Home » SBI
చిన్న, మధ్యస్థాయి ప్రజల కోసం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) జన్నివేష్ SIP అనే కీలక పథకాన్ని ప్రారంభించింది. దీని ప్రకారం మీరు రూ. 250 నుంచే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (SIP)ను ప్రారంభించుకోవచ్చు. ఆ వివరాలేంటో ఇక్కడ చూద్దాం.
బ్యాంకులను మోసం చేసిన కేసులో హైదరాబాద్కు చెందిన శీతల్ రిఫైనరీస్ నుంచి ఎన్ ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అటాచ్ చేసిన రూ.30.71 కోట్ల స్థిరాస్థులను ఎస్బీఐకి ఈడీ అధికారులు అప్పగించారు.
లోన్ తీసుకున్న వారికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గుడ్ న్యూస్ చెప్పింది. రిజర్వ్ బ్యాంకు రెపో రేటును తగ్గించిన నేపథ్యంలో ఎస్బీఐ కూడా ఎక్స్టర్నల్ బెంచ్ మార్క్ ఆధారిత లెండింగ్ రేటును (ఈబీఎల్ఆర్), రెపో రేటు ఆధారిత లెండింగ్ రేట్లల్లో(ఆర్ఎల్ఎల్ఆర్) కోత పెట్టింది.
రైతన్నకు ఆపద సమయంలో అండగా నిలిచేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన పథకం ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన. ఈ పథకం కింద రైతులకు పంట బీమా పాలసీలను అందించేందుకు ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్ సంస్థ నడుం బిగించింది.
చిన్న మొత్తాల పొదుపులను ప్రోత్సహించడానికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త రికరింగ్ డిపాజిట్ (RD) పథకాన్ని ప్రారంభించింది. అదే 'హర్ ఘర్ లఖపతి' (ప్రతి ఇంట్లో లఖపతి). ఈ పథకం కింద మీరు ప్రతి నెలా చిన్న మొత్తాలను డిపాజిట్ చేయడం ద్వారా లక్ష రూపాయలు లేదా అంతకంటే ఎక్కువ పొందవచ్చు.
భారతీయ కుటుంబ వ్యయ విధానాల్లో గణనీయ మార్పు వచ్చిందని, ఆహారం కంటే ఆహారేతర వస్తువులు, అవసరాలపై ఎక్కువగా దృష్టి పెడుతున్నారని ఎస్బీఐ నివేదిక వెల్లడించింది.
600 ప్రొబేషనరీ ఆఫీసర్(పీవో) పోస్టుల నియామకానికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎ్సబీఐ) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు అభ్యర్థులను ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూల ద్వారా ఎంపిక చేస్తారు.
దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన స్టేట్బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎ్సబీఐ) 13,735 జూనియర్ అసోసియేట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. వాటిలో తెలంగాణలో 342, ఆంధ్రప్రదేశ్లో 50 పోస్టులు ఉన్నాయి.
రాయపర్తి ఎస్బీఐలో కోట్లాది రూపాయిల బంగారం చోరీ కేసును పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు. ఈ దోపిడికి పాల్పడిన ముఠాలో ముగ్గురు సభ్యులను అరెస్ట్ చేశారు. మరో నలుగురు పరారీలో ఉన్నారు.
సైబర్ నేరగాళ్ల బారి నుంచి ఓ వ్యక్తిని ఎస్బీఐ అధికారులు కాపాడారు. ఆ క్రమంలో రూ. 30 లక్షలు పోగొట్టుకోకుండా కట్టడి చేశారు. అయితే అసలు ఏం జరిగిందనే వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.