Home » Schools
పాఠశాలలు ప్రారంభమయ్యాయి. ‘యూనిఫామ్, బ్యాగులు’ అంటూ హడావిడి పడతారు. మనదగ్గర ఒక స్కూలు బ్యాగు ధర రూ. 500 నుంచి మహా అయితే వేయి రూపాయల దాకా ఉంటుంది.
ఏడేళ్ల తర్వాత మోడల్ స్కూళ్ల క్యాడర్ మార్పునకు రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు అనుమతిచ్చింది.
ప్రభుత్వ పాఠశాలల్లో ఉచితంగా విద్య అందిస్తుంటే.. ప్రైవేటు పాఠశాలలు రూ.వేలల్లో ఫీజులు వసూలు చేస్తూ సామాన్యులను ఇబ్బందికి గురి చేస్తున్నాయంటూ కొందరు తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు.
బాగ్లింగంపల్లిలో గల తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ గర్ల్స్ హైస్కూల్ భవనానికి 13 నెలల అద్దె చెల్లించలేదని భవన యజమాని సోయల్ కొఠారి గురువారం గేటుకు తాళం వేశాడు.
పాఠశాలలు నేటి నుంచి పునఃప్రారంభం కానున్నాయి. వేసవి సెలవుల అనంతరం విద్యార్థులు బడిబాట పట్టేందుకు సిద్ధమయ్యారు. ‘పొద్దున్నే లేవాలి.. బడికి పోవాలి’ అంటూ పిల్లలను తల్లిదండ్రులు సమాయత్తం చేస్తున్నారు.
ఆ పాఠశాలలో ఒకేఒక్క విద్యార్థిని ఉన్నారు. తమిళనాడు రాష్ట్రం రామనాథపురం జిల్లాలో కేవలం ఒకేఒక్క విద్యార్థిని కోసం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను నడుపుతున్నారు. గ్రామం ఉండి, విద్యార్థులున్నా ఎవరూ ప్రభుత్వ పాఠశాలకు రావడం లేదు.
Telugu Lessons: కేంద్ర విద్యాశాఖ ఆదేశాల మేరకు పంజాబ్లోని ప్రభుత్వ పాఠశాలల్లో మే 26వ తేదీ నుంచి వారం రోజుల పాటు ఉపాధ్యాయులు వేసవి శిబిరాలు నిర్వహించారు. ఈ క్యాంపులకు 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులు హాజరయ్యారు. వారికి టీచర్స్ యూట్యూబ్లో చూసి తెలుగు వర్ణమాల నేర్పించారు.
ఆరు నుంచి పదో తరగతి చదువుతున్న విద్యార్థుల కోసం ఐఐటీ, మెడికల్ ఫౌండేషన్ డిజిటల్ స్టడీ మెటీరియల్, అసైన్మెంట్లను సిద్ధం చేసినట్లు ఐఐటీ-జేఈఈ-నీట్ ఫోరం తెలిపింది.
ఊటీలో పుష్ప ప్రదర్శనకు నగరం ముస్తాబైంది. గురువారం నుంచి పుష్ప ప్రదర్శన జరగనుంది. ఈ సందర్బంగా నీలగిరి జిల్లాలోని అన్ని పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు ప్రకటించారు. కాగా... ఊటీలోని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యానవన శాఖ నిర్వహణలోని బొటానికల్ గార్డెన్లో వివిధ రకాలకు చెందిన 5 లక్షల పూలమొక్కలను పెంచారు.
సరిహద్దు జిల్లాలైన కుప్వారా, బారాముల్లా, బండిపోరలోని గురెజ్ సబ్-డివిజన్ మినహా కశ్మీర్ అంతటా ఈనెల 13 నుంచి స్కూళ్లు తెరుచుకుంటాయని కశ్మీర్ స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ప్రకటించారు.