Home » Shaik Haseena
బంగ్లాదేశ్లో విద్యార్థుల నాయకత్వంలో జరిగిన రిజర్వేషన్ వ్యతిరేక ఉద్యమం అక్కడ ప్రభుత్వాన్నే మార్చేసింది.
షేక్ హసీనా అవామీ లీగ్ ను యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక బంగ్లాదేశ్ ప్రభుత్వం నిషేధించింది. ఇప్పటికే హసీనా పారిపోయి భారత్ లో తలదాచుకుంటే, సందట్లో సడేమియాలా మాజీ అవామీ లీగ్ నాయకుడైన అబ్దుల్ హమీద్ కూడా దేశం విడిచి పారారైపోయాడు.
Modi - Muhammad Yunus: పొరుగు దేశం బంగ్లాదేశ్ (Bangladesh)లో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుంచి ఆ దేశంలో హిందువులపై హింసాత్మక దాడులు తీవ్రమయ్యాయి. ఇరుదేశాల మధ్య దూరం పెరుగుతున్న సమయంలో బుధవారం 53వ స్వాతంత్ర్య దినోత్సవం చేసుకున్న బంగ్లాదేశ్ ప్రజలను ఉద్దేశిస్తూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Modi) ఆ దేశ తాత్కాలిక ప్రభుత్వాధినేత మహమ్మద్ యూనస్ (Muhammad Yunus)కు ప్రత్యేక లేఖ రాయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
బంగ్లాదేశ్ విముక్తి పోరాటంలో భారతదేశ పాత్రను తగ్గిస్తూ ఆ దేశం మధ్యంతర ప్రభుత్వం పాఠ్యపుస్తకాల్లో మార్పులు చేసింది.
బంగ్లాదేశ్లో మళ్లీ హింస చెలరేగింది. ఆందోళన కారులు బుధవారం రాత్రి మాజీ ప్రధాని షేక్ హసీనా తండ్రి, బంగ్లాదేశ్ వ్యవస్థాపకుడు షేక్ ముజిబుర్ రెహమన్(బంగబంఽధు) చారిత్రక ఇంటికి నిప్పు అంటించారు.
భారత్లో తలదాచుకుంటున్న బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాను తిరిగి తీసుకు వచ్చేందుకు మధ్యంతర ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది.
బంగ్లాదేశ్లో షేక్ హసీనా ప్రభుత్వ పతనానికి కారణమైన ఇటీవలి ఆందోళనల వెనుక ఉన్న ‘సూత్రధారుల’ను ఆ దేశ తాత్కాలిక ప్రభుత్వ సారధి మొహమ్మద్ యూనస్ ప్రపంచానికి పరిచయం చేశారు.
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాను కష్టాలు వెంటాడుతున్నాయి. ఆమె దేశం విడిచి వచ్చేసినా.. కేసులు ఆగడం లేదు. తాజాగా ఆమెపై మూడు కేసులు నమోదయ్యాయి. దీంతో షేక్ హసీనాపై కేసుల సంఖ్య 12కు చేరింది.
బంగ్లాదేశ్లో హింసాత్మక నిరసనల నేపథ్యంలో ప్రధానమంత్రి పదవికి షేక్ హసీనా రాజీనామా చేసి.. పారిపోయి వచ్చి భారత్లో ఆశ్రయం పొందుతుండడంపై కాంగ్రెస్ సీనియర్, ఎంపీ శశిథరూర్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు రద్దు చేయాలంటూ విద్యార్థి సంఘాలు మొదలుపెట్టిన నిరసనలు హింసాత్మకంగా మారడంతో బంగ్లాదేశ్ ప్రధానమంత్రి పదవికి షేక్ హసీనా రాజీనామా చేసి.. భారత్కు పారిపోయి వచ్చిన విషయం తెలిసిందే.