• Home » RJD

RJD

Lok Sabha Polls: ఎన్డీయేకు ఓటు వేయాలంటున్న ఇండియా కూటమి.. పప్పు యాదవ్ సంచలన వ్యాఖ్యలు..!

Lok Sabha Polls: ఎన్డీయేకు ఓటు వేయాలంటున్న ఇండియా కూటమి.. పప్పు యాదవ్ సంచలన వ్యాఖ్యలు..!

దేశంలో సార్వత్రిక ఎన్నికల వేళ విచిత్ర ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. గెలుపే లక్ష్యంగా ఎవరికి వారు వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నారు. ఏడు విడతల్లో భాగంగా మొదటి విడత పోలింగ్ ముగిసింది. రెండో విడత పోలింగ్ ఈనెల 26వ తేదీన జరగనుంది. బీహార్‌లోని పూర్నియా లోక్‌సభ స్థానానికి రెండో విడతలో పోలింగ్ జరగనుంది. ఈ నియోజకవర్గం దేశం దృష్టిని ఆకర్షిస్తోంది. బీహార్‌లోని దాదాపు అన్ని నియోజకవర్గాల్లో ఇండియా కూటమి, ఎన్డీయే కూటమి అభ్యర్థుల మధ్య ద్విముఖ పోరు నెలకొంది. ఒక పూర్నియా స్థానంలో మాత్రం ఇండిపెండెంట్ అభ్యర్థిగా మాజీ ఎంపీ పప్పు యాదవ్ పోటీ చేస్తుండటంతో త్రిముఖ పోటీ నెలకొంది.

Lok Sabha Polls: ఉచితాలే లాస్ట్ ఆప్షన్.. బీజేపీకి బ్రేకులు వేసేందుకు ఇండియా కూటమి భారీ వ్యూహం..

Lok Sabha Polls: ఉచితాలే లాస్ట్ ఆప్షన్.. బీజేపీకి బ్రేకులు వేసేందుకు ఇండియా కూటమి భారీ వ్యూహం..

సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ స్పీడ్‌కు బ్రేకులు వేసేందుకు ఇండియా కూటమి సర్వశక్తులు ఒడ్డుతోంది. కేంద్రంలో మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం హ్యాట్రిక్ కొడుతుందనే ప్రచారం జోరుగా సాగుతున్న నేపథ్యంలో ఎలాగైనా బీజేపీ అధికారంలోకి రాకూండా అడ్డుకట్టవేసేందుకు విపక్ష ఇండియా కూటమి అన్ని ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే బీజేపీ, కాంగ్రెస్ తమ మేనిఫెస్టోను విడుదల చేయగా.. ఏడు అంశాలతో ఉమ్మడి మేనిఫెస్టో విడుదల చేయాలని ఇండియా కూటమి నిర్ణయించింది.

Lok Sabha polls: సినిమా సూపర్ ఫ్లాప్ షో: తేజస్వీ యాదవ్

Lok Sabha polls: సినిమా సూపర్ ఫ్లాప్ షో: తేజస్వీ యాదవ్

లోక్‌సభ ఎన్నికల తొలి దశ పోలింగ్ వేళ.. బీజేపీ సత్తా ఏమిటో వెల్లడైందని ఆర్జేడీ నాయకుడు తేజస్వీ యాదవ్ పేర్కొన్నారు. బీజేపీ 400 సీట్లు సినిమా సూపర్ ప్లాఫ్ షో అయిందన్నారు. అయితే తొలి దశలో బిహార్‌లోని నాలుగు లోక్‌సభ స్థానాల్లో మహాఘట్‌బంధన్ విజయం సాధిస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.

RJD Manifesto: కేంద్రంలో అధికారం .. బిహార్‌కు ప్రత్యేక హోదా

RJD Manifesto: కేంద్రంలో అధికారం .. బిహార్‌కు ప్రత్యేక హోదా

కేంద్రంలో ప్రతిపక్షం ఇండియన్ నేషనల్ డెలప్‌మెంటల్ ఇన్‌క్లూజివ్ అలియన్స్ (ఇండియా కూటమి) అధికారంలోకి వస్తే... కోటి ఉద్యోగాలు కల్పిస్తామని రాష్ట్రీయ జనతాదళ్ నాయకుడు తేజస్వీ యాదవ్ ప్రకటించారు. అలాగే రూ. 500కే సిలండర్ దేశవ్యాప్తంగా అందిస్తామన్నారు.

RJD Manifesto: కోటి ఉద్యోగాలు ఇస్తాం, రక్షా బంధన్‌కు యువతులకు లక్ష .. ఆర్జేడీ మ్యానిఫెస్టోలో ఇంకా..

RJD Manifesto: కోటి ఉద్యోగాలు ఇస్తాం, రక్షా బంధన్‌కు యువతులకు లక్ష .. ఆర్జేడీ మ్యానిఫెస్టోలో ఇంకా..

లోక్‌సభ 2024 ఎన్నికలు(Lok Sabha elections 2024) మరికొన్ని రోజుల్లో మొదలు కానున్నాయి. ఈ నేపథ్యంలోనే అనేక రాష్ట్రాల్లో ప్రధాన పార్టీల అభ్యర్థులు పోటాపోటీగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే బీహార్ మాజీ డిప్యూటీ సీఎం, RJD నేత తేజస్వి యాదవ్‌(Tejashwi Yadav)తో పాటు ఇతర పార్టీ నేతలు 'పరివర్తన్ పత్ర' పేరుతో 2024 లోక్‌సభ ఎన్నికల మ్యానిఫెస్టోను(RJD Manifesto) విడుదల చేశారు.

Viral Video: 'ఫిష్ మీల్' వీడియోపై నిలదీసిన బీజేపీ, మీ 'ఐక్యూ' ఇంతేనా అని ప్రశ్నించిన  తేజస్వి

Viral Video: 'ఫిష్ మీల్' వీడియోపై నిలదీసిన బీజేపీ, మీ 'ఐక్యూ' ఇంతేనా అని ప్రశ్నించిన తేజస్వి

లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో బీజీగా ఉన్న బీహార్‌ మాజీ ఉప ముఖ్యమంత్రి, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ లంచ్ బ్రేక్‌లో చేపకూరతో భోజనం తీసుకోవడం, ఆయనే స్వయంగా ఇందుకు సంబంధించిన వీడియో పోస్ట్ చేయడం సోషల్ మీడియోలో వైరల్ అయింది. దీనిపై బీజేపీ విమర్శలు గుప్పించగా, మీ 'ఐక్యూ' ఇంతేనా అంటూ తేజస్వి కౌంటర్ ఇచ్చారు.

Loksabha Polls: కుటుంబం కోసమే లాలు తపన.. బీజేపీ తీవ్ర విమర్శలు

Loksabha Polls: కుటుంబం కోసమే లాలు తపన.. బీజేపీ తీవ్ర విమర్శలు

రాష్ట్రీయ్ జనతాదల్ అధినేత లాలు ప్రసాద్ యాదవ్‌పై భారతీయ జనతా పార్టీ తీవ్ర విమర్శలు చేసింది. ఆయనకు కుటుంబ సభ్యులే ముఖ్యం అని మండిపడింది. లోక్ సభ ఎన్నికల తొలి జాబితాను ఆర్జేడీ విడుదల చేసింది. అందులో లాలు ఇద్దరు కూతుళ్లకు టికెట్ దక్కింది. దాంతో లాలు ప్రసాద్ యాదవ్ లక్ష్యంగా బీజేపీ విమర్శలు చేసింది.

Lok Sabha Elections: ముఖేష్ సహనీ వీఐపీతో ఆర్జేడీ పొత్తు... 3 సీట్లు కేటాయింపు

Lok Sabha Elections: ముఖేష్ సహనీ వీఐపీతో ఆర్జేడీ పొత్తు... 3 సీట్లు కేటాయింపు

బీహార్ లోక్‌సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పట్టుదలగా ఉన్న రాష్ట్రీయ జనతా దళ్ మరో పార్టీతో శుక్రవారంనాడు చేతులు కలిపింది. ముఖేష్ సహనీ సారథ్యంలోని వికాస్‌‌శీల్ ఇన్సాన్ పార్టీతో పొత్తు పెట్టుకుంది. పొత్తులో భాగంగా ఆ పార్టీకి 3 సీట్లు కేటాయించింది. రెండు పార్టీల నేతలు మీడియా సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు.

LS Polls: కాంగ్రెస్, ఆర్జేడీ మధ్య చిచ్చు రేపుతున్న పూర్నియా సీటు..

LS Polls: కాంగ్రెస్, ఆర్జేడీ మధ్య చిచ్చు రేపుతున్న పూర్నియా సీటు..

లోక్‌సభ ఎన్నికల్లో పొత్తులతో కాంగ్రెస్‌లో టికెట్లు దక్కని నేతలతొ ఆ పార్టీ ఇబ్బందులు ఎదుర్కొంటుంది. కొంమతంది నేతలు టికెట్ రాకపోవడంతో పార్టీ మారుతుంటే.. మరికొందరు నేతలు ఇండిపెండెంట్ అభ్యర్థులుగా పోటీ చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు.

Lok Sabha Elections: బీహార్‌లో కాంగ్రెస్‌ను వెంటాడుతున్న కష్టాలు.. పొత్తులతో లాభమా.. నష్టమా..!

Lok Sabha Elections: బీహార్‌లో కాంగ్రెస్‌ను వెంటాడుతున్న కష్టాలు.. పొత్తులతో లాభమా.. నష్టమా..!

కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని వరుసగా మూడోసారి అధికారం లోకి రాకుండా అడ్డుకునే ప్రయత్నంలో భాగంగా.. ఎన్టీయే (NDA) కూటమి వ్యతిరేక పార్టీలను ఏకం చేసి ఇండియా పేరుతో కూటమి కట్టాయి. కాంగ్రెస్ (Congress) నేతృత్వంలోని యూపీఏ కూటమి స్థానంలో వివిధ పార్టీల కలయికతో ఇండియా కూటమి ఏర్పడింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి