Home » RBI
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) నుంచి Paytmకి తాత్కాలిక ఉపశమనం లభించిన విషయం తెలిసిందే. Paytm పేమెంట్ బ్యాంక్పై విధించిన ఆంక్షలు మార్చి 15 వరకు మరో పొడిగిస్తున్నట్లు ఆర్బీఐ శుక్రవారం తెలిపింది. అంతకుముందు పరిమితులకు గడువు ఫిబ్రవరి 29గా ప్రకటించారు.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి Paytmకి కొంత ఉపశమనం లభించింది. ఇప్పుడు Paytm పేమెంట్ బ్యాంక్పై విధించిన ఆంక్షలు మార్చి 15 వరకు మరో 15 రోజుల పాటు పొడిగిస్తున్నట్లు ఆర్బీఐ తెలిపింది.
స్మార్ట్ ఫోన్ల ద్వారా డిజిటల్ లావాదేవీల ధృవీకరణ కోసం చాలకాలంగా వినియోగంలో ఉన్న ఓటీపీ (One Time Password) విధానం మరుగున పడనుందా?.. ఓటీపీ స్థానంలో మరో సరికొత్త టెక్నాలజీ అందుబాటులోకి రానుందా? ఇందుకోసం కేంద్ర బ్యాంక్ ఆర్బీఐ కసరత్తు సిద్ధం చేస్తోందా?.. అంటే ఔననే సమాధానమిస్తున్నాయి రిపోర్టులు.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) బుధవారం పేటీఎం పేమెంట్స్ బ్యాంక్పై తీవ్ర చర్యలు తీసుకుంది. కొత్త కస్టమర్లను చేర్చుకోవద్దని ఆ సంస్థకు ఆదేశాలు జారీ చేసిన ఆర్బీఐ.. ఫిబ్రవరి 29వ తేదీ నుంచి వాలెట్లు, ఫాస్ట్ట్యాగ్లు, డిపాజిట్ లేదా క్రెడిట్ లావాదేవీలు, టాప్-అప్స్ వంటివి అనుమతించబడవని పేర్కొంది.
అయోధ్యలో రామ మందిర్ ప్రాణప్రతిష్ట కార్యక్రమం జనవరి 22న జరగనుంది. ఈ క్రమంలో తాజాగా సెంట్రల్ బ్యాంక్ నియంత్రణలో ఉన్న మనీ మార్కెట్ల ట్రేడింగ్ వేళలను మార్చుతున్నట్లు ఆర్బీఐ ప్రకటించింది.
నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) RBI మార్గదర్శకాల ప్రకారం KYCని అప్డేట్ చేయాలని ఫాస్ట్ట్యాగ్(Fastag) వినియోగదారులను ఆదేశించింది. ఇది చేయకుంటే KYC లింక్ లేని కార్డులు జనవరి 31, 2024 తర్వాత డియాక్టివేట్ చేయబడతాయని ప్రకటించింది.
సోషల్ మీడియా వినియోగం పెరిగిన తర్వాత ఫేక్ న్యూస్ బెడద ఎక్కువై పోయింది. వాస్తవాలకు విరుద్ధంగా జరుగుతున్న ఎన్నో ప్రచారాలు జనాలను అయోమయానికి గురిచేస్తున్నాయి. ఇటీవల ఇలాంటిదే ఒక ప్రచారం జరిగింది. అదేంటంటే నక్షత్రం (*) గుర్తు ఉన్న రూ.500 నోట్లు నకిలీవని దేశంలోని పలు చోట్ల జోరుగా ప్రచారం జరిగింది.
ఆర్థిక రాజధాని ముంబైలో 11 చోట్ల బాంబులు పెట్టినట్టు ఈ-మెయిల్ బాంబు బెదరింపు ఒకటి మంగళవారంనాడు తీవ్ర కలకలం రేపింది. ఆర్బీఐ, మరో రెండు ప్రైవేటు బ్యాంకులను పేల్చివేస్తామని ఈ-మెయిల్ సెండర్ బెదిరించాడు. తాము 'ఖిలాఫత్ ఇండియా'కు చెందినట్టు అతను క్లెయిమ్ చేసుకున్నాడు.
మీరు గోల్డ్ బాండ్స్లో పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నారా? అయితే ఇదే సరైన సమయం.. తాజాగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సావరిన్ గోల్డ్ బాండ్స్ స్కీమ్ సిరీస్ IIIని విడుదల చేసింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో మూడో సారి విడుదల కానున్న ఈ స్కీమ్ సోమవారం (డిసెంబర్ 18) నుంచి ప్రారంభమవుతుంది.
రూ.2,000 నోట్లు 97.26 శాతం బ్యాంకుల్లో జమ అయినట్టు రిజర్వ్ ఆఫ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. ఈ ఏడాది 19 వరకూ సర్క్యులేషన్లో ఉన్న నోట్ల లీగల్ టెండర్ ఇంకా కొనసాగుతోందని తెలిపింది. 2.7 శాతం బ్యాంకునోట్లు ఇంకా సర్క్యులేషన్లో ఉన్నట్టు పేర్కొంది.