Home » Singanamala
స్థానిక శిం గనమల శ్రీరంగనా యక చెరువు మరువకొమ్మ రో డ్డు వద్ద ఫ్లై ఓవర్ బ్రిడ్జి ఏర్పాటు చేయాలని ఎమ్మె ల్యే బండారు శ్రావణిశ్రీ ఆర్ ఆండ్ బీ శాఖ మం త్రి బీసీ జనార్దన రెడ్డికి విన్నవించారు. విజయ వాడలో మంత్రిని గురు వారం కలసి నియోజకవర్గంలోని రహదారుల సమస్యలపై వివరించినట్లు ఎమ్మెల్యే తెలిపారు.
మండలపరిధిలోని కల్లూరులో కొండకింద వెలసిన సింగరప్ప స్వామి దేవాలయం వద్ద శనివారం జరిగిన రాతిదూలం లాగుడు పోటీల్లో నాగర్ కర్నూల్ వృషభాలు ప్రథమ స్థానంలో నిలిచాయి. ప్రతి యేటా మాదిరిగానే మాఘమాసం నాలుగో శనివారం ఆరుపళ్ల వృషభాలకు పోటీలు నిర్వహించారు. జిల్లాతో పాటు కర్నూల్, నాగర్ కర్నూల్, నంద్యాల జిల్లాల నుంచి సుమారు 12 జతల వృషభాలు పాల్గొన్నాయి.
మండలంలోని సోమదొడ్డి గ్రామ సమీపంలోని తడకలేరులో వెలసిన అశ్వత్థనారాయణస్వామి తిరునాళ్లు కన్నుల పండువగా సాగాయి. మాఘమాసం మూడో ఆదివారం సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో స్వామి వారికి తెల్లవారుజామున విశేషపూజలు నిర్వహించారు.
విద్యార్థులకు ఈ నెల 14న చేపట్టనున్న కంటి అద్దాలు పంపిణీ చేసే రాష్ట్రస్థాయి కార్యక్రమాన్ని పకడ్బందీగా చేపట్టాలని కలెక్టర్ డాక్టర్ వినోద్కుమార్ అధికారుల ను ఆదేశించారు. ఆయన బుధవారం స్థానిక ఆదర్శ పాఠశాలను అసిస్టెంట్ కలెక్టర్ వినూత్నతో కలసి సందర్శిం చారు.
కొండమీదరాయుడు స్వామి బ్రహోత్సవాల సందర్భంగా ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ, వారి కుటుంబ సభ్యులు బండారు రవికుమార్, బండారు లీలావతి స్వామి వారికి పట్టు వసా్త్రలు సమర్పించారు. బుధవారం వేకుజామున జరిగే స్వా మి వారి కళ్యాణోత్సవం కోసం వాటిని సమర్పించారు.
గత వైసీపీ పాలనలో దెబ్బతిన్న పలు గ్రామీణ రోడ్లకు కనీసం ప్యాచ వర్క్లను చేయలేదు. అయితే కూటమి ప్రభుత్వం రాగానే గ్రామీణ రోడ్లకు మరమ్మతులు చేస్తున్నారు. దీంతో ప్రయాణం సాఫీగా సాగుతుండడంతో ప్రయాణికులు, ప్రజలు ఆ నందం వ్యక్తం చేశారు.
పారదర్శకత పాటిస్తూ ప్రజా సమస్యలను త్వరగా పరిష్కరించాలని ఎమ్మెల్యే బండారు శ్రావణీశ్రీ అధికారులకు సూచించారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో సోమ వారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. ఎమ్మెల్యే బండారు శ్రావణీశ్రీతో పాటు, అనంతపురం ఆర్డీఓ కేశవులునాయుడు, మండలంలోని వివిధ శాఖల అధికారులు హజరయ్యారు.
మండలంలో చిరుతల సంచారం పెరిగింది. కొండ ప్రాంతాల్లో చిరుతలు.. మూగజీవాలపై దాడులు చేసి, చం పుతున్నాయి. దీంతో రైతులు, గొర్రెల కాపర్లు.. మూగజీవాలను కొండ ప్రాం తాలకు మేత కోసం తీసుకెళ్లాలంటే హడలిపోతున్నారు. ఈనెల 6న గోవిందరాయునిపేట సమీపంలోని మాల కొండ వద్ద ఎద్దుల సూరికి చెందిన గొర్రెల మందపై రెండు చిరుతలు దాడి చేశాయి. రెండు గొర్రెలను చంపే శాయి.
కోరిన కొర్కెలు తీర్చే కొండమీద రాయుడు స్వామి హనుమద్వాహ నంపై పురువీధులలో విహరిస్తూ భక్తులకు అభయమిచ్చారు. బ్రహ్మో త్సవాల్లో భాగంగా ఐదో రోజు హనుమద్వాహ న సేవ ఆదివారం నేత్ర ప ర్వంగా సాగింది. ఉద యం స్థానిక అంజినేయ స్వామి దేవాలయంలో శ్రీదేవి, భూదేవి సమేత స్వామి ఉత్సవమూర్తుల కు వేద పండితులు ప్ర త్యేక పూజలు నిర్వహిం చారు.
స్థానిక కొండమీద రాయు డు స్వామి బ్రహోత్సవా లు అంగరంగ వైభవం గా జరుగుతున్నాయి. ్ఞఅందులో భాగంగా నా లుగో రోజు శనివారం శ్రీదేవి, భూదేవి సమేత స్వామి వారు శేష వాహ నంపై భక్తులకు దర్శనమి చ్చారు.