Home » Shivraj Singh Chouhan
మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై తీవ్రంగా మండిపడ్డారు. రాహుల్ గాంధీది భారత్ జోడో న్యాయ్ యాత్ర.. కాంగ్రెస్ తోడో, కాంగ్రెస్ చోడో యాత్రగా మారిందని విమర్శించారు. గత అనుభవాలు చూస్తే రాహుల్ గాంధీ యాత్రలు చేసిన ప్రతిచోట కాంగ్రెస్ ఓడిపోతుందన్నారు. రాహుల్ గాంధీ నిన్న ముంబైలో మరో విఫల యాత్రను ముగించారని ఎద్దెవా చేశారు.
మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను న్యూఢిల్లీలో మంగళవారంనాడు కలుసుకున్నారు. సమావేశం ఎజెండా ఏమిటనేది ప్రకటించనప్పటికీ ఆయనకు పార్టీ ఎలాంటి బాధ్యత అప్పగించనుందనే విషయంలో ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి ఎవరు? గత రెండు వారాల నుంచి కొనసాగుతున్న ఈ సస్పెన్స్కు ఎట్టకేలకు తెరపడింది. ఈ విషయంపై ఇన్ని రోజులు మౌనం పాటించిన బీజేపీ.. ఎట్టకేలకు ఆ రాష్ట్రపు సీఎం పగ్గాలను మోహన్ యాదవ్కు అప్పగించారు.
కొందరు అందరి ముందు మనుషుల్లా ప్రవర్తిస్తూ.. ఎవరూ లేని సమయంలో రాక్షసుల్లా ప్రవర్తిస్తుంటారు. కొందరు కుటుంబ సభ్యులపై తమ ప్రతాపాన్ని చూపిస్తే.. మరికొందరు చిన్న పిల్లలపై, ఇంకొందరు జంతువులపై తమ పైశాచిత్వాన్ని ప్రదర్శిస్తుంటారు. ఇలాంటి...
మహిళా సాధికారిత దిశగా మధ్యప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన 'లాడ్లీ బెహనా యోజన' కింద మహిళా లబ్ధిదారుల ఖాతాల్లోకి రూ.1.250 ఆర్థిక సాయం సోమవారం జమ కానుంది. ప్రతినెలా 10వ తేదీన ఈ సాయం మహిళల ఖాతాల్లోకి నేరుగా ఈ మొత్తం జమ చేస్తున్నారు.
మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా శివరాజ్ సింగ్ చౌహాన్ ను కొనసాగిస్తారా, కొత్త పేరు తెరపైకి వస్తుందా అనే ఉత్కంఠ కొనసాగుతున్న నేపథ్యంలో ఆయన ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ముఖ్యమంత్రి కుర్చీ ఎప్పుడూ తన లక్ష్యం కాదని మంగళవారంనాడు తెలిపారు.
మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు-2023లో బీజేపీ 164 సీట్లు గెలుచుకుని మరోసారి అధికారంలోకి వచ్చింది. సీఎం ఎవరనేది బీజేపీ అధిష్ఠానం ఇంకా ప్రకటించనప్పటికీ 2024 లోక్సభ ఎన్నికల వరకూ శివరాజ్ సింగ్నే సీఎంగా కొనసాగించాలనే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం.
ఓటర్లను బెదిరిస్తే మామ బుల్డోజర్ సిద్ధంగా ఉంటుందని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కాంగ్రెస్ పార్టీని హెచ్చరించారు. అనుప్పూర్ జిల్లా జిజూరిలో శుక్రవారం జరిగిన ఎన్నికల ప్రచార సభలో సీఎం ఈ వ్యాఖ్యలు చేశారు. ఎంపీ ప్రజలు శివరాజ్ సింగ్ను 'మామ' అని ఆప్యాయంగా సంబోధిస్తుంటారు.
బీజేపీ సీనియర్ నేత, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సెహోర్ జిల్లా బుద్ని అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు సోమవారంనాడు నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. శివరాజ్ వెంట ఆయన భార్య సాధానా సింగ్ చౌహాన్ హాజరయ్యారు.
మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో రసవత్తరమైన పోటీ కనిపిస్తోంది. బీజేపీ సీనియర్ నేత, ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పై వైరాగ్యానంద్ గిరి అలియాస్ మిర్చిబాబాను సమాజ్వాదీ పార్టీ నిలబెట్టింది. 35 మంది అభ్యర్థులతో సమాజ్వాదీ పార్టీ నాలుగో జాబితాను శనివారం విడుదల చేసింది.