Home » Reservations
ముస్లిం రిజర్వేషన్లకు ఎలాంటి ఢోకా ఉండదని.. ఈ రిజర్వేషన్లు కొనసాగుతాయని ఎమ్మెల్సీ మహ్మద్ ఇక్బాల్ (MLC Iqbal) తెలిపారు. ముస్లింలకు మత ప్రాతిపదికన ఇచ్చిన రిజర్వేషన్లు రద్దు చేయాలంటూ సుప్రీం కోర్టులో పిటిషిన్ వేసింది వైసీపీ (YSRCP) ఎంపీ ఆర్ క్రిష్టయ్య కాదా? అని ప్రశ్నించారు. రిజర్వేషన్లు తీసేస్తారంటూ కొంతమంది వైసీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
రిజర్వేషన్లు తీసేయడం ఆర్ఎస్ఎస్ లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి(CM Revanth Reddy) అన్నారు. ఆర్ఎస్ఎస్ విధానాలపై తాను స్పష్టంగా మాట్లాడానని అన్నారు.రిజర్వేషన్లు రద్దు చేయాలనేది ఆర్ఎస్ఎస్ మూల సిద్ధాంతామని తెలిపారు. ఆర్ఎస్ఎస్ రాజకీయ కార్యాచరణ పేరే బీజేపీ అని చెప్పారు.
మొన్న సిద్దిపేటలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) మాట్లాడిన మాటలను కాంగ్రెస్ నేతలు మార్పింగ్ చేశారని మెదక్ బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు (Raghunandan Rao) అన్నారు. గజ్వేల్ పట్టణంలో బుధవారం ఓ ఫంక్షన్ హల్లో బీజేపీ ఓబీసీ సామజిక సమ్మేళనం జరిగింది. ఈ సమావేశానికి రఘునందన్ రావు, బీజేపీ కీలక నేతలు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు.
రిజర్వేషన్లపై(Reservations) అధికార ఎన్డీఏ, ప్రతిపక్ష ఇండియా కూటమి మధ్య రోజు రోజుకీ మాటల యుద్ధం జరుగుతున్న వేళ ఆర్ఎస్ఎస్(RSS) చీఫ్ ఈ అంశంపై తమ వైఖరిని స్పష్టం చేశారు.
రిజర్వేషన్ల విషయంలో కేంద్ర హోం మంత్రి అమిత్షా భరోసా ఇచ్చారు. రిజర్వేషన్లకు స్వస్తి చెప్పేందుకు బీజేపీ ఒక్కనాటికి అనుమతించదని, కాంగ్రెస్ ప్రయత్నించినా అడ్డుకుని తీరుతామని స్పష్టం చేశారు. బీజేపీ రాజకీయాల్లో ఉన్నంత వరకూ రిజర్వేషన్లకు ఎలాంటి ఇబ్బంది రాదని, కాంగ్రెస్ ఆ పని చేసినా అనుమతించేది లేదని అన్నారు.
మరాఠా రిజర్వేషన్ల వివాదం చల్లారడం లేదు. తాజాగా మరోసారి మహారాష్ట్ర ప్రభుత్వానికి మరాఠా రిజర్వేషన్ పోరాట నేత మనోజ్ జారంగే అల్టిమేటం ఇచ్చారు. మరాఠా రిజర్వేషన్ల అంశాన్ని పరిష్కరించకుంటే జూన్ 4వ తేదీ నుంచి మరోసారి తాను ఆమరణ దీక్షకు దిగుతానని ఆదివారంనాడిక్కడ మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
మరాఠా కోటా ఆందోళనలకు సారథ్యం వహించిన ఉద్యమ నేత మనోజ్ జారంగేపై కేసు నమోదైంది. మహారాష్ట్రలోని బీడ్ జిల్లాల్లో పలు చోట్ల రోడ్లను దిగ్బంధించాలంటూ ప్రజలను ఆయన రెచ్చగొట్టారని షిరూర్, అమల్నేర్ పోలీసు స్టేషన్లలో కేసు నమోదు చేశారు.
మరాఠా కమ్యూనిటీకి రెండు క్యాటగిరిల కింద రిజర్వేషన్ పొందే ఛాయెస్ ప్రభుత్వం ఇచ్చినప్పటికీ మరాఠా రిజర్వేషన్ ఉద్యమకారుడు మనోజ్ జారంగే పాటిల్ ) అసంతృప్తి వ్యక్తం చేశారు. తాము డిమాండ్ చేసింది ఒకటయితే, ప్రభుత్వం ఇస్తామన్నది మరొకటి అని ఆయన బుధవారంనాడు చెప్పారు. ఈనెల 24 నుంచి మళ్లీ తాజా ఆందోళనలు మొదలుపెడతామని ప్రకటించారు.
మహారాష్ట్రలో మరాఠా కమ్యూనిటీకి విద్య, ఉద్యాగావకాశాల్లో రిజర్వేషన్ కల్పించేందుకు ఉద్దేశించిన మహారాష్ట్ర రిజర్వేషన్ బిల్లుకు రాష్ట్ర అసెంబ్లీ మంగళవారంనాడు ఆమోదం తెలిపింది. విద్యా సంస్థలు, ఉద్యోగాల్లో మరాఠా కమ్యూనిటీకి 10 శాతం రిజర్వేషన్ కల్పించే ఈ బిల్లును ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే సభలో ప్రవేశపెట్టారు.
మరాఠా కమ్యూనిటీ రిజర్వేషన్ల అంశం మళ్లీ వేడెక్కుతోంది. దీనిపై ప్రభుత్వం వెంటనే ఒక తీర్మానం చేయాలని మఠాఠా రిజర్వేషన్ ఉద్యమ నేత మనోజ్ జారంగే పాటిల్ శుక్రవారంనాడిక్కడ డిమాండ్ చేశారు. రాత్రిలోగా తమ డిమాండ్లు నెరవేరకుంటే శనివారం ఉదయం ముంబై వైపు కదులుతామని హెచ్చరించారు.