తో సత్తాచాటి వరుసగా రెండో విజయం సాధించింది. బ్రిస్బేన్ వేదికగా జరిగిన రెండో టెస్టులో కంగారూలు 8 వికెట్ల తేడాతో ఇంగ్లిష్ జట్టును మట్టికరిపించారు.
దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో వెటరన్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ అదిరే ఆటతో ఈ సిరీస్పై ఆసక్తిని అమాంతం పెంచేశారు.
జూనియర్ మహిళల ప్రపంచ కప్ హాకీ 2025 టోర్నమెంట్ లో భారత్ బోణి కొట్టింది. ఈ టోర్నీలో భాగంగా సోమవారం జరిగిన గ్రూప్ ‘సి’ తొలి లీగ్ మ్యాచ్లో జ్యోతి సింగ్ సారథ్యంలోని భారత జట్టు 13–0 గోల్స్ తేడాతో నమీబియా జట్టుపై అద్భుత విజయాన్ని అందుకుంది.
రైల్వే స్పోర్ట్స్ ప్రమోషన్ బోర్డ్(ఆర్ఎస్పీబీ) ముగ్గురు మహిళా క్రికెటర్లకు బంపర్ ఆఫర్ ఇచ్చింది. ప్రతికా రావల్, స్నేహా రానా, రేణుకా సింగ్ ఠాకూర్లను ఇండియన్ రైల్వేలో ఆఫీసర్లుగా నియమించింది.
రాంచీ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో టీమిండియా విజయం సాధించింది. 350 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా అద్భుతమైన పోరాటం చేసి 332 పరుగులకు ఆలౌటైంది. కుల్దీప్ నాలుగు, హర్షిత్ రాణా మూడు వికెట్లు పడగొట్టి దక్షిణాఫ్రికాను దెబ్బ తీశారు.
రాంచీ వేదికగా భారత్తో జరుగుతున్న తొలి వన్డేలో దక్షిణాఫ్రికా ఓటమి వైపు పయనిస్తోంది. 350 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా 130 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. హర్షిత్ రాణా మూడు వికెట్లు పడగొట్టి దక్షిణాఫ్రికాను దెబ్బ తీశాడు.
టీ20 ప్రపంచ కప్ 2026కు సంబంధించి ఓ క్రేజీ అప్ డేట్ వచ్చింది. క్రికెట్ ప్రియులందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న ఈ టోర్నమెంట్ షెడ్యూల్ రిలీజ్ కానుంది. ఇవాళ(మంగళవారం) సాయంత్రం 6.30కి టోర్నమెంట్ షెడ్యూల్ విడుదల కానుంది.
టీమిండియా మహిళా స్టార్ ప్లేయర్ స్మృతి మందాన , సంగీత దర్శకుడు పలాశ్ ముచ్చల్ వివాహం ఆగిపోయింది. తాజాగా వీరి వివాహం రద్దుపై పలాశ్ సోదరి పలాక్ సోషల్ మీడియాలో ఇంట్రస్టింగ్ పోస్ట్ చేశారు.