Home » Singanamala
మండల పరిధిలోని సి.బండమీదపల్లి బీసీ కాలనీ వాసులు తాగునీటిని డ్రిప్పు వైరు ద్వారా పట్టు కోవాల్సి వస్తోంది. గ్రామంలో జరిగిన జాతీయ రహదారి పనుల సమయంలో బీసీ కాలనీ చెందిన తాగునీటి పైపులైన్లు చాలా మటుకు ధ్వంసం అయ్యాయి. దీంతో వారు ఊరు చివర కొంత బాగున్న పైపు లైనకు డ్రిప్పు వైరు తగిలించుకుని తాగునీటిని పట్టుకుంటున్నారు.
సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తోందని ఎమ్మెల్యే బండారు శ్రావణీశ్రీ అన్నారు. మండల పరిధిలోని జంతులూరులో రూ. 2 కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మించిన 220 కేవీ విద్యుత సబ్స్టేషనను ఎమ్మెల్యే శనివారం ముఖ్య అతిథిగా హజరై ప్రారంభించారు.
నియోజకవర్గంలోని ఎస్సీల అభివృద్ధికి సహకరించాలని ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామికి విన్నవించారు. గురువారం వెలగపూడి సచివాలయంలో మంత్రిని ఎమ్మెల్యే కలిశారు.
నియోజకవర్గంలోని పురాత నమైన దేవాలయాల అభి వృద్ధితో పాటు గూగూడు ను పుణ్యక్షేత్రంగా, పర్యా ట క ప్రాంతంగా అభివృద్ధి చే యడానికి నిధులు కేటా యించాలని రాష్ట్ర దేవదా య శాఖ మంత్రి ఆనం రాం నారాయణరెడ్డికి ఎమ్మె ల్యే బండారు శ్రావణిశ్రీ విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్యే బుధవారం అసెంబ్లీ సమావేశాల అనంతరం మం త్రిని ఆయన కార్యాలయంలో కలిసి వినతి పత్రం అందజేశారు.
నియోజకవర్గ కేంద్రమైన శింగనమల ఎస్సీ కాలనీకి సంబంధించిన దళిత శ్మశాన వాటిక ప్రహరీ, భవనం పనులు గత వైసీపీ ప్రభుత్వంలో అర్ధంతరంగా నిలిచిపోయాయి. కాలనీ వాసులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. శింగనమల ఎస్సీ కాలనీ శ్మశాన వాటికకు వైసీపీ ప్రభుత్వంలో చుట్టూ ప్రహరీ, భవనం నిర్మాణానికి ఎంపీ నిధులు రూ. 12 లక్షలు, ఏఆర్జీసీ నిధులు రూ. 7 లక్షలు చొప్పున మొత్తం రూ. 19 లక్షలు కేటాయించారు. వీటితో అక్కడ కాంట్రాక్టర్లు పనులు చేపట్టారు.
స్థానిక శిం గనమల శ్రీరంగనా యక చెరువు మరువకొమ్మ రో డ్డు వద్ద ఫ్లై ఓవర్ బ్రిడ్జి ఏర్పాటు చేయాలని ఎమ్మె ల్యే బండారు శ్రావణిశ్రీ ఆర్ ఆండ్ బీ శాఖ మం త్రి బీసీ జనార్దన రెడ్డికి విన్నవించారు. విజయ వాడలో మంత్రిని గురు వారం కలసి నియోజకవర్గంలోని రహదారుల సమస్యలపై వివరించినట్లు ఎమ్మెల్యే తెలిపారు.
మండలపరిధిలోని కల్లూరులో కొండకింద వెలసిన సింగరప్ప స్వామి దేవాలయం వద్ద శనివారం జరిగిన రాతిదూలం లాగుడు పోటీల్లో నాగర్ కర్నూల్ వృషభాలు ప్రథమ స్థానంలో నిలిచాయి. ప్రతి యేటా మాదిరిగానే మాఘమాసం నాలుగో శనివారం ఆరుపళ్ల వృషభాలకు పోటీలు నిర్వహించారు. జిల్లాతో పాటు కర్నూల్, నాగర్ కర్నూల్, నంద్యాల జిల్లాల నుంచి సుమారు 12 జతల వృషభాలు పాల్గొన్నాయి.
మండలంలోని సోమదొడ్డి గ్రామ సమీపంలోని తడకలేరులో వెలసిన అశ్వత్థనారాయణస్వామి తిరునాళ్లు కన్నుల పండువగా సాగాయి. మాఘమాసం మూడో ఆదివారం సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో స్వామి వారికి తెల్లవారుజామున విశేషపూజలు నిర్వహించారు.
విద్యార్థులకు ఈ నెల 14న చేపట్టనున్న కంటి అద్దాలు పంపిణీ చేసే రాష్ట్రస్థాయి కార్యక్రమాన్ని పకడ్బందీగా చేపట్టాలని కలెక్టర్ డాక్టర్ వినోద్కుమార్ అధికారుల ను ఆదేశించారు. ఆయన బుధవారం స్థానిక ఆదర్శ పాఠశాలను అసిస్టెంట్ కలెక్టర్ వినూత్నతో కలసి సందర్శిం చారు.
కొండమీదరాయుడు స్వామి బ్రహోత్సవాల సందర్భంగా ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ, వారి కుటుంబ సభ్యులు బండారు రవికుమార్, బండారు లీలావతి స్వామి వారికి పట్టు వసా్త్రలు సమర్పించారు. బుధవారం వేకుజామున జరిగే స్వా మి వారి కళ్యాణోత్సవం కోసం వాటిని సమర్పించారు.